Wednesday 25 January 2023

 

యువత నిర్మించాల్సింది అవినీతి రహిత నవ్య భారతదేశాన్ని!---కామధేనువు సేవాసమితి   

 





 

భారత్‌లో జనవరి 25వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters’ Day) నిర్వహిస్తారు.

భారత్‌లో జనవరి 25వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల కమిషన్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం 1950లోనే ఏర్పడింది. కానీ 2011 నుంచే ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఎన్నికల సంఘంలోని సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ సంవత్సరం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేలా చూడాలనేది నేషనల్ ఓటర్స్ డే లక్ష్యం. ఇందుకు ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారిపేరుతో ఓటు నమోదు చేయాలి. జనవరి 25న కొత్త ఓటర్లకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డును అందజేస్తారు. ఏ ఒక్క ఓటరునూ విడిచిపెట్టకూడదనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. యువత, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనిపై అవగాహన పెంచేందుకు  యూత్ ఫర్ అంటి కరప్షన్ సభ్యులు నగరంలోని వివిధ స్కూల్స్, కళాశాలకు తిరిగి ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో దేవేందర్ కొన్నే, బత్తిని రాజేష్, సత్తార్ మరియు ఇతర సభ్యలు పాలుగోన్నారు

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...