Tuesday 16 April 2024

 

            కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి






శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్రీకృష్ణుడు ఇక్కడ వేణుగోపాలుడిగా స్వయంభువుడు. ఆయన తన భక్తుల కోర్కెలు తీర్చటమేకాదు, వారి దీర్ఘ రోగాలను నయం చేస్తాడని ప్రసిధ్ధి.

ఈ స్ధల పురాణం ఏమిటంటే 1953 సంవత్సరంలో ఈ గ్రామములో శ్రీ వనమా సీతారామయ్యగారు అనే షావుకారు తన పొలములోకి సారవంతమైన మట్టి కావాల్సివచ్చి శ్రీ దారా నర్సయ్యగారి పొలం నుండి కొనుగోలు చేశారు. తన పాలేరు శ్రీ కఠారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి తవ్వించబోయారు. మొదటిసారి గడ్డపలుగు వేసిన వెంటనే ఖంగుమని ధ్వని వచ్చిందట. ఎందుకు అలా ధ్వని వస్తోందో అర్థం కాక కొంచెం పక్కనే మళ్ళీ పలుగు వెయ్యగా మళ్ళీ అదే ధ్వని వచ్చిందట. మళ్ళీ పలుగు వెయ్యబోగా ఆ ప్రదేశంనుండి బ్రహ్మాండమైన మిరుమిట్లతో ఒక మెరుపు మెరిసిందట. ఆ కాంతి తీవ్రతకు శ్రీ కఠారు వెంకటేశ్వర్లు మూర్ఛపోయారుట. అది చూసిన మిగతా పనివాళ్ళు ఆందోళనతో అతని ముఖముపై చల్లని నీరు చల్లి కొంచెంసేపు ఉపచర్యలు చేయగా అతడు కొంచెం తేరుకుని తనకేమీ కన్పించటంలేదని అన్నారుట. అపుడు మిగిలినవారంతా కలిసి ఆ ప్రాంతములో నెమ్మదిగా తవ్వి చూడగా ఒక విగ్రహము, దానిదగ్గరే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయ్యాయి. కొందరు వెళ్ళి పొలము యజమానికి, ఊరి పెద్దలకు ఈ విషయము చెప్పారు.

 

ఈ దేవాలయంలో వున్న బావి దగ్గర స్నానం చేసి తడి బట్టలతో స్వామికి ప్రదక్షణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు. దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు వ్యాధి నివారణకోసం ఒక మండలం రోజులపాటు ఇక్కడ స్వామిని సేవిస్తూ, గుళ్ళో నిద్రిస్తారు.

ఇవండీ నెమలి విశేషాలు. అన్నట్లు స్వామిని దర్శించేటప్పుడు పూజారిగారిని అడగండి, స్వామి దగ్గరే వున్న శంఖం, పాచిక చూపిస్తారు. అదేనండీ స్వామితోబాటు దొరికినవి. మేము ముందు తెలియక పాచికను చూడలేదు. మీరు మర్చిపోవద్దు. మరి బయల్దేరుతున్నారా? ఎలా వెళ్ళాలంటే

 

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలిలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి వేణుగోపాల స్వామి స్వయంభువుగా చెప్తారు. ఒకసారి సీతారామయ్య కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిలో మట్టికావాల్సి తమ పనివానికి పెరట్లో కాస్త తవ్వి మట్టి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ నౌఖరు మట్టి తవ్వుతుండగా భూమిలోంచి పిల్లన గ్రోవి ని పట్టుకొన్న స్వామివిగ్రహం పారకు తగిలిందట. ఏమిటో అని పైకి తీయగా పిల్లనగ్రోవి పట్టుకొన్న చేతిలోని చిటికెన వేలు కొద్దిగా తెగిందట. ఆ సంగతి సీతారామయ్యకు చెప్పగా ఆయన ఎంతో పారవశ్యం చెందాడు. ఆ శ్రీకృష్ణుడే మనలను ఉద్ధరించడానికి ఏతెంచాడు అని వానితో చెప్పాడు. వెంటనే స్వామి ని తెలియక చేసిన తప్పును మన్నించమని పదేపదే వేడుకున్నాడు. వెంటనే వెండి పనిచేసే వానిని పిలిచి స్వామి మూర్తికి తగిలిన గాయాన్ని మాన్చమని చెప్పి చేయించారట. స్వామి తమ ఇంట వెలిశారని ఊరందరికి తెలియచేశారట. వెంటనే తాటాకు పందిరి వేసి ఆ పందిరి మహోన్నతమైన దేవాలయంగా భావించమని వేడుకుంటూ అక్కడే వేణుగోపాల స్వామిని ప్రతిష్టించారట. ఇక ఆనాటి నుంచి వారికి కాలం కలసి వచ్చింది. ఆ తరువాత ఊరందరూ స్వామిని చూచి ఆనందంపొంది తమ తమకు కావాల్సిన కోరికలను కోరుకున్నారట. వారందరి కోరికలను స్వామి తీరుస్తూ వచ్చారట. దాంతో స్వామికి ఆనాడు వేసిన తాటాకు పందిరి స్థానంలో చక్కని దేవాలయ నిర్మాణం చేశారు. సంతానార్థులు వచ్చి వేడుకుంటే స్వామి దయవల్ల వారికి సంతానం కలుగుతోందట. ధనార్థులు వచ్చి స్వామిని వేడుకుంటే వారు ధనవంతులు కాగలుగుతున్నారట. విద్యార్థులు వచ్చి తమకు జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటే వారి చదువులో అభ్యుదయాన్ని పొందుతున్నారట. ఇలా స్వామిని ఏది కోరుకుంటే దానే్న సునాయాసంగా ఇచ్చే దేవదేవునిగా వేణుగోపాల స్వామిని ఇక్కడి భక్తులు కొనియాడుతుంటారు. ద్వాపరయుగంలో స్వామి దుష్టులను సంహరించి శిష్టులను కాపాడినట్లే ఈ కలియుగంలోకూడా స్వామి దుష్టులను దునుమాడుతూనే శిష్టులను తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. స్వామి కరుణామృతాన్ని గ్రోలాలని చుట్టుపక్కల ఊర్లనుంచే కాక ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామిని సేవిస్తుంటారిక్కడ.స్వామి మహిమలు ఇన్ని అన్నిఅని చెప్పలేనన్ని ఉన్నాయని స్వామి మహిమ అనుభవైకవేద్యం కావాలి కాని దాన్ని వర్ణించడానికి ఈ మనుజులకు సాధ్యం కాదని ఈ కృష్ణ్భక్తులు అంటున్నారు. కృష్ణాష్టమి నాడు అంగరంగ వైభోగంగా వేణుగోపాలస్వామికి జన్మాష్టమిని భక్తులు ప్రతిఏటా జరిపిస్తారట. అట్లానే దసరా నాడు పాండవులకు చేదోడు వాదోడు ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడి వారిని కురుక్షేత్ర యుద్ధరంగంలో అజేయులుగా నిలబెట్టిన వైనాన్ని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళినాడు లోకకంటకుడైన నరకుని సంహరించిన శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ దీపావళి పండుగనాడు వేణుగోపాల స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. అట్లానే ప్రతి పండుగ నాడు కూడా వేణుగోపాల స్వామికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో అనాదిగా వస్తోంది.భక్తుల ఇచ్చిన విరాళాలతో స్వామికోసం రాజగోపురాలు నిర్మించినట్లుగానే స్వామి సన్నిధిలో భోజనశాలను, వైద్యశాలను, పొంగళ్లశాలను, కల్యాణ మంటపం, కల్యాణకట్ట, అద్దాల మండపం, విశ్రాంతి మందిరం లాంటివాటిని నిర్మించారు. ఇంకా నిత్యాన్నదానం ఏర్పాట్లను కూడా చేయాలని దేవాలయ అధికారులు ఆలోచిస్తూ న్నారు. ఇపుడుమాత్రం విశేషదినాల్లో అన్నదానాన్ని చేస్తున్నారు. స్వామి సన్నిధిలో తమ పిల్లలకు అన్న ప్రాసలు జరిపిస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారనే నమ్మకం భక్తులకు ఉన్నట్లు చెబుతారు. స్వామి సన్నిధిలో వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకొనేవారు నిత్య సంతోషులుగా ఉంటారనీ అంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాటినుంచి స్వామికి బ్రహ్మోత్సవాలను కూడా జరిపిస్తారు. రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాల స్వామికి కల్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. స్నేహితులతో ఆడిపాడిన కృష్ణస్వామిని, గోపికల మానసచోరుడి లీలలను కొనియాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను జరిపిస్తారు. అటు సాంఘిక, పౌరాణిక నాటకాలను వేస్తూ కృష్ణ్భక్తిని ప్రచారం చేస్తున్నారు ఈ కృష్ణ్భక్తులు. నెమలి వేణుగోపాల స్వామి దర్శించిన వారికి తీరని కోరిక అంటూ ఏమీ ఉండదని ఇక్కడి స్థానికుల కథనం. ఈ నెమలి వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్లాలనుకొన్న భక్తులు ఖమ్మం విజయవాడ మార్గంలో ఉన్న మథిర కు వచ్చి అక్కడినుంచి బస్సులలో నెమలి గ్రామానికి చేరుకోవచ్చు.

 

ఆలయం తెరచి వుంచు వేళలు

సోమ, శుక్రవారాలలో ఉదయం అభిషేకం జరుగుతుంది. దీనిలో పాల్గొనదలిస్తే ముందు రోజు రాత్రే అక్కడ వుండటం మంచిది. ఈ రెండు రోజులూ గుడి ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 2 గంటల దాకా తిరిగి సాయంత్రం 3 గంటల నుంచీ దాత్రి 9 గంటల దాకా.

మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట దాకా మళ్ళీ సాయంకాలం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా తెరచి వుంటుంది

 

ఆఫీసు ఫోన్ నెంబర్లు 08673 – 288808, 08673—288633

గోపాలరావు (గదులు అద్దెకిచ్చే వ్యక్తి) 9440269156.

 

 

Wednesday 10 April 2024

 

కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ వితరణ 




శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. స్థానిక హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన భక్తులకు అందరికి కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ వితరణ చేయటం జరిగింది. సమితి సెక్రటరీ గారు మాట్లాడుతూ.. మేము అందరం కలిసి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము, అదేవిధంగా కరోనా సమయంలో కొన్ని వేలమంది కి ఉచిత ఆహారం, నీరు అందివ్వటం జరిగింది, ఆకలితో బాధపడే వారికి ఎదో మా సహాయముగా సేవ చేస్తూ ఉంటాము, ఆదేవింగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో, ఈ ఎస్ ఐ హాస్పిటల్ కూడా ప్రతి రోగులకు మరియు వారి సహాయకులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తుంటం అని సెక్రటరీ బాల మురళి కృష్ణ గారు తెలియచేసారు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరo సందర్భంగా మజ్జిగ వితరణ చేయటం జరిగింది అని సభ్యలు. తులసి కుమార్, దేవేందర్ కొన్నే, విగ్నేష్, వేణు, వెంకటేష్, బాలమురళి కృష్ణ, రవి కుమార్, సూర్యప్రకాష్. జి. వి ఎస్ ప్రకాష్ గారు, మోహన్, రవి,  రఘు..  తెలిపారు  








 

Saturday 16 December 2023

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో


 మహా అన్నదాన కార్యక్రమం.

కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో

శ్రీహనుమాన్ దేవాలయం



 సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అనే(ఒంగోలు ఎద్దు) గోశాలలో ఒక మహా నంది లాగా ఉన్నటువంటి. దానికి ఈ మధ్య కాలంలో కొంత అనారోగ్యం వలన శివైక్యం చెందటం జరిగింది.. ఆ కుబేరుడి ని చిన్నప్పటి నుంచి పోషించే, అక్కడ ప్రతి రోజు సేవ చేసే భక్తులు, కుబేరుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక పోయారు. చాలా చిన్నతనం నుంచి మేము చేసుకున్నాం అని..దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కర్మ కాండలు కూడా చేశారు, అలాగే ఈ.రోజు. ఆదివారం.17.12.23. దాని పేరుతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కామధేనువు సేవాసమితి సభ్యులు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు, అందరూ ఆహ్వానితులే అని చెప్పారు

Thursday 9 November 2023

 

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేవేందర్ కొన్నే


అవినీతి రహిత సమాజంకోసం, ప్రజల్లో అవగాహనా కలిపిస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, కరోనా సమయంలో కూడా ప్రజలకు అవగాహనా కలిపిస్తూ వేలాదిమందికి ఆహారం అందిస్తూ, ప్రభుత్వంలో జరిగే అవినీతి ప్రశ్నిస్తూ, ఉండే విద్యావంతుడు,  దేవేందర్ కొన్నే సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు ఫౌండేషన్ నామినేషన్ వేయటం జరిగింది

 అవినీతి రహిత పాలనే ద్యేయంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేవేందర్ కొన్నే 



అవినీతి రహిత సమాజంకోసం, ప్రజల్లో అవగాహనా కలిపిస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, కరోనా సమయంలో కూడా ప్రజలకు అవగాహనా కలిపిస్తూ వేలాదిమందికి ఆహారం అందిస్తూ, ప్రభుత్వంలో జరిగే అవినీతి ప్రశ్నిస్తూ, ఉండే విద్యావంతుడు,  దేవేందర్ కొన్నే సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు ఫౌండేషన్ నామినేషన్ వేయటం జరిగింది

Wednesday 16 August 2023

 మానసిక వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం  

కామధేనువు సేవాసమితి 


అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే| జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి !

ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న మానసిక అసుపత్రి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించబడిన పురాతన ఆరోగ్య సంస్థల్లో ఇదీ ఒకటి.[1] తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆసుపత్రి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే మానసిక ఆరోగ్య రోగులకు సేవలు అందిస్తోంది. 600 పడకలతో ఉన్న ఈ హాస్పిటల్ లో రోజుకు దాదాపు 300 మందికి పైగా వివిధ రాష్టాల నుండి అవుట్ పేషేంట్స్ వస్తుంటారు, వారందికీ ఆహారం కొంత ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని కామధేనువు సేవాసమితి వారు ప్రతి అమావాస్య, పొర్ణమి రోజులలో అందరికి అన్నదానము చేస్తున్నారు

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. ఈ కార్యక్రమంలో సమితి ప్రసిడెంట్ దేవేందర్ కొన్నే, వేంకటేష్, రుక్మిణి, తులసి కుమార్, విగ్నేష్, సూర్య ప్రకాష్, సంధ్య , రాజేష్, సత్తార్ మరియు ఇతర సభ్యులు పాల్గొనటం జరిగింది




Wednesday 21 June 2023

 

అన్ని మతాల ఆచారాలు, సంస్కృతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.




తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  బుధవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో లోక కళ్యాణార్ధం నిర్వహించిన శాంతియాగం, చండీహోమం పూర్ణాహుతి లో పాల్గొన్నారు. ఆలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వివిధ భాషలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు బోనాలు, గణేష్ నవరాత్రులు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలను  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చి ల అభివృద్ధి కి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి లక్షల మంది భక్తులు వచ్చారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి  ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్నాయని,  ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు తగినట్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన పండుగలు నేడు దేశ విదేశాలలో జరుపుకోవడం మన అందరికీ గర్వకారణం అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అనేక దేవాలయాలను  ప్రభుత్వం  అభివృద్ధి చేసిందని అన్నారు. సుమారు 1200 కోట్ల రూపాయల వ్యయంతో  చరిత్రలో నిలిచి పోయే విధంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...