ఏడూ శనివారముల వెంకన్న స్వామిని
దర్శనం చేసుకున్న కామధేనువు సేవాసమితి సభ్యులు..
ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో
కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ
వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా
పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ
తీరుతాయని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు
వస్తుంటారు. అందమైన ప్రకృతి కి నిలయమైన తూర్పగోదావరి జిల్లాలో, తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన
ఆత్రేయపురానాకి కూత వేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు.
నారదమహర్షి వేంకటేశ్వరుడిగా నామకరణం చేసి తన
స్వహస్తాతో ప్రతిష్టించిన విగ్రహమే వాడపల్లి వేంకటేశ్వర విగ్రహం. ఈ క్షేత్రాన్ని
కోనసీమ తిరుపతి అని కూడా అంటారు. ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు రాతితో చేయబడినది
కాదు.
చెక్కతో చేయబడినది. ఇందుకు సంబంధించిన పురాణ కథనం
ప్రకారం. శ్రీ క`ష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి
చేరుకొంటాడు. దీంతో ద్వాపర యుగం అంతమించి అప్పుడప్పుడే కలియుగం ప్రారంభమవుతూ
ఉంటుంది.
ఈ సమయంలో కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి
డబ్బు సంపాదన పై ఎక్కువ ద`ష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూ
మండలం పై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడుతారు
నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలం పై జరుగుతున్న
విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా
రక్షించాల్సిందిగా వేడుకొంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు.
ఇప్పటి వరకూ ఏదేని ఒక ఉపద్రవం సంభవించినప్పుడు అప్పటి
పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను. అయితే ఆ అవతారంలో తనకు
అర్చనలు జరగలేదు. అయితే ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో
పూజలు అందుకొంటానని చెబుతాడు.
దీని వల్ల వారిలో భక్తి భావం పెరుగుతుందని
అభయమిస్తాడు. ఇందు కోసం ఇప్పటి వాడపల్లిలో స్వయంభువుగా వెలుస్తానని వారికి
వివరిస్తాడు. దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. కాగా ఇప్పటి
వాడపల్లినే పూర్వం నౌకాపురమనే పేరుతో పిలిచేవారు.
ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు
లక్ష్మీ సమేతుడై వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదీ లో ఓ చందనం పెట్టె తీరం వైపు
వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రజలు దానిని తీసుకురావడానికి వెళితే నదిలో ఆ
పెట్టే కనిపించదు.
చివరికి అశరీర వాణి రూపంలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ
సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న
ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెలితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది.
భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తాడు.
దీనిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్షీ దేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడకు
నారదుడు వచ్చి జరిగిన కథ మొత్తం వారికి చెబుతాడు.
అంతేకాకుండా ఆ మూర్తికి ‘వేం' అంటే ‘పాపాలను' ‘కట'
అంటే పోగొట్టేవాడు. అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని
ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది.
అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.
అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది.
ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా
ఓడలకు అధిపతి. ఓకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో
కొట్టుకుపోయాయి.
దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే
నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని
నిర్మిస్తానని చెప్పాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు
ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతాయి.
ఇక్కడ 7 వారాలు 7 ప్రదక్షిణాలు
చేస్తే ఎటువంటి కోరికైనా తీరుతుంది
·
తిరుపతి, ద్వారకా
తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం
వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది
దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున, లోల్లకు ఆనుకొని ఉండుటతో
లోల్లవాడపల్లిగా పిలుస్తారు.
·
ఇక్కడి దేవాలయములోని మూర్తి
ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు
శిలలాగే ఉంటుంది. ఇక్కడకల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విదంగా ఉంది.
వైకుంటంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకొన వచ్చి భూలోకమున పాపము
పెరుగుతున్నది. అధర్మం, అన్యాయం పెరుతున్నవి. వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు.
అపుడు విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే
కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను
కడుగుచున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ
సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ
విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.
·
కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో
కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు
కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ద బ్రాహమణుడి కలలో స్వామి
కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ సుచిగా
గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీగర్భంలోకి వెళితే
కృష్ణగరుడపక్షి వాలి ఉన్నచోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు
స్వామి ఆదేసానుసారం వెళ్లగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో
తెరిపించగా దానిలో శంఖ,చక్ర, గదాయుదుడైన
నారాయుణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విసేషాలతో ఆ
అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి
పూజించుట ప్రారంభిస్తారు.
·
పూర్వపు ఆలయం నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ
గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే
అగ్నికులక్షత్రియుల కుటుంబం నిర్మించారు
గోదావరి వడ్డున ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చినెలలో సర్వ ఏకాదశి రోజునుండి ఐదు రోజులపాటు జరిగే
కళ్యాణోత్సవాలు తిరునాళ్ళకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో
ప్రత్యేకత ఊరిలోగల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ ఐదురోజులు అన్నసంతర్పణ
కార్యక్రమములు ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్ళే
భక్తులను భోజనానికి మావద్దకు రండిఅంటే మావద్దకురండి అని పిలుస్తూంటారు.
హైదరాబాద్, సనత్ నగర్ లోని కామధేనువు సేవాసమితి సభ్యులు శనివారం స్వామి దర్శనం చేసుకొని ఆలయ ప్రతిష్టతను చెప్పటం జరిగింది!!