లోయలో పడిన ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి…
హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ప్రైవేట్ బస్సు రోడ్డు
ప్రమాదానికి గురైనట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ను ఉటంకిస్తూ వార్తా
సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
‘‘సైంజ్ వ్యాలీలోని నియోలీ-షంషేర్ రహదారిలో ప్రయాణిస్తోన్న బస్సు జంగ్లా
ప్రాంతంలో కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది
మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గాయపడిన
పడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. బస్సులో పాఠశాల విద్యార్థులు
ఉన్నట్లు భావిస్తున్నాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని
అశుతోష్ గార్గ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
అయితే, ఈ ఘటనలో 16 మంది మరణించారని అధికారులను ఉటంకిస్తూ
వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు
తెలిపింది.
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.
‘‘హిమాచల్ ప్రదేశ్లోని కులులో జరిగిన
ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని
ఆశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధితులకు స్థానిక యంత్రాంగం
అన్ని విధాలుగా సహకరిస్తోంది’’ అని ట్వీట్
చేశారు.
No comments:
Post a Comment