ప్రజల
తప్పుల వల్లే ఈ కుంభవృష్టి
లష్కర్
బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో
రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తురాలైన స్వర్ణలత
భవిష్యవాణి వినిపించారు. వారి
మాటల్లోనే..
‘మొక్కుబడిగా
పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా
జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు
మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే
పూజలు.. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు
చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు. మీ
సంతోషం కోసం పూజలు చేస్తున్నారే తప్ప నాకోసం కాదు. మీరు చేసే తప్పులన్నీ కడుపులోనే
దాచుకుంటున్నాను. నా గర్భగుడిలో పూజలు శాస్త్రోస్తకంగా పూజలు చేయండి. మీరు ఎన్ని
తప్పులు చేస్తున్నా నా బిడ్డలే కదాని భరిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినట్లు నా
రూపాన్ని మార్చేస్తున్నారు. నావన్నీ కాజేస్తున్నారు. నాకు శాశ్వతరూపం కల్పించండి.
భక్తులు నన్ను కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయండి. మీరంతా నా పట్ల చేసే
తప్పుల విషయంలో నా ఆగ్రహాన్ని వర్షాల రూపంలో చూపించాను. ఆగ్రహంతోనే భారీవర్షాలు
కురిపించాను. నా గురించి మీకు తెలియాలనే ఇలా చేశా’ అని
అమ్మవారు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment