Thursday 21 July 2022

 

అంబులెన్సుకె ఆపద..!

 కొన్ని సార్లు.. వాహనాలు అదుపు తప్పి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం తరుచుగా టూవీలర్స్, ఫోర్ వీలర్ వెహికిల్స్ వాహనాలు రోడ్డుప్రమాదానికి గురవ్వడం చూస్తుంటాం. భారీ వర్షం వలన లేదా కొన్ని సార్లు బ్రేకులు ఫెయిల్ కావడం వలన కూడా వాహనాలు ప్రమాదానికి గురౌతుంటాయి. చూస్తుండగానే.. ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘెర ప్రమాదం ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక అంబూలెన్స్ వేగంగా వస్తుంది. అక్కడ వర్షంకూడా భారీగా కురుస్తుంది. ఈ క్రమంలో.. అంబులెన్స్ సైరన్ ను విన్న సిబ్బంది.. పరిగెత్తుకుంటు బైటకు వచ్చారు. అడ్డుగా ఉన్న బారికెడ్లను తొలగిస్తున్నారు.

ఇంతలో.. డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేసిట్టున్నాడు. అసలే.. వర్షం.. ఆపైన స్పీడ్.. దీంతో అంబూలెన్స్ 

  అదుపు తప్పి బోర్లా పడింది. అదే విధంగా.. బోర్లుకుంటూ.. అక్కడే ఉన్న టోల్ బూత్ కు

 గుద్దుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో నలు

గురు స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. అంబూలెన్స్ లో ఉన్న వస్తువులు అన్న చెల్లాచెదురుగా

 బయట పడ్డాయి. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ షాకింగ్

 వీడియో సోషల్ మీడియాలో మారింది.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...