ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన వీణ వాణి..
ఒకేసారి
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా
ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్లో 63.32 శాతం మంది
తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో
అవిభక్త కవలలు వీణ, వాణి తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్లో వారిద్దరూ ఫస్ట్
క్లాస్లో పాసయ్యారు. ఇంటర్లో సీఈసీ కోర్సును అభ్యసించిన వీణకు 712, వాణికి 707 మార్కులు వచ్చాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.. వీణ, వాణిలకు ప్రత్యేక
శుభాకాంక్షలు తెలిపారు. వారి ఉన్నత చదువులకు, భవిష్యత్కు అవసరమైన అన్ని సదుపాయాలు
కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీణ, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ
ఉంటుందని పేర్కొన్నారు. వీణ – వాణిల చదువుకు సహకరించిన అధికారులను మంత్రి సత్యవతి
రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. అయితే వీరిద్దరూ ఇంటర్ పరీక్షలు స్వయంగా
రాశారు. ఇక పదో తరగతిలోనూ వీణ, వాణి ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ
సాధించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి
దంపతులకు 2003వ సంవత్సరంలో తలలు అతుక్కుని వీణ-వాణి ఇద్దరు కవలలు పుట్టారు.
పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల వరకు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు
దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్ హోమ్లో గడుపుతున్నారు. వీరిని
విడదీయాలనే వైద్యుల ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలంకాలేదు. ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్
పరీక్షలు రాసేందుకు వీణ-వాణి కవలలకు ఇంటర్ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు
కల్పించింది. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణ వాణిలు చాటెడ్
అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని తెలపడం గమనార్హం. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది
విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది
విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 464892 విద్యార్థులకు
గాను 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది
ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్
అయ్యారు. ఇక సెకండియర్లో 67.96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్
ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు.
ఫస్టియర్లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్టియర్ ఫలితాల్లో
మేడ్చల్ జిల్లా ఫస్ట్, హన్మకొండ రెండవ స్థానంలో నిలిచాయి. పాస్ కాని
విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి
సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. పూర్తి వివరాలను https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో
చూడొచ్చు.