5
రోజులుగా నల్ల నీళ్లు రావటంలేదు--- యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
ఈరోజు జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి లో
గల ఇల్లంతకుంట క్రాస్ రోడ్ వద్ద గత 5 రోజులుగా నల్ల నీళ్లు
రాక కాలి బిందెలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.
జమ్మికుంట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో గల
కొత్తపల్లిలోని ఐదు వార్డులలో మంచినీటి సమస్యతో గత ఐదు రోజులుగా నల్ల నీళ్లు
రాకపోవడంతో మహిళలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖాళి బిందెలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాళీ
బిందెలతో మహిళలు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా కొత్తపల్లి ప్రాంతంలో నిత్యావసర నల్ల
నీరు రాక అనేక అవస్థలు పడుతున్న పట్టించుకునే నాధుడు లేడని మహిళలు ఆగ్రహం వ్యక్తం
చేశారు, పోలీసులు జోక్యం చేసుకొని అందర్నీ
ఇండ్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం
ఉపాధ్యక్షులు సజ్జాద్ మొహమ్మద్ , కాంగ్రెస్ సీనియర్
నాయకులు సతీష్ రెడ్డి , రంజిత్ రెడ్డి , బాధిత మహిళలు బోగా లలిత , రమా, రాజేశ్వరి , రబ్బాన , సుందరమ్మ , శ్రీమతి , సరూప,
షబానా, కళ్యాణి , రాణి,
తార , బబ్బి , సల్మాన్ , అరుణ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment