పెట్రోల్, డీజిల్
ధరలు జీఎస్టీ
పరిధిలోకి?
కేంద్రం ఎక్సైజ్
సుంకాన్ని తగ్గించిన తర్వాత కూడా దేశంలో ఇంధన ధరలు అధికంగానే కొనసాగుతున్నాయి.
గడిచిన రెండు నెలల్లో ధరల పెంపు లేనప్పటికీ, ద్రవ్యోల్బణం
పరిస్థితుల నేపథ్యం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో
పెట్రో రేట్లు భారీగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. పూర్తి వివరాలివే..
కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్
మీటింగ్ మొదలైంది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో జీఎస్టీ పరిధిలోకి
పెట్రోల్ అంశంపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై ఉత్కంఠ
నెలకొంది. (ప్రముఖ బిజినెస్ పోర్టల్స్ లో వెలువడుతోన్న రిపోర్టుల ప్రకారం, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి
తీసుకువస్తే.. ధర ఏకంగా రూ. 30 మేర
దిగిరావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్
జీఎస్టీ పరిధిలోకి వస్తాయంటూ ప్రధాన్ మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్
చైర్మన్ వివేక్ దెబ్రోయ్ చెప్పడం ఈ వార్తలకు బలం చూకూర్చినట్లయింది. ప్రముఖ
బిజినెస్ పోర్టల్స్ లో వెలువడుతోన్న రిపోర్టుల ప్రకారం, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి
తీసుకువస్తే.. ధర ఏకంగా రూ. 30 మేర
దిగిరావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్
జీఎస్టీ పరిధిలోకి వస్తాయంటూ ప్రధాన్ మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్
చైర్మన్ వివేక్ దెబ్రోయ్ చెప్పడం ఈ వార్తలకు బలం చూకూర్చినట్లయింది. కేంద్ర
ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై
25 శాతం వరకు పన్నులు విధిస్తోంటే, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా
దాదాపు 20 శాతం పన్ను వసూలు
చేస్తున్నాయి. ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే గరిష్ట పన్ను రేటు 28 శాతంగా ఉండొచ్చు. అప్పుడు
పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 33 మేర తగ్గే ఛాన్స్ ఉంది. ఇక నేటి ఇంధన ధరలను పరిశీలిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్
కంపెనీలు మంగళవారం (జూన్ 28)నాడు
చేసిన ప్రకటనలో రేట్లు పెంచలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రో ధరలు పెరగ్గా, మే 21న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని
తగ్గించడం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధర కొద్దిగా దిగొచ్చింది. హైదరాబాద్లో సోమవారం పెట్రోల్
రేటు లీటరుకు రూ.109.66గా, డీజిల్ రేటు రూ.97.82 గా కొనసాగుతోంది. తెలంగాణలోని
ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పట్టణాల్లో ఇంధన కొరత
కారణంగా బంకుల వద్ద భారీ రద్దీ కనిపించిందిఏపీ విజయవాడలో పెట్రోల్ ధర లీటరు
రూ.112.09గా, డీజిల్ లీటరు రూ.99.65గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్
లీటరు రూ. 110.46గా, డీజిల్ లీటరు రూ. 98.25గా ఉంది. దేశరాజధాని
ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక
రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్
రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్
రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో
పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్
రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. అంతర్జాతీయ
మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 1.07 శాతం పెరిగి బ్యారెల్ ధర 110.64 డాలర్లకు చేరింది. బ్రెంట్
క్రూడ్ ధర 1.08 శాతం తగ్గి పెరిగి బ్యారెల్ 116.17 డాలర్లుగా ఉంది.
No comments:
Post a Comment