Saturday 16 December 2023

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో


 మహా అన్నదాన కార్యక్రమం.

కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో

శ్రీహనుమాన్ దేవాలయం



 సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అనే(ఒంగోలు ఎద్దు) గోశాలలో ఒక మహా నంది లాగా ఉన్నటువంటి. దానికి ఈ మధ్య కాలంలో కొంత అనారోగ్యం వలన శివైక్యం చెందటం జరిగింది.. ఆ కుబేరుడి ని చిన్నప్పటి నుంచి పోషించే, అక్కడ ప్రతి రోజు సేవ చేసే భక్తులు, కుబేరుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక పోయారు. చాలా చిన్నతనం నుంచి మేము చేసుకున్నాం అని..దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కర్మ కాండలు కూడా చేశారు, అలాగే ఈ.రోజు. ఆదివారం.17.12.23. దాని పేరుతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కామధేనువు సేవాసమితి సభ్యులు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు, అందరూ ఆహ్వానితులే అని చెప్పారు

Thursday 9 November 2023

 

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేవేందర్ కొన్నే


అవినీతి రహిత సమాజంకోసం, ప్రజల్లో అవగాహనా కలిపిస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, కరోనా సమయంలో కూడా ప్రజలకు అవగాహనా కలిపిస్తూ వేలాదిమందికి ఆహారం అందిస్తూ, ప్రభుత్వంలో జరిగే అవినీతి ప్రశ్నిస్తూ, ఉండే విద్యావంతుడు,  దేవేందర్ కొన్నే సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు ఫౌండేషన్ నామినేషన్ వేయటం జరిగింది

 అవినీతి రహిత పాలనే ద్యేయంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేవేందర్ కొన్నే 



అవినీతి రహిత సమాజంకోసం, ప్రజల్లో అవగాహనా కలిపిస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, కరోనా సమయంలో కూడా ప్రజలకు అవగాహనా కలిపిస్తూ వేలాదిమందికి ఆహారం అందిస్తూ, ప్రభుత్వంలో జరిగే అవినీతి ప్రశ్నిస్తూ, ఉండే విద్యావంతుడు,  దేవేందర్ కొన్నే సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు ఫౌండేషన్ నామినేషన్ వేయటం జరిగింది

Wednesday 16 August 2023

 మానసిక వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం  

కామధేనువు సేవాసమితి 


అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే| జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి !

ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న మానసిక అసుపత్రి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించబడిన పురాతన ఆరోగ్య సంస్థల్లో ఇదీ ఒకటి.[1] తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆసుపత్రి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే మానసిక ఆరోగ్య రోగులకు సేవలు అందిస్తోంది. 600 పడకలతో ఉన్న ఈ హాస్పిటల్ లో రోజుకు దాదాపు 300 మందికి పైగా వివిధ రాష్టాల నుండి అవుట్ పేషేంట్స్ వస్తుంటారు, వారందికీ ఆహారం కొంత ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని కామధేనువు సేవాసమితి వారు ప్రతి అమావాస్య, పొర్ణమి రోజులలో అందరికి అన్నదానము చేస్తున్నారు

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. ఈ కార్యక్రమంలో సమితి ప్రసిడెంట్ దేవేందర్ కొన్నే, వేంకటేష్, రుక్మిణి, తులసి కుమార్, విగ్నేష్, సూర్య ప్రకాష్, సంధ్య , రాజేష్, సత్తార్ మరియు ఇతర సభ్యులు పాల్గొనటం జరిగింది




Wednesday 21 June 2023

 

అన్ని మతాల ఆచారాలు, సంస్కృతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.




తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  బుధవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో లోక కళ్యాణార్ధం నిర్వహించిన శాంతియాగం, చండీహోమం పూర్ణాహుతి లో పాల్గొన్నారు. ఆలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వివిధ భాషలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు బోనాలు, గణేష్ నవరాత్రులు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలను  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చి ల అభివృద్ధి కి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి లక్షల మంది భక్తులు వచ్చారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి  ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్నాయని,  ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు తగినట్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన పండుగలు నేడు దేశ విదేశాలలో జరుపుకోవడం మన అందరికీ గర్వకారణం అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అనేక దేవాలయాలను  ప్రభుత్వం  అభివృద్ధి చేసిందని అన్నారు. సుమారు 1200 కోట్ల రూపాయల వ్యయంతో  చరిత్రలో నిలిచి పోయే విధంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

 

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం




బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా మంత్రి దంపతులకు ఆలయ  పండితులు పూర్ణ  కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి కళ్యాణం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.


Thursday 18 May 2023

  

5 రోజులుగా నల్ల నీళ్లు రావటంలేదు--- యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన







ఈరోజు జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి లో గల ఇల్లంతకుంట క్రాస్ రోడ్ వద్ద గత 5 రోజులుగా నల్ల నీళ్లు రాక కాలి బిందెలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.

జమ్మికుంట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో గల కొత్తపల్లిలోని ఐదు వార్డులలో మంచినీటి సమస్యతో గత ఐదు రోజులుగా నల్ల నీళ్లు రాకపోవడంతో మహిళలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖాళి బిందెలతో నిరసన  తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాళీ బిందెలతో మహిళలు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా కొత్తపల్లి ప్రాంతంలో నిత్యావసర నల్ల నీరు రాక అనేక అవస్థలు పడుతున్న పట్టించుకునే నాధుడు లేడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు, పోలీసులు జోక్యం చేసుకొని  అందర్నీ ఇండ్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సజ్జాద్ మొహమ్మద్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి , రంజిత్ రెడ్డి , బాధిత మహిళలు బోగా లలిత , రమా, రాజేశ్వరి , రబ్బాన , సుందరమ్మ , శ్రీమతి , సరూప, షబానా, కళ్యాణి , రాణి, తార , బబ్బి , సల్మాన్ , అరుణ్ తదితరులు పాల్గొన్నారు

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...