అసంబ్లీ రద్దు జాతీయ పార్టీ
ముద్దు .... వ్యూహం మార్చిన గులాబీ దళపతి
‘పాతసీసాలో కొత్త సారా’అనేది
చాలా పాపులర్ సామెత. ప్రస్తుతం కేసీఆర్ ప్లాన్ చేస్తున్న జాతీయ పార్టీ వ్యవహారం
కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. ఆయన అచ్చంగా కొత్త పార్టీ పెట్టబోవడం లేదు.
ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే కొత్తగా జాతీయ పార్టీ రూపం ఇవ్వబోతున్నారు.
కాకపోతే.. ‘తెలంగాణ’ అనే పేరు
తగిలించుకుని పుట్టిన పార్టీకి జాతీయ రూపం అంటే జనం నవ్వుతారు గనుక.. పార్టీ పేరు
మార్చి.. కొత్తగా చెలామణీలోకి తేవాలనేది ఆయన ఆలోచనగా వినిపిస్తోంది. ఈ సంగతే ఆయన
అంటున్నట్టుగా దసరా నాటికి ప్రకటిస్తారనేది సమాచారం.
జాతీయ
రాజకీయాల్లోకి వెళ్లడం తథ్యం అని ప్రకటించిన తర్వాత.. భారత రాష్ట్ర సమితి పేరుతో
ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని చాలా ప్రచారం జరిగింది. ఆ పార్టీ జాతీయ
రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక
పోషిస్తూ.. దేశంలోని బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీన్నిటినీ ఒక గొడుగు
కిందకు తేవడమే లక్ష్యంగా తన అడుగులు ప్రారంభించిన కేసీఆర్.. ఆలోచనను జాతీయ
పార్టీగా తన పార్టీనే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే భారత
రాష్ట్ర సమితి అనేది తెరాసకే కొత్త పేరు కాబోతున్నదని సమాచారం.
జాతీయ పార్టీగా
రూపుదాలిస్తే.. తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా పోటీచేయాలి. తెలంగాణ తెలుగు ప్రజల
ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోటీకి కేసీఆర్ ఇప్పటికే ప్లాన్ చేసుకుని
ఉండొచ్చు. కానీ ఆ అడుగులు ఎలా పడబోతున్నాయి? ఇతర రాష్ట్రాల్లో ఆయన సొంతంగా
పోటీచేయగల సీట్లు ఎన్ని? ఏ రాష్ట్రాల్లో పొత్తులు
పెట్టుకుని.. అక్కడి పార్టీలనుంచి సీట్లు పొందగల స్థితిలో ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలే.
కేసీఆర్ కు ఇంకో
పెద్ద సమస్య ఉంది. ఆయన ఇప్పటిదాకా కలిసిన పార్టీల వారందరూ కూడా.. కాంగ్రెస్ కూడా
ఉండవలసిన కూటమినే ఇప్పుడు అభిలషిస్తున్నారు. తద్వారా బిజెపి వ్యతిరేక ఓటు ఏమాత్రం
చీలకూడదని అంటున్నారు. మరి కాంగ్రెస్ తో జట్టుకట్టే రాజకీయాలు కేసీఆర్ కు లోకల్ గా
రాష్ట్రంలో చేటు చేస్తాయి కదా అనేది ఒక సందేహం. అలాంటప్పుడు కేసీఆర్ చిన్న డ్రామా
నడిపించాల్సి వస్తుంది.
తన పాత పార్టీకి
కొత్త పేరును తగిలించిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేసి.. మధ్యంతర ఎన్నికలకు
వెళ్లి నెగ్గాలి. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్
కూడా ఉండే కూటమితో.. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా’ జట్టు
కట్టవచ్చు! అయినా ఇన్ని డొంకతిరుగుడు ప్రయోగాలు ఆయనకు ఫలితమిస్తాయో లేదో
వేచిచూడాలి.
దసరా రోజు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ
సీఎం అఖిలేష్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సహా
ఇప్పటికే కేసీఆర్ తో కలిసి పని చేయటానికి ముందుకొచ్చిన ఇతర పార్టీల ప్రతినిధులు
హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ పేరుతో పాటుగా జెండా - అజెండా ఖరారు
చేసారు. అదే రోజున తన జాతీయ పార్టీ నిర్వహణకు వీలుగా జాతీయ కో ఆర్డినేటర్లను
కేసీఆర్ ప్రకటించనున్నారు. పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, భారతదేశ మ్యాప్ కూడా ఉండేలా రూపొందించారని సమాచారం. సంక్షేమం, సహకార సమాఖ్య ప్రధాన అంశాలుగా తమ అజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు.
తెలంగాణలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు, పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తదితర
పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడంపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.
అందుకే మునుగోడులో అందరికంటే ముందే సబ పెట్టినా, అభ్యర్థి
ని ప్రకటించకుండా ఉన్నదనేది వాస్తవం, ఆయనకు సన్నిహితుహలకు
అదే చెప్పినట్టు వినికిడి అయితే దేశవ్యాప్తంగా రైతులను
ఆకర్షించే తన జాతీయ పార్టీ, అజెండా ఉండాలని భావిస్తున్న
కేసీఆర్.. దీనికి భారత రైతు సమితి పేరును కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారని పలువురు
అంచనా…
ఇన్ని డొంకతిరుగుడు ప్రయోగాలు ఆయనకు ఫలితమిస్తాయో లేదో వేచిచూడాలి
ReplyDeleteపార్టీ పేరు మార్చి.. కొత్తగా చెలామణీలోకి తేవాలనేది ఆయన ఆలోచనగా వినిపిస్తోంది. ఈ సంగతే ఆయన అంటున్నట్టుగా దసరా నాటికి ప్రకటిస్తారనేది సమాచారం.
ReplyDeleteజాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై రోడ్ మ్యాప్ ఖరారు చేస్తున్నారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్.. అదే రోజు ఈ ప్రశ్నలన్నింటికి ఓ సమాధానం కూడా ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దసరా రోజున కీలక ప్రకటన చేయబోతున్న కేసీఆర్.. ఆ తరువాత ఏ రకంగా రాజకీయ అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ReplyDeleteజాతీయ పార్టీ నిర్వహణకు వీలుగా జాతీయ కో ఆర్డినేటర్లను కేసీఆర్ ప్రకటించనున్నారు. పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, భారతదేశ మ్యాప్ కూడా ఉండేలా రూపొందించారని సమాచారం. సంక్షేమం, సహకార సమాఖ్య ప్రధాన అంశాలుగా తమ అజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు.
ReplyDeleteతన పాత పార్టీకి కొత్త పేరును తగిలించిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేసి.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి నెగ్గాలి. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కూడా ఉండే కూటమితో.. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా’ జట్టు కట్టవచ్చు!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteశ్యామలీయం29 September 2022 at 01:52
ReplyDeleteఒకసారి మాటిచ్చి మోసగించిన కేసీఆర్ గారిని కాంగ్రెస్ వారు దరిచేరనీయాలి కదా?.అంతా కేసీఆర్ గారి ఇష్టమేనా? ఇలా మాటతప్పే కేసీఆర్ గారితో జట్టుకట్టేయాలని దేశంలోని పార్టీలన్నీ తహతహలాడుతున్నా యంటే నమ్మశక్యంగా లేదు. ముఖ్యంగా ఈయన చేతికి పెత్తనం ఇవ్వటం అంటే కొరివితో తల గోక్కోవటం అని అందరికీ తెలుసునే. ఈయన పార్టీ కూడా మరొక నామ్ కే వాస్తే బాపతే కావచ్చును.
ఎస్ ఎస్ ఇంకా వాళ్లకు తెలియదు కదా కేసీఆర్ గజకర్ణ గోకర్ణ విద్యలు, ఒకసారి తెలిస్తే దగ్గరికి రారు, రానివ్వరు
DeleteKANI EPPUDUNNA PARITHUTHULALO KOTHA PARTY WORK OUT KADEMO
ReplyDeleteఈ మొత్తం అంశాలపై ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై రోడ్ మ్యాప్ ఖరారు చేస్తున్నారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్.. అదే రోజు ఈ ప్రశ్నలన్నింటికి ఓ సమాధానం కూడా ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి
ReplyDeleteఢిల్లీ స్థాయిలో పరపతి ఉండి.. ఇతర రాష్ట్రాల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేతలకే కేసీఆర్.. బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కూడా.. వారికే పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు.. పక్క రాష్ట్రాల్లోనూ ఎక్స్పోజర్ ఉన్న నేతలకు కేసీఆర్.. జాతీయ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించున్నారని శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది.
ReplyDeleteజాతీయ స్థాయిలో తన మార్కు చూపించేందుకు సిద్ధమైన కేసీఆర్.. దేశ ప్రజల్లోకి జాతీయ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల పెద్దలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రాజకీయ నిపుణులతో సమాలోచనలు జరిపిన గులాబీ బాస్.. చాలా క్లారిటీగా ప్రణాళిక సిద్ధం చేసకున్నారు. అయితే.. ఇంత ప్రతిష్టాత్మకంగా దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్.. జాతీయ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఎవరెవరికి అప్పజెప్పనున్నారనే అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
ReplyDeleteగులాబీ దళపతి కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్సయ్యింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే విజయదశమి రోజే పార్టీపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజులుగా చర్చలు జరుపుతోన్న గులాబీ బాస్.. జాతీయ పార్టీ జెండా, అజెండాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 5 రోజున పార్టీ అధికారిక ప్రకటనతో పాటు పార్టీ కోఆర్డినేటర్లను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం.
ReplyDelete