పిల్లల్ని
ప్రభుత్వ బడిలో చేర్చిన కలెక్టర్..
సాధారణంగా
ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ పిల్లల్ని పెద్ద పేరున్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు.
లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పంపుతుంటారు. అలాంటి వారి పిల్లలు ప్రభుత్వ
పాఠశాలలవైపు చూడరన్న ప్రచారమూ లేకపోలేదు. ఐతే ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేట్
స్కూళ్లకు ధీటుగా చదువు అందుతుందని.. అక్కడ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని
నిరూపించేందుకు ఓ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో Andhra
Pradesh లోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఏపీ ఐఏఎస్ ఆఫీసర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు
పిల్లలను Vijayawada పడమటలోని
జిల్లా పరిషత్ స్కూల్లో చేర్పించారు.
మంగళవారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో స్కూళ్లను తెరిచారు.
దీంతో ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మీ.. తన ఇద్దరు పిల్లలను స్కూల్ కు తీసుకెళ్లి
అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు చక్కగా ఉండటం, క్లాస్
రూమ్, ప్లే గ్రౌండ్స్ అన్నీ అభివృద్ధి చేయడంతో తమ పిల్లల్ని
ఇక్కడ చేర్పించినట్లు ఆమె తెలిపారు. గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి..
అప్పుడు కూడా తన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించారు. గతేడాది తన కుమార్తె
ఎన్.అలెక్స్ శృతిని పొదలకూరు రోడ్డులోని దర్గామిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో, కుమారుడు ఎన్.క్రిష్ ధరణ్రెడ్డిని
వేదాయపాళెం స్పిన్నింగ్ మిల్లు కాలనీ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి అందరికీ
ఆదర్శంగా నిలిచారు.
రాజకీయ నాయకుల పిల్లలు, ప్రభుత్వ అధికారుల పిల్లలు అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే నిబంధన పెడితే చాల బాగుంటది
ReplyDelete