బల నిరూపణ ప్రదర్శించుకునేందుకు సిద్ధమవుతున్న ఆప్
తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక
సమావేశం అవుతోంది.
దిల్లీలో బీజేపీ
ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమయిందని ప్రజలకు తెలియచెప్పేందుకు సభలో
విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
చెప్పారు.
దిల్లీలో ఆమ్
ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను పక్కన పెట్టిందని
కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ 40 మంది శాసన సభ్యులను తమ
పార్టీ నుంచి తప్పించాలని చూసిందని, అందుకోసం ఒక్కొక్కరికీ
రూ. 20 కోట్ల రూపాయిలను లంచంగా ఇవ్వాలని చూసిందని
ఆరోపించారు.
గత వారం అరవింద్
కేజ్రీవాల్ ఇంట్లో శాసన సభ్యులతో సమావేశమయ్యారు. మొత్తం 62 మంది ఆప్
శాసన సభ్యులకు గాను 53 మంది మాత్రమే ఈ సమావేశానికి
హాజరయ్యారు.
ఉప ముఖ్యమంత్రి
మనీష్ సిసోడియాకు కూడా బీజేపీలో చేరితే ఆయన పై పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని
చెప్పారని ఆరోపించారు.
దిల్లీలో మద్యం
కుంభకోణానికి సంబంధించి మనీష్ సిసోడియా ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ
కేసులో మరొక 14
మందితో పాటు సిసోడియా పై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఆయన పై ఈడీ
మనీ లాండరింగ్ కేసును కూడా నమోదు చేసింది.
దిల్లీలో 70 అసెంబ్లీ
స్థానాలకు గాను, 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండగా,
బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి.
No comments:
Post a Comment