అగ్నిపథ్ పిటిషన్ల పై విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం వెల్లడి!!
సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీ నిమిత్తం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ (Agnipath Scheme) పథకంపై
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను
విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. వచ్చేవారం ఈ వ్యవహారంపై
వాదనలు విననున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అగ్నిపథ్ స్కీమ్
కింద ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్లో దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.
లక్షలాది మంది ధరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, ఈ పథకం ప్రకటించిన నాటి నుంచే
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ను
రద్దు చేయాలంటూ పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసన.. హింసాత్మక ఘటనలకు దారితీసింది.
అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇండియన్ నేవీ
అభ్యర్థుల తరఫున దాఖలైన పిటిషన్పై వారి తరఫు లాయర్ మాట్లాడుతూ.. ఆ అభ్యర్థులు
ఇప్పటికే శిక్షణ పొందారని, అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి
సమయంలో వారు ఉద్యోగంలో ఉండే కాలం.. ఒక్కసారిగా 20 ఏళ్ల నుంచి 4 సంవత్సరాలకు
తగ్గిపోనుందని వివరించారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని, దీనిపై
సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎంతో మంది
అభ్యర్థుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. త్రివిధ
బలగాల్లో స్వల్పకాలం సేవలందించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం గత నెల అగ్నిపథ్
పథకాన్ని తీసుకొచ్చింది. కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి రిక్రూట్మెంట్
చేపట్టకపోవడంతో.. ఆ మేరకు అర్హత వయసు రెండేళ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ
ఉద్యోగాలకు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులుగా ఉండగా.. ఈ ఏడాదికి ఆ
పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్ల
పాటు సేవలు అందిస్తారు. ఆ తర్వాత 25 శాతం మందిని శాశ్వత కేడర్కు ఎంపిక
చేయనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 75 శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్
అవుతారు. అయితే, రిలీవ్ సమయంలో కేంద్రం వారికి సుమారు రూ.11 లక్షలు
ఇవ్వనుంది.
సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, ముఖ్యంగా
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా నిరీక్షిస్తున్న అభ్యర్థులు కేంద్రం ప్రకటనపై ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సమ్మర్
వెకేషన్ తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తున్న న్యాయస్థానం.. అగ్నిపథ్కు
వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనుంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే
మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనున్నట్లు తెలుస్తోంది.
విమర్శకులపై ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేయకుండా, కాస్త నిదానించాలి. ఇప్పటికే పరీక్షలు పాసయినవారికి రాత పరీక్ష పెట్టి రిక్రూట్ చేసుకోవడం ప్రథమ కర్తవ్యం. అగ్నివీర్ పథకం మంచిదే అయితే చిన్న స్థాయిలో యీ ఏడాది ప్రవేశపెట్టి, క్రమేపీ వారి సంఖ్య పెంచుకుంటూ పోవచ్చు.
ReplyDeleteప్రభుత్వం యీ పరిణామాలన్నీ అంచనా వేసిందో లేదో తెలియదు. స్కీము పెట్టేశారు. వెంటనే మోదీ భక్తబృందం భజన మొదలుపెట్టేశారు. ఐ యామ్ ఫర్ అగ్నిపథ్ స్కీమ్ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజిలు వచ్చేస్తున్నాయి. మనమూ లింకు నొక్కి సంఘీభావం వ్యక్తం చేయాలట. నోట్ల రద్దు టైములోనూ యింతే. ఎటిఎంలలో కొత్త నోట్లు పడతాయో లేదో, బ్యాంకులకు ఆర్బిఐ ద్వారా నోట్లు చేరాయో లేదో కూడా చూసుకోకుండా పథకం పెట్టేశారు. విమర్శలు వచ్చినపుడు, తప్పు దిద్దుకోలేదు. మరీ బిర్రబిగిసారు. పొరపాట్లు ఎత్తి చూపినవారిని దేశద్రోహులన్నారు. చివరకు పథకం ఏమైంది?
ReplyDelete