Tuesday 28 June 2022

 




ఇంటర్‌ ఫలితాల్లో సత్తాచాటిన వీణ వాణి..  

ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం మంది

తాజాగా విడుదలైన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణి త‌మ స‌త్తా చాటారు. ఇంట‌ర్మీడియ‌ట్‌లో వారిద్ద‌రూ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌య్యారు. ఇంట‌ర్‌లో సీఈసీ కోర్సును అభ్య‌సించిన వీణ‌కు 712, వాణికి 707 మార్కులు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్.. వీణ, వాణిల‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. వారి ఉన్న‌త చ‌దువుల‌కు, భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. వీణ‌, వాణిల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని పేర్కొన్నారు. వీణ వాణిల చ‌దువుకు స‌హ‌క‌రించిన అధికారులను మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. అయితే వీరిద్ద‌రూ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు స్వ‌యంగా రాశారు. ఇక ప‌దో త‌ర‌గ‌తిలోనూ వీణ‌, వాణి ఫ‌స్ట్ క్లాసులో పాస‌య్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003వ సంవత్సరంలో తలలు అతుక్కుని వీణ-వాణి ఇద్దరు కవలలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల వరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్‌ హోమ్‌లో గడుపుతున్నారు. వీరిని విడదీయాలనే వైద్యుల ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలంకాలేదు. ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణ-వాణి కవలలకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణ వాణిలు చాటెడ్ అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని తెలపడం గమనార్హం. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 464892 విద్యార్థులకు గాను 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు. ఇక సెకండియర్‌లో 67.96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా ఫస్ట్‌, హన్మకొండ రెండవ స్థానంలో నిలిచాయి. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. పూర్తి వివరాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

గిన్నీస్ రికార్డ్.. తెలుగు షార్ట్ ఫిల్మ్ మనసా నమ:

మనసా నమ: (manasa namaha) గిన్నీస్ రికార్డులకెక్కింది. అత్యధిక అవార్డులను సాధించిన షార్ట్ ఫిల్మ్‌గా మనసా నమ: అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

టాలెంట్ నిరూపించుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. మన దగ్గర టాలెంట్ ఉంటే.. దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు, జనాల్లోకి తీసుకెళ్లేందకు ఎన్నో దారులున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లంటూ అందరూ యువత తమ ప్రతిభకు పదును పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. ‘:మనసానమ:అనే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఏకంగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. ప్రపంచంలో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఈ లఘు చిత్రానికి 513 అవార్డులను సాధించింది. దీంతో ఈ చిత్రం గిన్నీస్ బుక్‌లోకి ఎక్కేసింది. అసలు ఈ సినిమా కథ ఎంతో సింపుల్‌గా, లోతుగా ఉంటుంది. అమ్మాయిలను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో చెబుతుంది. అయితే ఇందులో కారెక్టర్ పేర్లు, తీసుకున్న కథ, చూపించిన విధానం, రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంటుంది. హీరో పేరు సూర్య. అంటే సూర్యుడిలా అనుకోవచ్చు. ఇక ముగ్గురు హీరోయిన్లు. వారి పాత్రల పేర్లు శీత, వర్ష, చైత్ర. అవి శీతాకాలం, వర్షాకాలం, చైత్రమాసం (వేసవి) అని ప్రతీకగా చెప్పేశాడు. ఆ మూడు పాత్రలతో అమ్మాయిల మనస్తత్వాలను ఎంతో వినోదాత్మకంగా చూపించాడు. రాసుకున్న డైలాగ్స్ కూడా ఎంతో హృద్యంగా అనిపిస్తాయి. :మనసానమ: అనే టైటిల్ ఎటు నుంచి చూసినా కూడా ఒకేలా పలుకుతాం. ఈ సినిమాలో కథను హీరో కోణంలో చూపించినా.. చివర్లో మాత్రం ఓ చిన్న పాపతో ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒకే టైపు అన్నట్టుగా చెప్పేస్తాడు. మొత్తానికి ఇందులో సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌కు దీపక్ దర్శకుడు. నిర్మాత శిల్పా గజ్జల. హీరోగా విరాజ్ అశ్విన్ నటించాడు.

 

గంగానదిలో దూకి ఈత కొట్టిన 80ఏళ్ల బామ్మ

ఒంట్లో ఓపిక ఉండాలే కాని..వయసుతో పని లేదని 80సంవత్సరాల వృద్ధురాలు నిరూపించింది. హరిద్వార్‌లోని ఎత్తైన వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలోకి దూకి నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా ఈదుకంటూ క్షేమంగా ఒడ్డుకు చేరింది. ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది

వయసులో ఉన్న యువతి, యువకులు ఏదైనా స్టంట్స్ చేస్తే  అందరూ "వావ్" అంటారు. అదే వృద్దాప్యంలో ఉన్న ముసలివాళ్లు చేస్తే "వామ్మో" అంటారు. ఎందుకంటే సాహసాలు చేసే వయసు వాళ్లు దాటిపోయారని ఆశ్చర్యపోతూ చెప్పడానికే వామ్మో అంటారు. కాని సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడకుతున్న ఓ వీడియో అయితే మాత్రం ఆ వృద్ధురాలి శరీరంలో రక్తం ఇంకా ఉరకలు వేస్తూ పరుగులు పెడుతోందని నెటిజన్లు(Netizens)కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హరిద్వార్‌(Haridwar)లో రికార్డ్ చేసిన వీడియో(Video) ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌(World Wide)గా వైరల్ (Viral)అవుతోంది.

హరిద్వార్‌లోని హర్కీపైడి దగ్గర గంగానదిపై నిర్మించిన ఎత్తైన వంతెనపై నుంచి ప్రవహిస్తున్న గంగానదిలోకి దూకింది ఓ వృద్ధురాలు. అయితే ఆమె ప్రమాదవశాత్తు నదిలో పడలేదు. లేదంటే ఇంకా ఏదైనా చేసుకోవడానికో అని పొరపాటు పడకండి. 80సంవత్సరాల వయసున్న బామ్మ ఎంతో చలాకీగా వంతెన పైన ఉన్న రెయిలింగ్‌ పై నుంచి గంగానదిలోకి దూకింది. నీళ్లలో పడిన వెంటనే ఏమాత్ర భయపడకుండా ఈదుకుంటూ నీటి ప్రవాహంలో ముందుకుపోయింది. ఈ వృద్ద ఈతగాత్తె అలా గంగానదిలోకి ధైర్యంగా రెయిలింగ్‌ పైనుంచి దూకుతుంటే వేలాది మంది చూస్తుండిపోయారు. నీళ్లలో పడిన తర్వాత కూడా ఆమె ఈత కొట్టడం చూసి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో బ్రహ్మకుండ్‌ దగ్గరున్న హర్కీపైడి దగ్గర చిత్రీకరించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే నీళ్లలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్లిన 80సంవత్సరాల బామ్మ ఏ ప్రాంతానికి చెందినదో ఇంకా తెలియరాలేదు. కాని ఆమె చేసిన ఫీట్ మాత్రం ఔరా అందరిచేత ఔరా అనిపించేలా ఉంది. సాధారణంగాల 80సంవత్సరాల వయసు అంటే కూర్చుంటే లేగవలేని వయసు. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నప్పటికి చేతి కర్ర సహాయం లేనిదే చురుక్కా కదల్లేని పరిస్థితి. అలాంటి పండు ముసలి వయసులో ఉన్న వృద్ధురాలు ఇంతటి సాహసం చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లంతా ముక్కన వేలేసుకుంటే ..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూసిన వాళ్లైతే శభాష్ బామ్మ అంటూ ఆమెను పొగడ్తలతో ముంతెచ్చుతున్నారు. ఇంకొదరైతే ఆరోగ్యమే మహాభాగ్యం అని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

 

పెట్రోల్, డీజిల్ ధరలు  జీఎస్‌టీ పరిధిలోకి?

కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత కూడా దేశంలో ఇంధన ధరలు అధికంగానే కొనసాగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ధరల పెంపు లేనప్పటికీ, ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో పెట్రో రేట్లు భారీగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. పూర్తి వివరాలివే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ మొదలైంది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్ అంశంపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. (ప్రముఖ బిజినెస్ పోర్టల్స్ లో వెలువడుతోన్న రిపోర్టుల ప్రకారం, పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధర ఏకంగా రూ. 30 మేర దిగిరావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయంటూ ప్రధాన్ మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ చైర్మన్ వివేక్ దెబ్రోయ్ చెప్పడం ఈ వార్తలకు బలం చూకూర్చినట్లయింది. ప్రముఖ బిజినెస్ పోర్టల్స్ లో వెలువడుతోన్న రిపోర్టుల ప్రకారం, పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధర ఏకంగా రూ. 30 మేర దిగిరావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయంటూ ప్రధాన్ మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ చైర్మన్ వివేక్ దెబ్రోయ్ చెప్పడం ఈ వార్తలకు బలం చూకూర్చినట్లయింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై 25 శాతం వరకు పన్నులు విధిస్తోంటే, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దాదాపు 20 శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. ఇంధనాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే గరిష్ట పన్ను రేటు 28 శాతంగా ఉండొచ్చు. అప్పుడు పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 33 మేర తగ్గే ఛాన్స్ ఉంది. ఇక నేటి ఇంధన ధరలను పరిశీలిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు మంగళవారం (జూన్ 28)నాడు చేసిన ప్రకటనలో రేట్లు పెంచలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రో ధరలు పెరగ్గా, మే 21న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధర కొద్దిగా దిగొచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్ రేటు లీటరుకు రూ.109.66గా, డీజిల్ రేటు రూ.97.82 గా కొనసాగుతోంది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పట్టణాల్లో ఇంధన కొరత కారణంగా బంకుల వద్ద భారీ రద్దీ కనిపించిందిఏపీ విజయవాడలో పెట్రోల్ ధర లీటరు రూ.112.09గా, డీజిల్ లీటరు రూ.99.65గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటరు రూ. 110.46గా, డీజిల్ లీటరు రూ. 98.25గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 1.07 శాతం పెరిగి బ్యారెల్ ధర 110.64 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.08 శాతం తగ్గి పెరిగి బ్యారెల్ 116.17 డాలర్లుగా ఉంది.



               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...