<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"
crossorigin="anonymous"></script>
నాడు నేడు!
గద్దర్ పేరు వినిపించగానే.. మెడలో ఎర్ర కండువా, చేతిలో కర్ర, తెల్ల పంచా, నెరిసిన జుట్టుతో నరాలు
ఉప్పొంగే, రక్తం మరిగే పాటలతో ఓ రూపం మన కళ్ల ముందు అలా కదిలాడుతుంది. కానీ, అదంతా
అప్పుడు.. ఇప్పుడు గద్దర్ మోడ్రన్గా మారిపోయారు. ఎలా అంటే ఠక్కున చూస్తే అసలు ఈయన గద్దరేనా
అనిపించేలా.. ఆయన మాట్లాడితే తప్ప ఆయన్ని చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సూటూ..
బూటూ.. మెడలో టై ఫుల్ బ్లాక్ హెయిర్తో గద్దర్ న్యూ లుక్ అందర్నీ విస్మయానికి గురి చేసింది యాదాద్రి
లక్ష్మీనరసింహ స్వామిని ఇవాళ కుటుంబ సమేతంగా గద్దర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా
కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ఎంతో
కృషి చేశారని.. కానీ, ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
మాత్రం పూర్తిగా ప్రజలదేనన్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులను
చూస్తే ఆ దేవదేవుడే నడిచొచ్చి భక్తులను ఆహ్వానిస్తున్నాడా అనిపించిందన్నారు. తాను
పాటలు రాసేటప్పుడు ప్రకృతితో పరవశించి పోయేవాడినని.. భగవంతుని సన్నిధిలో కూడా అంతే
అనిపించింది అని గద్దర్ అన్నారు. "తెలంగాణ
రాష్ట్రం వస్తే నీకు బ్రహ్మాండమైన పూజలు చేస్తామని నరసన్నను వేడుకున్నారు. ఆ మాట
ప్రకారమే ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇక్కడ శిల్ప కళను చూస్తున్నప్పుడు మరో
ప్రపంచంలోకి పోతున్నట్లు అనిపిస్తుంది. అర్చకులు, సిబ్బంది
ఆప్యాయంగా భక్తులను ఆహ్వానించి దర్శనం చేయించడం ఎంతో ఆదర్శంగా అనిపిచ్చింది. ఈ
పవిత్రమైన దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆలయాన్ని అభివృద్ధి
చేసిన కేసీఆర్కు ధన్యవాదాలు. భగవంతుని సన్నిధిలో నాకెంతో ప్రశాంతత కలిగింది"
అని గద్దర్ అన్నారు.
కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...