ప్రైవేట్
హాస్పిటల్లో పార్టీ .. గర్భిణికి ట్రీట్మెంట్ అందక పసికందు మృతి
హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని
ప్రైవేట్ హాస్పిటల్స్(private hospital) యాజమాన్యం, సిబ్బంది
నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలిగొంది. ట్రీట్మెంట్(Treatment)కోసం
వచ్చిన రోగులను పట్టించుకోకుండా పార్టీల పేరుతో జల్సా చేశారు స్టాఫ్. ఆసుపత్రి
బిల్డింగ్పైనే డీజే సౌండ్ల (DJ Sounds)తో
ఆసుపత్రిలో వాతావరణాన్ని రణగణధ్వనిలా మార్చేస్తారు. దాంతో రోగులు వైద్యం చేయండి
బాబోయ్ అని అరుస్తున్న వినిపించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. హాస్పిటల్లో
రోగులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో పట్టించుకోకుండా డ్యాన్సుల్లో మునిగి తేలడంతో
తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ప్రాణాలు వదిడిచింది. హైదరాబాద్
చాదర్ఘాట్లోని ఇంతియాజ్ ప్రైవేట్ ఆసుపత్రికి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని తీసుకొచ్చారు బంధువులు. అదే సమయంలో మహిళకు ప్రసవ నొప్పులు అధికం కావడంతో
బంధువులు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, నర్సుల
కోసం వెదికారు. ఆసుపత్రిలో రోగులు ఉంటే ...సిబ్బంది అంతా హాస్పిటల్ బిల్డింగ్పైన
ఏర్పాటు చేసిన పార్టీలో మునిగిపోయారు. ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ కుమార్తె
వివాహం ఉండటంతో స్టాఫ్ బ్యాచిలర్ పార్టీ పెట్టుకున్నారు. బిల్డింగ్పైన డీజే
సౌండ్స్, డిన్నర్, డ్యాన్సులతో
హోరెత్తించారు. ఆసుపత్రిలోని పేషెంట్లను గాలికి వదిలేశారు. మొత్తం మర్చిపోయి జల్సా
చేస్తుండిపోయారు గర్భిణి మహిళ నొప్పులు పడుతుండటంతో బంధువులు డాక్టర్ని
పిలిచారు. ట్రీట్మెంట్ అందించాలని కోరారు. అయితే పార్టీ మూడ్లో ఉన్న వైద్య
సిబ్బంది పేషెంట్ని పట్టించుకోకపోవడంతో మహిళ శిశువుకు జన్మనిచ్చింది. అయితే
పుట్టిన ఐదు నిమిషాల్లోనే పసికందు చనిపోయింది. పుట్టిన బిడ్డ చనిపోవడంతో గర్భిణి
బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. కేవలం వైద్య సిబ్బంది, డాక్టర్ల
నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ చనిపోయిందని ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో పార్టీలు, డీజే
డ్యాన్సులు పెట్టుకోవడం ఏమిటని నిలదీశారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని కోరుతున్నారు
ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోగులకు సరైన వైద్యం అందడం లేదని విమర్శలు
ఉన్నాయి. తాజాగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా రోగుల వైద్యసేవలను పక్కన పెట్టి పర్సనల్
వ్యవహారాలు, పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తున్నాయనే
వార్త విస్తృతంగా వైరల్ అవుతోంది. డాక్టర్ కుమార్తె వివాహం నెల రోజులు ఉంటే అంత
ముందుగానే అది కూడా హాస్పిటల్ బిల్డింగ్పై పార్టీ పెట్టుకోవడం ఏమిటని
మండిపడుతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ రోజుల ఆరోగ్యాన్ని
గాలికొదిలేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని
నగరవాసులు కోరుతున్నారు.
No comments:
Post a Comment