Monday, 17 June 2024

 సమస్యల పరిష్కారం కోరుతూ, మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన :  సాయి కృష్ణజ హిల్స్   కమిటీ సబ్యులు.






మియాపూర్, బాచూపల్లి పరిధిలోని   సాయి కృష్ణజ హిల్స్   సమస్యల పరిష్కారం కోరుతూ, మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన

 సాయి కృష్ణజ హిల్స్, కాలనిలో సరిగా రోడ్లు లేవు, అలాగే దోమల బెడద ఎక్కువగా ఉంది, ఈ కాలనిలో ఉన్న దాదాపు వెయ్యి మంది వివిధ రంగాలకు చెందినవారు ఉన్నారు, ఫార్మా, సాఫ్ట్వేర్, బిసినెస్, ఇలా అన్నిరకాల వ్యక్తులు ఉన్నారు, కాలనిలో దాదాపు 5 సంవత్సరాల నుండి కమిషనర్ గారిని కలిసి విన్నవించినా ఫలితం లేదు, దాదాపు 800 మంది పిల్లలు, 100 మంది వృద్ధులు ఉండే కాలనిలో కనీస సౌకర్యాలు లేవు, ఉదాహరణకు రోడ్లు లేవు ఈ.మధ్య చాలామంది పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ కాలనీ వాసులు సంవత్సరానికి దాదాపు కోటి రూపాయల ఆస్తి పన్నులు కడుతున్నాం అయిన మా సమస్యలు పరిష్కరాం కావటం లేదు అని ఈ రోజు కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించటం జరిగింది, వారు స్పందించి 10 వ తేది వరకు అధికారులును పంపించి పరిస్థితులు చూసి త్వరితగతిన రోడ్లు వేస్తాం అని చెప్పటం జరిగింది.. ఈ కార్యక్రమంలో.. కమిటీ సబ్యులు..బాల మురళి కృష్ణ, రాజేష్, భాను ప్రసాద్, విజయ్ భాస్కర్, హరీష్,సత్యనారాయణ, రవి కుమార్, నాగ శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...