ఒక్క పొలిసు కేసు కూడా లేని గ్రామం
ఆ కేసును కూడా కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒక్క కేసు
కూడా లేని గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ మాటలను నేరుగా కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ గ్రామానికి వచ్చిన ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసులు లేని
గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచిందని అభినందించారు.
గ్రామానికి చెందిన ఏకైన కేసుకు సంబంధించి
ఇరువర్గాల వారు రాజీపడటంతో.. ఆ కేసును కూడా
కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇరువర్గాలు రాజీపడి తమకు తామే తీర్పు
ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. దీన్ని రికార్డులో నమోదు చేసి భద్రపరుస్తామన్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో
ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తున్న గ్రామ పెద్ద నాగన్నగారి సిద్ధరాంరెడ్డిని జడ్జి ఈ సందర్భంగా
సన్మానించారు.