ఆంధ్ర వద్దు తెలంగాణే ముద్దు అంటున్న5 గ్రామాలు
భద్రాచలం వరదలు - పోలవరం
డ్యాం వ్యవహారంలో ఏపీ, తెలంగాణ మధ్య మాటలయుద్ధం కొనసాగుతుండగా..
ఏపీలోని ఐదు గ్రామాలు కీలక తీర్మానం చేశాయి. తమను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల
పాలక వర్గాలు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశాయి. పురుషోత్తపట్నం, పిచుకలపాడు, గుండాల, ఎటపాక,
కన్నాయిగూడెం గ్రామాల పాలక వర్గాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
రాష్ట్ర
విభజన తర్వాత ఏపీలో విలీనం చేసిన 7 మండలాల పరిధిలో ఈ ఐదు
గ్రామాలు ఉన్నాయి. విలీనం తర్వాత వీటిని తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా చేర్చగా..
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అనంతరం అల్లూరి మన్యం జిల్లాలో భాగంగా
ఉన్నాయి. ఎటపాకను మండలంగా చేశారు. అయితే, జిల్లా కేంద్రం
పాడేరు తమకు చాలా దూరంగా ఉందని ఈ ఐదు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సరకులు,
వైద్య చికిత్స, ఇతర అవసరాల నిమిత్తం తాము తరచూ
భద్రాచలం పట్టణానికి వెళ్తామని చెబుతున్నారు. ఏపీలో ఉన్నమాటే గానీ.. ఏ అవసరం
వచ్చినా తెలంగాణకే వెళ్తున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమను తిరిగి తెలంగాణ
రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment