Thursday 22 December 2022

 

పెళ్లి చేసుకుందామంటే మాకు పిల్ల దొరకడం లేదు మహారాష్ట్రలో వినూత్న నిరసన.

 



వాళ్లందరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతో ఇంతో కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకోవాడానికి పిల్ల దొరక్కపోవడంతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు. పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, వధువుల కోసం వెతికి వెతికి విసిగిపోయారు. ఒక పక్క వయుస్సు అయిపోతున్నా..వివాహం కాకపోవడంతో మానక్షిక క్షోభకు గురవుతున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదేంటి అని బాధపడే అబ్బాయిల సంఖ్య రోజురోజుకి ఎక్కవయిపోయింది. దీంతో తమకు పెళ్లి కావడం లేదని యువకులందరూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 గుర్రాలపై వచ్చి నిరసన

తమకు పెళ్ళీడు వచ్చినా.. పెళ్లికావడం లేదంటూ చాలామంది యువకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు పెళ్లికాకపోవడాన్ని ప్రభుత్వానిదే తప్పు అని ఎత్తి చూపుతూ గుర్రాలపై కలెక్టరేట్ కార్యాలయంకు ఊరేగింపుగా వచ్చి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో పెళ్లికొడుకు వేషాధారణలో గుర్రాలపై వచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయించారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడంతో లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోందని ఆరోపించారు. ఈ కారణంతోనే తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని విమర్శించారు. ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది


 ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు 

న్యూ మిలీనియం హైస్కూల్, జమ్మికుంట 







భారతదేశం గర్వించే దగ్గ శాస్త్రవేత్త గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ అని న్యూ మిలీనియం స్కూల్స్ చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని న్యూ మిలీనియం హైస్కూల్లో గణిత దినోత్సవ వేడుకలను పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి ప్రారంభించారు, అనంతరం విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు పజిల్స్ ప్రముఖ శాస్త్రవేత్తలు సాధించిన విషయాలను చార్టుల ద్వారా ఉపాధ్యాయులకు సాటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్  తో అతిపెద్ద గుణకారం,కూడికలు, తీసివేతలు, రూట్స్, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అతి తక్కువ సమయంలో సులువుగా విద్యార్థులు చెప్పడం జరిగిందని వారు అన్నారు, అనంతరం పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం న్యూ మిలీనియం స్కూల్స్లో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని విద్యార్థులకు గణిత సబ్జెక్టు పై అవగాహన కల్పిస్తూ ఆ సబ్జెక్టు పై భయం అనేది లేకుండా లెక్కలను సులువైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే దానిపై వారికి చక్కటి అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన నివాళులర్పించామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ విశ్వనాథరెడ్డి వరుణ్ రెడ్డి ఇన్చార్జి తిరుపతిరెడ్డి గణిత అధ్యాపకులు శంకర్ కిరణ్ రమేష్ నవీన్ సారయ్య రాజు రాధిక పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...