Wednesday 13 July 2022

 

 దేశంలో ఎవరికీ లేనటువంటి బ్లడ్ గ్రూప్!


ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందికి ఉంది. అలాంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తి మన దేశంలోనే ఉన్నాడు. అసలు ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి..? అది ఎలా పనిచేస్తోందో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక మనిషి సజీవంగా ఉండాలంటే శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు సమన్వయంతో జరగాలి. మన శరీరంలోని ప్రతి భాగం కూడా ముఖ్యమైనదే. దాని పని అది సక్రమంగా చేసినప్పుడు మాత్రమే.. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలడు. అందుకే ఏ ఒక్క అవయవ పనిచేలేకపోయినా.. మనం అనారోగ్యానికి గురవుతాం. మానవ దేహాన్ని దేవుడు అలా రూపొందించాడు. మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్‌ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. ఐతే మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయి.

ఇవేవీ కాకుండా ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంది. అది చాలా అరుదుగా (ఉంటుంది. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ గురించి చాలా మందికి దీని గురించి తెలియదు. అదే EMM Blood Group. వివరాల్లోకెళితే..ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు.Gujarath  రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌కు చెందిని 65 ఏళ్ల వ్యక్తిలో ఈఎంఎం నెగిటివ్చెందిన రక్తపు గ్రూపును వైద్యులు కనుగొన్నారు

ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందికి ఉంది. అలాంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తిగా గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. భారత్‌లో ఈ బ్లడ్ గ్రూపు ఈయనకు మాత్రమే ఉంది. అయితే సాధారణంగా ఏ, బీ, , ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే ఈఎంఎం నెగిటివ్ ఎంతో ప్రత్యేకమైనది.

మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, , ఆర్ హెచ్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్లు ఉంటాయి. ఇలాంటి బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం కానీ, ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదని వైద్యులు తెలిపారు

అయితే గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తికి గుండె సమస్య. దీనికి సంబంధించిన సర్జరీ కోసం చేసిన రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ బయట పడిందని వైద్యులు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఈఎంఎం నెగిటివ్ అని నామకరణం చేసింది.

ఈ బ్లడ్ గ్రూప్ సాధారణ మానవులకు భిన్నంగా చేస్తుంది. ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు.. ఎవరి దగ్గరినుండి పొందలేరు. గుండెపోటుతో అహ్మదాబాద్‌లో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్స కోసం రక్తం అవసరమని సూరత్‌లోని సమర్పన్ బ్లడ్ డొనేషన్ సెంటర్ వైద్యుడు సన్ముఖ్ జోషి తెలిపారు.

అయితే, అహ్మదాబాద్‌లోని ప్రథమ ల్యాబొరేటరీలో అతని రక్తం రకం కనుగొనబడకపోవడంతో, నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు.పరీక్ష తర్వాత, నమూనా ఏ సమూహంతోనూ సరిపోలలేదు. దీని తరువాత వృద్ధుడితో పాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపారు. ఆ తర్వాత ఇది EMM Blood Group అని తేలింది



 ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు- కామధేనువు సేవాసమితి


వేకువజాము నుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు    నారాయణ స్వామి గారు మరియు సతీష్ గార్లఆధ్వర్యంలో ఉదయం నుంచి సనత్ నగర్, స్థానిక నెహ్రు పార్కు దగ్గర ఉన్న శ్రీ సాయి బాబా దేవాలయంలో  ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కలశాలతో అభిషేకం బాబాను దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశామని ఆలయ సిబ్బంది తెలియచేసారు, కామధేనువు సేవాసమితి సభ్యులు దేవేందర్ కొన్నే, తులసి కుమార్, బాల మురళి కృష్ణ వెంకటేష్, జి. ప్రకాష్ రావు, కరుణాకర్, రవి, రమణ ..తదితరులు పాల్గొనటం జరిగింది, గత రెండు సవత్సరాలు కరోనా మహమ్మారి వలన తక్కువ సంఖ్యలో పాల్గొన్న ఈ ఏడాది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొటున్నారని తెలియ చేశారు 

గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.



               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...