Friday 8 July 2022

 

ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసిన నాయకుడు-- దారుణ హత్య


పాన్‌ మాజీ ప్రధాని, భారత్ ఆత్మీయ మిత్రుడు షింజో అబె ఇకలేరు. ఎన్నికల ప్రచారంలో దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడి కాల్పుల్లో గాయపడిన షింజో అబె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎల్‌డీపీ వర్గాలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ వార్త తెలియగానే ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతోంది. ఒక దేశ మాజీ ప్రధాని, దూరదృష్టి గల నేత, ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు, జనం మనసెరిగిన నేత ఇలా దారుణంగా హత్యకు గురవడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. షింజో అబె మృతిపై వివిధ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు్న్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారుజపాన్‌ పార్లమెంట్‌ ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిమిత్తం షింజో అబె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం (జులై 8) ఉదయం నరా నగరంలోని ఓ కూడలి వద్ద లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన వేదికపైనే కుప్పకూలారు. దుండగుడు నాటు తుపాకీతో ఆయన వెనుక వైపు నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు సార్లు కాల్పలు జరపడంతో షింజో అబె తీవ్రంగా గాయపడ్డారు

1 comment:

  1. షింజో అబె మృతిపై వివిధ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు్న్నారు

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...