Sunday 3 July 2022

 

లోయలో పడిన ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి

 


హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

‘‘సైంజ్ వ్యాలీలోని నియోలీ-షంషేర్ రహదారిలో ప్రయాణిస్తోన్న బస్సు జంగ్లా ప్రాంతంలో కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గాయపడిన పడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. బస్సులో పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు భావిస్తున్నాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని అశుతోష్ గార్గ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

అయితే, ఈ ఘటనలో 16 మంది మరణించారని అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.

‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

 

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...