28 శాతం జీఎస్టీ శ్లాబ్ తొలగింపు..?
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(Goods And
Service Tax) అమలులోకి వచ్చిన తర్వాత నలుగు స్లాబ్ లల్లో ట్యాక్స్ లను వసూలు
చేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబ్లో ఎక్కువగా ఉన్న 28 శాతం కొనసాగుతోంది.
వన్
నేషన్.. వన్ రేషన్ లాగా.. ఒకే దేశం.. ఒకే పన్నులాగా మారడం చాలా క్లిష్టమైన పని అని
ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ నాలుగు శ్లాబ్ లు కాకుండా.. బంగారం, నగలుపై 3 శాతం జీఎస్టీ వసూలు
చేస్తున్నారు.
గూడ్స్
అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలులోకి వచ్చిన తర్వాత నలుగు స్లాబ్ లల్లో ట్యాక్స్ లను
వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబ్లో ఎక్కువగా ఉన్న 28 శాతం కొనసాగుతోంది. ఈ 28 శాతం జీఎస్టీ శ్లాబులో
విలాసవంతమైన వస్తువులు, హానికరమైన
వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబులను
సవరించాలని,
28 శాతం పన్నును తొలగించాలని చాలా
కాలంగా డిమాండ్ ఉంది. అంతే కాదు.. 5,12, 18 మూడు
రకాల శ్లాబులను కుదించి రెండే ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై
రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడారు. చాలా కాలం నుంచి డీజిల్ , పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి
తీసుకురావాలన్న డామాండ్ కొనసాగుతోంది..కానీ దీనిపై వ్యతిరేకత కూడా ఉందని అన్నారు.
ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు ఒక
వేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే అదాయంపై
స్పష్టత రానంత వరకు దీనిపై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా
వేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి కూడా దృవీకరించారు . అంతే
కాకుండా.. కేంద్రం, రాష్ట్రాలకు
మధ్య ఈ విషయంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ శ్లాబ్ లో ఉన్న 5,12,18 శాతం ట్యాక్స్ లను రెండుగా
కుదించే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. దీనిలో సెంట్రల్(CGST 1.5) మరియు స్టేట్ ట్యాక్స్(SGST 1.5) లు ఉంటాయి. ఇక ఈ పన్నుల్లో
మార్పులు, జీఎస్టీ పరిధిని ఎలాంటి వాటికి
మినహాయించాలనే దానిపై అధ్యాయనం చేయడానికి కమిటీని వేసినట్లు తెలిపారు. దీనికి ఒక నివేదిక ఇవ్వాలని
కర్ణాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికి
ఇవ్వడానికి 3
నెలల సమయం పడుతుందన్నారు
వన్ నేషన్.. వన్ రేషన్ లాగా.. ఒకే దేశం.. ఒకే పన్నులాగా మారడం చాలా క్లిష్టమైన పని
ReplyDelete