కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి
కళ్యాణం
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల
పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా మంత్రి దంపతులకు
ఆలయ పండితులు
పూర్ణ కుంభంతో
స్వాగతం పలికారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని
తిలకించేందుకు వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో భక్తులు
ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు
చేయడం జరిగింది. అమ్మవారి కళ్యాణం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,
మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే
శ్రీలత రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,
కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment