Tuesday 21 June 2022

 

జేఈఈ  మెయిన్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్

 

అగ్నిపథ్ (Agneepath) నిరసనల నేపథ్యంలో జేఈఈ  మెయిన్‌ను (JEE Mains) వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. #postponejeemains2022 అనే

జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చేపడతుంది. నోటిఫికేషన్ విడుదల సందర్భంలో జూన్ 20 నుంచి జేఈఈ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎన్‌టీఏ పేర్కొంది. ఇటీవల ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేసినప్పుడు, జేఈఈ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరుగుతాయని తెలిపింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానం అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో తమ ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం కష్టంగా మారుతుందని పేర్కొంటూ, జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల అభ్యర్థనలపై ఎన్‌టీఏ ఇంతవరకు స్పందించలేదు. మరోపక్క పరీక్షకు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నా... ఇప్పటివరకు అడ్మిట్ కార్డును విడుదల చేయలేదు. సాధారణంగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేస్తారు. కానీ, ఈసారి పరీక్షకు ప్రస్తుతం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ కోసం దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. #postponejeemains2022 అనే యాష్ ట్యాగ్‌లను వైరల్ చేస్తున్నారు. ఓ ఔత్సాహిక అభ్యర్థి టిట్టర్‌లో ఇలా స్పందించాడు..‘‘ అగ్ని‌పథ్‌కు నిరసనగా కొన్ని రాష్ట్రాల్లో అల్లరు జరుగుతున్నాయి. దీంతో ఇన్ టైంలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోతున్నాం. మా వాయిస్‌ను వినిపించడానికి హెల్ప్ చేయండి.’’ అంటూ కోరాడు.

మరో అభ్యర్థి ఇలా ట్వీట్ చేశాడు.. ‘‘అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ చేరుకున్నా, ప్రశాంతంగా పరీక్ష రాయలేరు. కాబట్టి, జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయండి. ఎందుకంటే ఇది సులువైన పరీక్ష కాదు, విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.’’ అని పేర్కొన్నాడు.

ఇంకో అభ్యర్థి ఇలా స్పందించాడు. ‘‘అగ్నిపథ్ నిరసనల కారణంగా చాలా రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో జేఈఈ పరీక్ష సెంటర్ల నగరాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. దయచేసి జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయండి.’’ అంటూ విజ్ఞప్తి చేశాడు.#Postponejeemains2022 అనే యాష్ ట్యాగ్‌ను ప్రధాని మోదీ, ఎన్‌టీఏ‌కు ట్యాగ్ చేశాడు.

ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు విదేశాల్లో కొత్తగా 22 నగరాల్లో నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి తర్వాత విదేశాల్లో పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో అగ్నిపథ్ నిరసన కారణంగా అనేక రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో తమ ప్రయాణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యార్థులు వాపోతున్నారు. కాబట్టి జేఈఈ మెయిన్ వాయిదా వేయాలని కోరుతున్నారు

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...