Monday 11 July 2022

 

ప్రపంచ జనాభా దినోత్సవం చైనాను మించిపోతుందా!!


1950 తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4 బిలియన్ల (1040 కోట్లు)కు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతున్నారు.

కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమానంగా జరుగుతోంది.

వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోనే ఈ అధిక జనాభా రేటు నమోదవుతుందని చెప్పింది.

అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు ప్రతీ మహిళకు సగటున 2.1 కంటే తగ్గిపోయింది. 61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం 1 శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.

ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. చైనాలో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభాలో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటించింది. దేశంలో 'ఒకే బిడ్డ' అనే విధానాన్ని విడిచిపెట్టి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గుతోంది.

భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది.

జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.

సైన్స్, మెడిసిన్ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగుదలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాల రేటు తగ్గిపోవడంతో పాటు, ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050 నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.

కానీ, దీని ప్రకారం జనాభాలో 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10 శాతంగా ఉండగా, 2050 నాటికి 16 శాతానికి పెరుగుతుంది. ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.

ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ వచ్చే ఏడాది 1.4 బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ నాటికి 800 కోట్లకు చేరనుంది.

 

 

 

 

 

లోన్‌ యాప్‌ వేధింపులు ….వివాహిత ఆత్మహత్య

లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి రూ.20,000 లోన్‌ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. రుణం తీర్చకపోతే బంధువులకు ఫోన్‌ చేసి చెప్తానని సైబర్‌ నేరగాళ్లు భయపెట్టారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

చట్టబద్ధమైన రాజ్యాంగమే లేని బ్రిటన్

భారత్‌లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి? పాలన ఎలా సాగించాలి? న్యాయవ్యవస్థ ఎలా పని చేయాలి? అనే విషయాలను స్పష్టంగా రాజ్యాంగంలో రాశారు.

రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీని నియమించారు. రాసిన రాజ్యాంగం మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత దాన్ని ఆమోదించారు.

కానీ బ్రిటన్ రాజ్యాంగం అలా కాదు. అది 'అన్‌రిటెన్ కాన్‌స్టిట్యూషన్' అంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం రాసి చర్చించి, ఆమోదించి ఒక అధికారిక పత్రంలోనమోదు చేసినది కాదు. రాజ్యాంగంలోని నిబంధనలు చట్ట ప్రకారం కాకుండా సంప్రదాయాలు, ఆచారాల రూపంలో వస్తుంటాయి. న్యూజీలాండ్, ఇజ్రాయిల్ దేశాల రాజ్యాంగాలు కూడా ఇదే విధంగా ఉంటాయి.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని గుర్తించడానికి నాటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిరాకరించారు. అప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ అమెరికా రాజ్యాంగంలోని 20వ సవరణను గుర్తు చేశారు. పాత, కొత్త అధ్యక్షుల మధ్య అధికార బదిలీ ప్రక్రియ గురించి అది చెబుతోంది.

ఇటీవల సొంత పార్టీ ఎంపీల ఒత్తిడికి తలొగ్గి బ్రిటన్ ప్రధాని పదవి నుంచి త్వరలోనే దిగిపోతానని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కానీ ఆయన ఎంత కాలంలో దిగిపోవాలో చెప్పే రాజ్యాంగ నిబంధనలు ఏమీ లేవు. ఒకవేళ అసలు నేను దిగిపోను అని బోరిస్ అంటే ఏం చేయాలో రాజ్యాంగంలో లేదు.

బ్రిటన్‌లో రాజ్యాంగ నియమాలు అనేవి చట్ట ప్రకారం కాకుండా రాజకీయ నేతల నైతిక బాధ్యతల రూపంలో అమల్లో ఉంటాయి.

'ప్రధానిని ఎలా నియమించాలో ఎలా తొలగించాలో చెప్పే చట్టాలు బ్రిటన్‌లో లేవు. కానీ రాజకీయ నాయకులు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తారని ప్రజలు భావిస్తారు' అందువల్లే తన పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకున్నా ప్రధానిగా బోరిస్ జాన్సన్ వెంటనే దిగి పోవాలని చెప్పే చట్టాలు ఏమీ లేవు.

గతంలో బోరిస్ జాన్సన్‌కు ముందు ప్రధానులుగా ఉన్న థెరిసా మే, డేవిడ్ కామెరూన్‌లు కూడా ఇలాగే కన్జర్వేటివ్ పార్టీకి కొత్త లీడర్ వచ్చే వరకు అధికారంలో కొనసాగారు.

రాజ్యాంగం అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. అంటే చట్టపరమైన పత్రం. ఒక దేశంలోని ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలో ఎలా పాలించాలో అది తెలియజేస్తుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు, నియమాలు అన్ని స్పష్టంగా రాజ్యాంగంలో రాసి ఉంటాయి. భారత రాజ్యాంగం అందుకు మంచి ఉదాహరణ.

కానీ బ్రిటన్ రాజ్యాంగం అలా కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, చట్టాలు కలిసి ఆ దేశ రాజ్యాంగంగా రూపొందాయి.

స్పష్టంగా రాయని రాజ్యాంగం మంచిదే అనే వారు ఉన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతాయనేది దీన్ని సమర్థించే వారి వాదన.

కానీ ఇలా ఒక చట్టబద్ధమైన రాజ్యాంగం లేక పోవడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. స్పష్టమైన లీగల్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల పాలనలో గందరగోళానికి దారి తీస్తుందని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆ సంప్రదాయాలను అన్వయించుకుంటారని వాదించే వారు ఉన్నారు.

2019లో బ్రెగ్జిట్ సంక్షోభం ఏర్పడినప్పుడు బ్రిటన్ పార్లమెంటును రద్దు చేయాలా వద్దా అనే అంశం మీద ప్రభుత్వం, సుప్రీం కోర్టు మధ్య విభేదాలు తలెత్తాయి. నాడు పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

ఒక చట్టబద్ధమైన, స్పష్టంగా రాసుకున్న రాజ్యాంగ అవసరాన్ని ఇలాంటి ఘటనలు తెలియజేస్తున్నాయని రచయిత డేమ్ హిలరీ మాంటే అన్నారు. పార్లమెంటు వ్యవహారాల్లో అక్రమంగా ప్రధానులు వేలు పెట్టకుండా ఉండాలంటే రాసుకున్న రాజ్యాంగం కావాలని హిలరీ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి, ఇప్పుడు అమలులో ఉన్న రాజ్యాంగానికి సంబంధం లేదని కొందరు నిపుణులు అంటున్నారు.

'పార్లమెంటు విశ్వాసాన్ని ప్రధాని కచ్చితంగా పొందాలి. పార్లమెంటు నమ్మకం కోల్పోయిన నాడు కచ్చితంగా దిగిపోవాలని బ్రిటన్ రాజకీయ వ్యవస్థ చెబుతోంది. రాసుకున్న రాజ్యాంగం ఉన్న భారత్, డెన్మార్క్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఇదే సూత్రం మీద ఆధారపడి పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తోంది' అని యూనివర్స్ కాలేజ్ లండన్‌లోని ప్రొఫెసర్ రాబర్ట్ హజెల్ అన్నారు.

ఒకవేళ ప్రధాని రాజీనామా చేయకుండా దీర్ఘకాలం పాటు అలాగే పదవిలో ఉంటే ఆ తరువాత ఏం చేయాలనేది పార్టీ లేదా పార్లమెంటు నిర్ణయిస్తాయని రాబర్ట్ చెప్పుకొచ్చారు.

రెండు మార్గాల ద్వారా బోరిస్ జాన్సన్ మీద ఒత్తిడి తీసుకు రావొచ్చని రాబ్ వాట్సన్ అన్నారు.

'ఒకటి త్వరగా వైదొలిగేలా ఆయన మీద పార్టీ ఒత్తిడి తీసుకురావడం. రెండు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. పార్లమెంటులో బోరిస్ జాన్సన్ విశ్వాసం కోల్పోతే ముందస్తు ఎన్నికలు వస్తాయి. కానీ ఎన్నికలు రాకూడదని కన్జర్వేటివ్ పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది'.

 

 

యాదాద్రిలో భారీ వర్షం... బయటపడుతున్న లీకులు

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం భారీ వర్షం కారణంగా లీకేజీలు ఏర్పడ్డాయి. యాదాద్రిలో గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో లీకేజీలు ఏర్పడ్డాయి. ప్రధానాలయం అష్టభుజి, గోడ ప్రాకార మండపం, ప్రథమ ప్రాకార మండపాలతో పాటు ప్రధానాలయ ముఖ మండపంలోని ఏసీల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై వాటికి మరమ్మతులు చేస్తున్నారు.

 

 

తిరిగి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.

ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ (Amarnath)యాత్ర మళ్లీ ప్రారంభమైంది. దీంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్‌నకు యాత్రికులు బయల్దేరారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రస్తుతం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్రికులను అనుమతిస్తున్నారు. బల్తాల్ మార్గం నుంచి యాత్ర ఇంకా పునఃప్రారంభం కాలేదు. కానీ బల్తాల్, పహల్గాం రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు 4,020 మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్‌ దర్శనానికి బయల్దేరించింది. జమ్మూలోని భగవతినగర్‌ యాత్రి నివాస్ నుంచి 110 వాహనాల్లో గట్టి బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరినట్టు సైనిక వర్గాలు కూడా తెలిపాయి. అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బల్తాల్ బేస్‌ క్యాంపునకు బయలుదేరాయి. ఇలా వెళ్లిన యాత్రికులంతా మంగళవారం అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు.


కాగా అమర్‌నాథ్ గుహ సమీపంలో ఈ నెల 8న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కనీసం 16 మంది మరణించారు. 40 మందికిపైగా తప్పిపోయారు. దీంతో ఆదివారం లోయలోని బేస్ క్యాంపులకు వెళ్లడానికి ఏ బ్యాచ్‌ను అనుమితంచ లేదు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. శిథిలాలను కొనసాగిస్తున్నారు. అయితే శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో గుహ మందిరానికి వెళ్లే మార్గం దెబ్బతింది. దాంతో పవిత్ర గుహ వెలుపల సైన్యం తాత్కాలిక మెట్లను నిర్మించింది. వరదల వల్ల అమర్ నాథ్ యాత్రికులు చాలామంది చనిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి వెళ్లిన 84 మంది క్షేమంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అయితే వారిద్దరూ చనిపోయినట్టు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిని వారితో పాటు వెళ్లినవారు గుర్తించారు. దాంతో ఈ విషయాన్ని పోలీసులు ఖరారు చేశారు. చనిపోయిన వారు రాధ, పార్వతీలు గుర్తించగా.. వారిని ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించారు.

  

కేసీఆర్ పాలన అంతమొందించే బాధ్యత నాదే ఈటెల.


కేసీఆర్ దుర్మార్గమైన పాలనను అంతమొందించే బాధ్యత తనపై ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్  ను ఓడగొడితేనే  తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే.. పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. కేసీఆర్ కు కావాల్సింది కేవలం బానిసలేనన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనంటూ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తనలాంటి వారు కేసీఆర్ నచ్చలేదన్నారు. ఆయనకు కావాల్సింది కేవలం బానిసలు మాత్రమేనన్నారు. అసెంబ్లీలో తన ముఖం కన్పించకుండా ఉంాలని కేసీఆర్ తనను ఓడించడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు ఈటల.

పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు..  కేసీఆర్ సచ్చిపోవాలన్నారు. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా అని ప్రశ్నించారు ఈటల. గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం గుప్పించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు ఈటల రాజేందర్. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.

హుజురాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చింది కేసీఆరే అని ఆరోపించారు ఈటల. కేసీఆర్ వ్యుహాలు ఎంటో తనకు తెలుసన్నారు. దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. చరిత్ర నిర్మాతలు ఎప్పుడూ నాయకులు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని మరో సారి తనదైన శైలిలో వాఖ్యానించారు ఈటల రాజేందర్.

  

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం --ఫొటో పోటీలు

వంద మాటలను ఒక్క ఫోటో లో చూడగలం. జీవిత సత్యాలను, మానవ జీవన విధానాన్ని ఒక్క ఛాయా చిత్రం సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. చూడగలిగితే ప్రకృతి లో ఉండెంత అందం మరెక్కడా ఉండదు... అలాంటి అందాలను బంధించేదే ఫోటోగ్రఫీ. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 19న " ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం "ను  పురస్కరించుకుని   తెలంగాణ రాష్ట్ర సమాచార & ప్రజాసంబంధాల శాఖ ఫొటో పోటీలను నిర్వహిస్తుంది. స్థానిక ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించేందుకు 1992లో సమాచార శాఖ ఈ పోటీలను ప్రారంభించింది.  ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొనే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది. ఇందులో పాల్గొనడమే కాకుండా వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, పోటీల స్థాయి గురించి మరింత తెలుసుకోవడానికి అనేక మంది ఉత్సాహాన్ని చూపుతున్నారు.

సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించే ఈ ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ఫోటోగ్రఫీ, జర్నలిజం రంగంలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తులను జ్యూరీ సభ్యులుగా నియమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలను కవర్ చేయడానికి ప్రతి సంవత్సరం సరి కొత్త థీమ్లు ప్రకటిచడం జరుగుతోంది. ఈ పోటీలకు అందిన ఫొటోలను అవసరమైన చోట శాఖాపరమైన అవసరాలకు వినియోగిస్తారు. ఈ ఫొటో పోటీలకు వచ్చిన ప్రతి కాటగిరీకి 12, 3వ బహుమతులతోపాటు 5 కన్సోలేషన్ బహుమతులు అందచేస్తారు. విజేతలను నగదు పురస్కారం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరిస్తారు. గత సంవత్సరం 2021 లో 104 మంది పాల్గొన్న వారి నుంచి దాదాపు 1,500 ఫోటోలు అందాయి. అందులో 32 మంది ఫోటోగ్రాఫర్లకు ప్రతీ అంశం నుంచి 5 కన్సోలేషన్ బహుమతులతో పాటు 12వ మరియు 3వ స్థానం బహుమతులను ఎంపిక చేశారు. బంగారు తెలంగాణ, తెలంగాణ పండుగలు, ఉత్తమ వార్తా చిత్రం, నగర అభివృద్ధి గత సంవత్సరం పోటీకి సంబంధించిన అంశాలు. అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం (I&PR శాఖ) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2022 వేడుకల సందర్భంగా ఫోటో పోటీని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఐదు కేటగిరీలు ఉన్నాయి

మొదటి అంశం -I: బంగారు తెలంగాణ

(మహిళా & శిశు సంక్షేమ IT పరిశ్రమ, ఆరోగ్యం, విద్యుత్, నీటిపారుదల, లా & ఆర్డర్)

రెండవ అంశం -II: పల్లె, పట్టణ ప్రగతి

(పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, వైకుంట ధామములు, గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు మొదలైనవి,)

మూడవ అంశం-III: ఉత్తమ వార్తా చిత్రం

(వార్తా పేపర్ / మ్యాగజైన్లో ప్రచురించబడిన చిత్రం, ఆగస్టు 2019 తర్వాత మాత్రమే)

నాలుగవ అంశం -IV: అర్బన్ & రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్

(సరస్సులు, ఉద్యానవనాలు, రోడ్లు, మన ఊరు మన బడి, గ్రంథాలయాలు మొదలైన వాటి అభివృద్ధి,)

ఐదవ అంశం - V: స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్

ఈ ఫోటో కాంపిటీషన్ పాల్గొనేవారు (3) థీమ్ / కాన్సెప్ట్ కోసం ఒక్కొక్కరు మూడు ఫోటోలను పంపవచ్చు. దీని ప్రకారం ఉత్తమ 1, 2, 3వ ఎంట్రీలకు వరుసగా రూ.20,000/-, రూ.15,000/- మరియు రూ.10,000/- నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికెట్లు, మెమెంటో లతో పాటు (5) కన్సోలేషన్ బహుమతులతో సత్కరించాలని నిర్ణయించడం జరిగింది.. ఐదు కేటగిరీలలో ఒక్కొక్కరికి రూ.5,000/- మొత్తం 40 బహుమతులుంటాయి

ఈ ఫోటో పోటీలలో పాల్గొనేవారు తమ ఎంట్రీలను 11-7-22 (సోమవారం) నుంచి 12-8-22 వరకు (అన్ని పని దినాలలో) సమర్పించవచ్చు. ఎంట్రీలను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్టు 12. ఆ రోజు సాయంత్రం 5.00 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఎంట్రీలను అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోటో ), సమాచార భవన్, సమాచార పౌర సంబంధాల శాఖ, మాసాబ్ ట్యాంక్ , హైదరాబాద్, 500028 అనే చిరునామా కు పంపించాల్సి ఉంటుంది. పోటీలకు పంపే ఫోటోలను adphoto.ts @gmail.com అనే మెయిల్ కు కూడా పంపాలి. అన్ని వర్గాల ఫోటోగ్రాఫర్లు మరియు ఫోటోగ్రఫీ ఔత్సాహికులందరూ పోటీలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సమాచార, ప్రసార శాఖ కోరింది.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...