7.50 లక్షల పరిహారం ఇవ్వండి- సుప్రీంకోర్టు ఆదేశాలు
రేప్ కేసులో జైల్లో ఉన్న ఖైదీకి!!
అత్యాచార కేసుల్లో దోషిగా తేలితే కోర్టులు కఠిన
శిక్షను విధిస్తాయి. దోషులను జైల్లో వేసి ఊచలు లెక్కపెట్టేలా చేస్తాయి. ఐతే
ఛత్తీస్గఢ్ లో ఓ విభిన్నమైన కేసు తెరపైకి వచ్చింది. రేప్ కేసులో దోషికిగా తేలి..
జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని
సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి దీనికి కారణమేంటి? అత్యాచార
బాధితురాలికి పరిహారం ఇవ్వడం చూశాం గానీ.. దోషికి డబ్బులు ఇవ్వడమేంటని
ఆశ్చర్యపోతున్నారా?. జష్పూర్ జిల్లాలోని
ఫర్సాబహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్ముండా గ్రామానికి చెందిన భోలా కుమార్
అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ట్రయల్ కోర్టు అతడిని దోషిగా
నిర్ధారించి... 2014లో జీవిత ఖైదు విధించింది. ఐతే ట్రయల్
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... హైకోర్టులో అప్పీల్కు వెళ్లాడు భోలా కుమార్. 2018 జూలై 19న హైకోర్టు కూడా అతడిని దోషిగా
నిర్ధారించింది. కానీ శిక్షను మాత్రం తగ్గించింది. జీవిత ఖైదు కాకుండా.. ఆ శిక్షను
ఏడేళ్లకు తగ్గించింది. ఐతే హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా.. అతడు పదేళ్ల పాటు జైల్లో
గడపాల్సి వచ్చింది. విచారణ ఖైదీగా కొన్నాళ్లు, ఆ తర్వాత
ఖైదీ ఇంకొన్నాళ్లు.. మొత్తంగా పదేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. కానీ తన శిక్ష ఏడేళ్లే
అని ఎంత చెప్పినా జైలు అధికారులు వినలేదు. శిక్షను అలాగే కొనసాగిస్తూ వచ్చారు
ఈ క్రమంలోనే భోలా కుమార్ అంబికాపూర్ జైలు నుంచే సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తన
శిక్షా కాలం పూర్తైనా.. ఇంకా జైల్లోనే ఉంచుతున్నారని అందులో పేర్కొన్నారు. ఆయ
లేఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్
కోర్టు కోర్టుకు న్యాయం మారుతుంది అని అప్పుడెప్పుడో ఒక సినిమా లో అన్నట్టు ఒకరు చెప్పినదానికి ఒకరి పాటించలేదేమో
ReplyDeleteన శిక్ష ఏడేళ్లే అని ఎంత చెప్పినా జైలు అధికారులు వినలేదు. శిక్షను అలాగే కొనసాగిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే భోలా కుమార్ అంబికాపూర్ జైలు నుంచే సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తన శిక్షా కాలం పూర్తైనా.. ఇంకా జైల్లోనే ఉంచుతున్నారని అందులో పేర్కొన్నారు
ReplyDelete