ఒక్కో
రెబల్ ఎమ్మెల్యేకి రూ.50 కోట్లు..సామ్నా
సంచలన కథనం!
రాజకీయ సంక్షోభం(Maharashtra Political Crisis) ముదిరింది. శివసేన రెబల్
ఎమ్మెల్యేలను తమదారికి తెచ్చుకోవడానికి ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంపై
తిరుగుబాటు లేవనెత్తిన ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ శిండే, రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన(Shiv sena) పార్టీ తన
అధికార పత్రిక సామ్నా(Saamana)లో తీవ్ర
విమర్శలు గుప్పించింది. సోమవారం నాటి సామ్నా ఎడిషన్లో...ఏక్నాథ్ షిండే(Eknath Shinde) నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రూ.50-50 కోట్లకు అమ్ముడుపోయారని, ఇది
ప్రజాస్వామ్యానికి మచ్చ అని శివసేన పేర్కొంది. స్క్రిప్ట్ అంతా బీజేపీదేనని
ఆరోపించింది. ఎట్టకేలకు, గౌహతి ఎపిసోడ్(శివసేన రెబల్
ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్నారు)తో బీజేపీ బండారం
బట్టబయలైందని సామ్నా తన కథనంలో పేర్కొంది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు
వారి అంతర్గత వ్యవహారమని పగటిపూట చెప్పే బీజేపీ...ఓ రాత్రి వడోదరలో దేవేంద్ర
ఫడ్నవీస్, ఏక్దాస్ షిండే రహస్యంగా సమావేశమయ్యారని తెలిపింది. ఈ సమావేశంలో
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారని... ఆ వెంటనే 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ‘వై’ కేటగిరీ ప్రత్యేక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసిందని సామ్నా తన కథనంలో తెలిపింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం వై
ప్లస్ కేటగిరి భద్రతను కల్పించడాన్ని చూస్తే వారి వెనక బీజేపీ ఉన్నట్లు స్పష్టంగా
అర్థమవుతోందని తెలిపింది. ఈ రెబల్ శివసేన ఎమ్మెల్యేలు ముంబై-మహారాష్ట్రకు
రావడానికి భయపడుతున్నారని, ఈ ఖైదీ ఎమ్మెల్యేలు ముంబైలో
దిగగానే మళ్లీ జంప్ చేసి తమ ఇళ్లకు పారిపోతారన్న ఆందోళనతో వారిని ప్రభుత్వ
సెంట్రల్ సెక్యూరిటీతో బందీ చేశారని విమర్శించింది. మరోవైపు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ
వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి
జిర్వాల్...అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండేను కాకుండా శివసేన
అధినేత, సీఎం
ఉద్దవ్ ఠాక్రే సూచించిన వ్యక్తిని గుర్తించడం పట్ల షిండే నేతృత్వంలోని రెబల్
గ్రూప్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి
పార్టీ శాసనసభాపక్ష నేత కాలేరని స్పష్టం చేసింది షిండే క్యాంపు. ఎమ్మెల్యేలుగా
అనర్హతకు సంబంధించి ఇచ్చిన నోటీసులకు జూన్ 27వ తేదీ సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని తిరుగుబాటు నేత
షిండే సహా 16 మంది
రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ శనివారం సమన్లు జారీ చేశారు.
దీనిపైనా రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాల్ అనర్హత పిటిషన్పై ఎలాంటి
చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్ను ఆదేశించాలని తిరుగుబాటుదారులు
సుప్రీంకోర్టును కోరారు. తమకు మరింత సమయం ఇవ్వాలన్నారు. తమ కుటుంబాలకు భద్రత
కల్పించేలా చర్యలు కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని
సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేపీ పర్దివాలా సభ్యులు గల బెంచ్ సోమవారం(జూన్ 27,2022) సోమవారం
విచారణ జరపనుంది. ప్రస్తుతం అసోంలోని గౌహతిలో ఓ హోటల్లో ఉన్న శివసేన తిరుగుబాటు
ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం 2 గంటలకు
ఏక్నాథ్ శిండే నేతృత్వంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో
భవిష్యత్ కార్యచరణ, తదుపరి
వ్యూహాలు చర్చించనున్నట్లు సమాచారం
అయ్యేండొచ్చు ఎందుకంటే దీని వెనకాల ఒక జాతీయ పార్టీ ఉందని షిండే నే చెపుతున్నారు కదా
ReplyDelete