Wednesday 13 July 2022

 ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు- కామధేనువు సేవాసమితి


వేకువజాము నుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు    నారాయణ స్వామి గారు మరియు సతీష్ గార్లఆధ్వర్యంలో ఉదయం నుంచి సనత్ నగర్, స్థానిక నెహ్రు పార్కు దగ్గర ఉన్న శ్రీ సాయి బాబా దేవాలయంలో  ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కలశాలతో అభిషేకం బాబాను దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశామని ఆలయ సిబ్బంది తెలియచేసారు, కామధేనువు సేవాసమితి సభ్యులు దేవేందర్ కొన్నే, తులసి కుమార్, బాల మురళి కృష్ణ వెంకటేష్, జి. ప్రకాష్ రావు, కరుణాకర్, రవి, రమణ ..తదితరులు పాల్గొనటం జరిగింది, గత రెండు సవత్సరాలు కరోనా మహమ్మారి వలన తక్కువ సంఖ్యలో పాల్గొన్న ఈ ఏడాది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొటున్నారని తెలియ చేశారు 

గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.



2 comments:

  1. ఓం సాయిరాం

    ReplyDelete
  2. ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...