Friday 22 July 2022

 

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలలో బాలికలదే హవా!

 



విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. శుక్రవారం మధ్యాహ్నం బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in

 ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. కాగా.. ఈ ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

అయితే, సీబీఎస్‌ఈ ఒకేరోజు పది, 12 తరగతుల ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది 94.40శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు బోర్డు వెల్లడించింది. బాలికల ఉత్తీర్ణతా శాతం 95.21శాతంగా ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 93.80శాతంగా ఉన్నట్టు తెలిపింది. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణతా 1.41శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, ట్రాన్స్‌జెండర్‌ల ఉత్తీర్ణతా శాతం 90శాతంగా ఉందని బోర్డు వెల్లడించింది.

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు జరగాయి. దేశవ్యాప్తంగా 7,046 సెంటర్లలో జరిగిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు 21,16,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,94,993 మంది బాలికలు కాగా.. 12,21,195మంది బాలురు.

గత ఐదేళ్లలో ఉత్తీర్ణత ఇలా..

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 2017 ఉత్తీర్ణతా శాతం 93.12% గా ఉండగా.. 2018లో 86.7%, 2019లో 91.10%, 2020లో 91.46%,  2021లో 99.04%గా నమోదైంది.

కాగా తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్టాలలో కూడా విద్యార్థి విద్యార్థినిలు మంచి ఫలితాలు వచ్చాయి అని తెలిపారు, హైదరాబాద్ నగరంలో కూడా చాల పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చునట్టు తెలిపారు, సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ మా పాఠశాలలోని పరీక్షకు హాజరైన అందరూ మంచి పలితాలు సాధించారని తెలిపారు, కొంత మంది  విద్యార్థులు మాట్లాడుతూ అనేకంటే గణిత పేపర్ కొంచం కష్టంగా ఉంది అని తెలిపారు... ఇందు సహస్ర, ఈషా, వర్ష, స్నేహ, తదితరులు మాట్లాడటం జరిగింది

 

హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన.



 

తెలంగాణ ను మరోసారి భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడ్రోజులుగా అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడని ఊపిరిపీల్చుకునేలోపే వెదర్ అప్‌డేట్ ప్రజల్లో కొత్త టెన్షన్‌ పుట్టిస్తోంది. వర్షాలు, వరదలతో బురదలోంచి జనం బయటపడక ముందే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తునే ఉన్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ భారీ వర్షాల రూపంలో విరుచుకుపడటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష  సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు  వాహనదారులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు నీటి వరదను క్లీన్ చేస్తున్నారు

 

 

75 యేండ్ల దేశం

దేశ సంపద పెరుగుతోంది. నేడు మెూటార్ సైకిల్ లేని ఇల్లే కనపడదు.జాతీయెూధ్యమ కాలంలో సైకిళ్ళే లేవు. పరిశ్రమలు,ఆనకట్టలు,ఆస్పత్రులు, పార్మా కంపెనీలు, రహధారులు,ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇంటింటికీ కరెంటు, నీరు,నాడు ఉండటానికి గూడు కావాలనే వారు,నేడు సౌకర్యవంతంగా జీవిస్తున్నారు.

లెక్కకు మించి విద్యా సంస్ధలు, కప్యూటర్ రంగం విజృంభన, ఆమెరికా ,ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లండు దేశాలకు వలసలు.విద్యార్ధులకు నూటికి నూరు మార్కులు,ఐఐటిలు,ఐఐయంలు, నిట్లు, ప్రతిభా వంతులకు ఆన్నీ ఆవకాశాలే.నాడు జొన్నలు, రాగులు,సజ్జలు ,వరిగలే మన ఆహారం.ఏక్కడికి పోవాలన్నా నడవాల్సిందే. నాడు చిరిగిన చొక్కాలు, చిరిగిన నిక్కర్లు,కాళ్ళకూ చెప్పులే ఉండేవి కావు. సెల్ పోన్ లు పెరిగాయి.నాడు ఆయుః ప్రమాణం 57 సం. వత్సరాలు.నేడు 70 సంవత్సరాలు.ఇదంతా  ఓక వైపు.

వేరొకవైపు.ప్రభుత్వ ఆదుపు లేని ఆభివృద్ది, మితి మీరిన ఆర్ధిక వ్యత్యాసాలు, సంపద పెరిగినా వర్గాలు బలపడ్డాయి.సామ్యవాద వీడి పెట్టుబడిదారీ విధానం వైపు ఆడుగులు,ఆవే వర్గాలు, కోటీశ్వరులు,కూలీలు, పరిశ్రామిక వేత్తలూ, శ్రామికులు,భూస్వాములు, కూలీలు.దిశానిర్ధేశం లేని నాయకత్వం,ప్రజాస్వామ్యం పోయి ధనస్వామ్యం, నాయకులు పోయి రౌడీలు, గూండాలు,75 సంవత్సరాల తరువాత మత రాజ్యం వైపు పయనం,ధనికులు నాయకులు ఓటర్లు పేదలు, ఓటర్లనూ,శాసన సభ్యులను కొనటం, వృత్తి నాయకు లు లేరు,సిధ్ధాంతాలు లేవు, ఆంతా గెలుపు, ఓటమి.

గెలిస్తే కోటీశ్వరులు, శత కోటీశ్వరులు ఆవుతారు. ప్రతిభ లేదు, నిభద్ధత లేదు.ప్రభుత్వరంగ సంస్ధల మాయం, మత,కుల ,ఘర్షణలు తారా స్ధాయిలో, మనిషిని మనిషిగా చూసే ధోరణి లేదు.ప్రభుత్వ ఉధ్యోగాలు లేవు. ఆన్నీ ప్రవేటు ఉధ్యోగాలే,8 గంటల పని 12 గంట లైంది.యువత నిర్వీర్య మైంది.ధన మనస్తత్వం పెరిగింది,సామాజక సంభందాలు లేవు, నలుగులు కూర్చొని మాట్లాడే వారే లేరు,ప్రతివాడికీ సెల్ పోన్ కాలక్షేపాలే.  కార్లు,మెూటార్ సైకిళ్ళు, టాక్సీలు వచ్చి జనానికి వలసలు పెరిగాయి.ఏక్కడో ఏదో దేశంలో వారి పని. ఇక ముసలి వారు, పిల్లలు, చదువు లేని వారు నిలయమైంది గ్రామీణం.

సౌకర్యాలు పెరిగినా,జీవన ప్రమాణం పెరిగినా జీవన వ్యయం పెరిగింది.ప్రతిరోజూ పని చేస్తేనే తిండి. మనుషుల మధ్య సయెూధ్య లేదు.మనీ సంస్కృతి పెరిగి మనుషులు దూరమవుతున్నారు.సంపద పెరిగినా మనుషులు నేటికీ మత,కుల భావాలనే పాటిస్తున్నారు.మత సంఘాలు,కుల సంఘాలు,వృత్తి సంఘాలు పెరిగాయి. నేడు మనుషులు లేరు. కులాలు,మతాలు మాత్రమే జీవిస్తున్నాయి.రాజకీయ పదవులను కులాల ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. కులాల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నాయి.

 శాస్త్రం పెరిగింది.సాంకేతికత పెరిగింది.పెరిగిన సాంకేతికతను వినియెూగిస్తున్నాడే గాని,దాని మూల తత్వం విలువగా మారలేదు.మెుదటి నుండి సామా జక సంభందాలు లేక వత్తిడి పెరిగి యువత ఆత్మ హత్యలకు దారితీస్తోంది.తన చుట్టూ తప్ప లోక జ్ణానమే లేదు పిల్లలకు. ఆదీ మన దేశ పరిస్ధితి.నాయకత్వం మనలను క్షాళన చేయాలి గాని వారే మనలను తప్పు దారిలో నడుపుతున్నారు. హేతు త్వం లేదు,వివేచన లేదు,వికాసం లేదు. చదువులు యాంత్రిక మయ్యాయి.ఇది కాదు మనం కోరే సమాజం.సామాజక సంభందాలు, ఆనురాగాలూ ఆప్యాయతలు,ఆనుభందాలు ,సోదర బావం, కలగలిచిన యువత పెరగాలి. కుల సంఘాలు,మత సంఘాలు,వర్గ సంఘాల ప్రాధాన్యత తగ్గాలి. ఆభివృద్ధి వాంచితంగా ఉండాలి. సమానత్వం పెరగాలి.ఆపుడే దేశం సరైన దిశలో నడుస్తుంది.

 

*వసంతాన్ని వీడి విప్లవాన్ని పెనవేసుకున్న విప్లవ   కవి దాశరథి….!!



'దాశరథి'గా పిలువబడే..దాశరథి కృష్ణమాచార్యులు

మొదట్లో భావకవిత్వం విరివిగా రాసినా,విప్లవాల పురిటి గడ్డలో పుట్టాడు కాబట్టి , ఆ తర్వాత కలాన్ని కత్తి చేసు

కున్నాడు.అవసరమైతే గన్నెత్తాడు. తన  బాధంతా. తెలంగాణా గురించే.!!

ఈ కవితలో వసంతం ప్రస్తావన తెచ్చినా..ఈయన శోక

సంద్రుడే కానీ..ఈయన శోకం తనకోసం కాదు.ప్రేయసి

రాలేదని, తనకు దక్కలేదని కాదు.తాను పుట్టిన గడ్డలో దొరల దౌర్జన్యానికి,నిజాము ముష్కర మూకతో పీడింప

బడుతున్న సోదరుల్లాంటి... తన జనంకోసమే.!!

నాటి తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు జనం

సామాన్యానికి ఓ సవాలుగా మారాయి.కాలం కట్టిన కత్తు

ల వంతెనను దాటాల్సిన క్లిష్ట సమయం అది.ఈ పరిస్థితు

ల్లో రాసిక్యం,ప్రేయసి అంటే కుదరదు.ప్రతి ఒక్కరూ ఒక్కో అగ్నికణమై విజృంభించాలి.నిజాము.  పైశాచికత్వాన్ని తునుమాడాలి.ఇది చావుబతుకుల సంకుల సమరం.ఇక్క

డ తలెత్తి  నిలిచినవాడే వీరుడు.ధైర్యంతో మొలకెత్తిన వాడే శూరుడు.

అగ్ని  గుండంలా మారిన తెలంగాణంలోఆవేశంకట్టలు

తెంచుకోవాలి.ముష్కరులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. ఇప్పుడిక్కడ వసంతం లేదు.సహింపరాని వేసవి వడ

గాలులు మాత్రమే వున్నాయి.తెలంగాణమంతా చీకటితో కొట్టు మిట్టాడుతుంటే ఇక ఉషస్సులు ఎక్కడినుంచి వస్తా

యి? నెలవంకలేదు.  వెన్నెల జాడలేదు. పున్నమి కన్నెల ఊసే లేదు.

 

భావకవిలా ప్రియురాల్నిసృష్టించుకొని,గాల్లో ప్రణయసౌధా

లు నిర్మించుకునే సమయంకాదది.అగ్నిగుండంగా మారిన తెలంగాణలో విప్లవాన్ని రగిల్చి,పోరాటయోధుల్ని తయా

రు చేసే కాలమది.పోరు తెలంగాణకు ఉద్యమించాల్సిన సమయం. అభ్యుదయ భావ వీచికలతో అక్షరాలతో అగ్గి

సెగలు పుట్టించాల్సిన సమయం. కవిగా... దాశరథి ఆపనే చేశారు.' జనం మనం...మనం జనం‌ ' అని దాశరథి కవితాశరాలను సంధించారు.!

పోరు బాటలో కవికి  ఆకాశం,చుక్కలతో పనిలేదు.అన్యా

యం,దౌర్జన్యాన్ని ఎదిరించగల దమ్ము,ధైర్యం వుండాలి.

ఇప్పుడు ఆకాశం పుట్టెడు శోకంతో వుంది.రణ భూమిలో తన బిడ్డల బాధను చూడలేక కుమిలిపోతోంది ఆకాశవీధి వీధంతా పొగచూరి నల్లగా తయారైంది.ఇప్పుడది దుఃఖ సంగ్రామ భూమి‌నితలపిస్తోంది.అక్కడ పైడి వెన్నెల లేదు.

చుక్కలు లేవు.చంద్రుడు లేడు.ఉన్నదల్లా శోకం.ఆకాశం శోక భూమిలా వుందట.

'ఉలితో పాషాణంలో పీయూషాన్ని చిప్పిలజేసే శిల్పిలాంటి

వాడు కావాలి కవి ' అంటారు  దాశరథి. ఎందుకంటే?

ఆయన కూడా అలాంటివారే కాబట్టి

*భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వానికి

మళ్ళిన దాశరథి!!

*ఇట వసంతము లేదు:సహింపరాని

గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని

ఇట ఉషస్సులు లేవు:భరింపరాని  అంబువాహ సందోహ నిశాళి కాని

*వెన్నెలలు లేవు,పున్నమ కన్నెలేదు  పైడి వన్నెల నెలవంక జాడలేదు

చుక్కలే లేవు,ఆకాశ శోక వీథి  ధూమధామమ్ము ,దుఃఖ సంగ్రామభూమి “!!

 

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...