Wednesday 10 April 2024

 

కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ వితరణ 




శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. స్థానిక హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన భక్తులకు అందరికి కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ వితరణ చేయటం జరిగింది. సమితి సెక్రటరీ గారు మాట్లాడుతూ.. మేము అందరం కలిసి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము, అదేవిధంగా కరోనా సమయంలో కొన్ని వేలమంది కి ఉచిత ఆహారం, నీరు అందివ్వటం జరిగింది, ఆకలితో బాధపడే వారికి ఎదో మా సహాయముగా సేవ చేస్తూ ఉంటాము, ఆదేవింగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో, ఈ ఎస్ ఐ హాస్పిటల్ కూడా ప్రతి రోగులకు మరియు వారి సహాయకులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తుంటం అని సెక్రటరీ బాల మురళి కృష్ణ గారు తెలియచేసారు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరo సందర్భంగా మజ్జిగ వితరణ చేయటం జరిగింది అని సభ్యలు. తులసి కుమార్, దేవేందర్ కొన్నే, విగ్నేష్, వేణు, వెంకటేష్, బాలమురళి కృష్ణ, రవి కుమార్, సూర్యప్రకాష్. జి. వి ఎస్ ప్రకాష్ గారు, మోహన్, రవి,  రఘు..  తెలిపారు  








 

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...