Thursday 21 July 2022

 కేరళలో NEET పరీక్షపై మానవ హక్కుల సంఘం సీరియస్...

 

మెటల్ హుక్స్ ఉన్న బ్రాలను తొలగించాలని పరీక్షా కేంద్రంలో సిబ్బంది ఒత్తిడి చేశారు. దాంతో ఓ అమ్మాయి 

 బ్రా లేకుండానే మూడు గంటలు పరీక్ష రాసింది. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పగా.. ఆయన మీడియా 

ముందు విషయాన్ని తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత మరికొంతమంది 

విద్యార్థినులు కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. లో దుస్తుల లేకుండా పరీక్ష రాయడంతో చాలా ఒత్తిడికి గురయ్యామని వారంతా వాపోయారు. దాంతో వివాదం ముదిరింది. ఈ అంశంపై మానవ హక్కుల సంఘం స్పందించి. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది. కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎన్‌టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. అయితే మొదట ఇవన్నీ ఆరోపణలని, బాలికలు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కొట్టిడేసింది. కానీ కొల్లంలో పర్యటించేందుకు ఎన్టీఏ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

 నాలుగు వారాల్లో ప్యానెల్ తన నివేదికను సమర్పించనుందని అధికారులు తెలిపారు.పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గురువారం నీట్ అబ్జర్వర్, ఎగ్జామ్ కో ఆర్డినేటర్‌ను పోలీసులు విచారించి తర్వాత అరెస్ట్ చేసినట్టు ఒక అధికారి తెలిపారు. వీరి అరెస్ట్‌తో ఇప్పటి వరకు ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిల లో దుస్తులను విప్పించిన సమయంలో డ్యూటీలో ఉన్న ఐదుగురు మహిళలను మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నియమించిన ఏజెన్సీలో పనిచేస్తుండగా.. ఇద్దరు ఘటన జరిగిన ఆయూర్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న వారు. కొల్లాంలోని మార్థమాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కేంద్రంలో విద్యార్థినులను లో దుస్తులను తీసేసిన తర్వాతే లోపలికి అనుమతించినట్టు మొదట ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐదుగురు ఫిర్యాదు చేశారు. దీంతో కాలేజీలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించినట్టు తెలుస్తుంది.




No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...