బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని ఝలక్…
బీజేపీకి
టీఆర్ఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ
సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ సభ హైదరాబాద్లో జరగనున్న సంగతి
తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రచారం చేసుకునే వీలు లేకుండా ముందస్తుగా అన్ని అడ్వర్టైజ్మెంట్
ఏరియాలను టీఆర్ఎస్ బుక్ చేసుకుంది.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య
పోరు తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి
ఊహించని షాక్ ఇచ్చింది. వచ్చే 3, 4వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో
జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారీ
సభను నిర్వహించబోతున్నారు. ఇక అలాంటి సమావేశాలుంటే పార్టీ నేతలు ప్రచారంతో
హోరెత్తిస్తారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఊదరగొట్టేస్తారు. అయితే బీజేపీ
అలా ప్రచారం చేసుకోకుండా టీఆర్ఎస్ ఎత్తు వేసింది. బీజేపీ నేతలు ప్రచారం
చేసుకునేందుకు అవకాశం లేకుండా కారు పార్టీ పక్కా స్కెచ్ వేసి అమలు చేసింది.
ప్రకటనల కోసం ముందస్తుగా మెట్రో పిల్లర్లు, బస్టాప్లు, ఇతర అడ్వర్టైజ్మెంట్ ఏరియాలను టీఆర్ఎస్
పార్టీనే బుక్ చేసుకుంది. సిటీలో బీజేపీ ప్రకటనలకు ఎలాంటి తావు లేకుండా టీఆర్ఎస్
చేసింది. ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో వారం రోజులు ప్రీప్లాన్డ్గా
ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2,300లకు పైగా మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం
నిర్వహిస్తోంది. ఇటు సిటీలోని వెయ్యి బస్టాప్లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు
చేసింది. మొత్తానికి బీజేపీ తేరుకునేలోగా గులాబీ నేతలు తమ పని కానించేశారు. దీంతో
కమలనాథులు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు
రాజు తలుచుకంటే దెబ్బలకు కొదవ అని, అంతే ఉంటది
ReplyDelete