Monday 15 August 2022

 ఒక్క పొలిసు కేసు కూడా లేని గ్రామం

                                    ఆ కేసును కూడా కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. 


ఈరోజుల్లో పోలీసు కేసు అనేది చాలా సర్వసాధారణమైంది. చీటికిమాటికి కూడా కేసులు పెట్టుకుండే కాలంలో ఆ ఊర్లో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంట. నమ్మరా..? ఒక కేసు అయిందిలే అది కూడా రాజీ అయిపోంది అనుకోండి. ఇప్పుడయితే ఒక్క కేసు కూడా లేని గ్రామంగా ఆ ఊరు రికార్డులోకి ఎక్కింది. ఆ ఊరి చరిత్ర తెలుసుకున్న జడ్జి నేరుగా ఆ ఊరికే వెళ్లి అక్కడి గ్రామ పెద్దతో పాటు.. గ్రామస్తులు అందర్నీ అభినందించారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒక్క కేసు

 కూడా లేని గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ మాటలను నేరుగా కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు.

 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ గ్రామానికి వచ్చిన ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసులు లేని

 గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచిందని అభినందించారు.


గ్రామానికి చెందిన ఏకైన కేసుకు సంబంధించి ఇరువర్గాల వారు రాజీపడటంతో.. ఆ కేసును కూడా

 కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇరువర్గాలు రాజీపడి తమకు తామే తీర్పు

 ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. దీన్ని రికార్డులో నమోదు చేసి భద్రపరుస్తామన్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో

 ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తున్న గ్రామ పెద్ద నాగన్నగారి సిద్ధరాంరెడ్డిని జడ్జి ఈ సందర్భంగా

 సన్మానించారు.

2 comments:

  1. గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం జరిగిన చిన్నరోడ్డు ప్రమాదంలో ఇరువురు కేసు మూసివేతకు అంగీకారం తెలుపడంతో కేసును జడ్జీ అదే స్టేజీపై కొట్టివేశారు

    ReplyDelete
  2. ఈ గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...