సర్వీస్ తర్వాత అగ్నివీర్ల
పరిస్థితి ఏంటి?
నాలుగేళ్ల సర్వీస్ తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చే జవాన్లు
ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
''ప్రతీ ఏడాది సుమారు 17,600 మంది సర్వీస్ ముగియకముందే
రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వారిని ఇలా అడిగేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.
రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ వారిని అడగలేదు. ఇంకో మాట ఏంటంటే నాలుగేళ్ల
తర్వాత 25 శాతం మంది అగ్నివీర్లు సైన్యంతో పాటే ఉంటారు.
మిగిలినవారిని ఇతర విభాగాల్లో నియమించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ
మేరకు రక్షణ, హోం మంత్రిత్వ శాఖ నుంచి కీలక ప్రకటనలు కూడా
వచ్చాయి. దీని కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా
మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నాం. కాలక్రమేణా ఈ దిశగా చాలా మార్పులు
జరుగుతాయి. పోలీసు రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని
అన్ని రాష్ట్రాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. నాలుగు రాష్ట్రాలు హామీ
కూడా ఇచ్చాయి. కాలక్రమేణా మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పని చేస్తాయని ఆశిస్తున్నా''
అని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు, రక్షణ మంత్రిత్వ శాఖకు
చెందిన 16 పీఎస్యూలు తమ ఉద్యోగాలలో 10% అగ్నివీర్లకు రిజర్వ్ చేస్తామని ప్రకటించాయి.
సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, అస్సాం రైఫిల్స్ ఉద్యోగాల్లో
కూడా అగ్నివీర్లకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని హోం
మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్లో కూడా అగ్నివీర్లకు
ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
బ్యాంకుల నుంచి సులభంగా
రుణాలు
''ఆర్మీలో నాలుగేళ్లు పని చేసి బయటకు వచ్చే నాటికి
అగ్నివీర్ల వయస్సు 21.5 నుంచి 25 ఏళ్ల
మధ్య ఉంటుంది. రిటైర్మెంట్ ప్యాకేజ్ కింద రూ. 11.71 లక్షలు
లభిస్తాయి. వారికి బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేలా ఏర్పాట్లు చేస్తాం.
సొంతంగా ఏదైనా వ్యాపారాలు నడుపుకోవచ్చు. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు వారు అనేక
రకాల శిక్షణ తీసుకొని ఉంటారు. మీరే చెప్పండి 25 ఏళ్లకే
ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుంది'' అని ఆయన ప్రశ్నించారు.
''వికలాంగులుగా మారితే ప్యాకేజీ ఇవ్వాలనే నిబంధన
తెచ్చాం. దేశసేవలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరులకు కోటి రూపాయల పరిహారం అందుతుంది.
సియాచిన్లో పనిచేసే సైనికులకు ఇచ్చే అలవెన్సులు, సౌకర్యాలు
అగ్నివీర్లకు కూడా లభిస్తాయి. సైన్యం నిబంధనల ప్రకారం అగ్నివీరులపై ఎలాంటి
భేదభావం చూపట్లేదు. సర్వీస్ నుంచి బయటకు వచ్చే అగ్నివీరులను మరింత నైపుణ్యం కలిగిన
వారిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కోర్సులు కూడా ఏర్పాటు చేయనున్నాం'' అని తెలిపారు.
భారత సైన్యంలో
యువకులు, అనుభవజ్ఞుల మధ్య సమతూకం తీసుకురావాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా
భావిస్తున్నట్లు పురీ చెప్పారు. ఈ కొత్త రిక్రూట్మెంట్ పథకంతో ఈ సమతూకం
ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
''కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతోంది. ఆధునిక
యుద్ధాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న యువకులు మాకు అవసరం. ఎందుకంటే యువత, సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకుంటుంది. వయస్సు విషయంలో అగ్నిపథ్ పథకంలో
ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా మహమ్మారి వల్ల నష్టపోయిన వారికి మేలు చేసేందుకు
ఈసారికి వయో పరిమితిని 23 ఏళ్ల వరకు పెంచాం'' అని ఆయన చెప్పారు.
నాలుగేళ్ల సర్వీస్ తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చే జవాన్లు ఏం చేస్తారన్న
ReplyDelete