Wednesday, 28 December 2022

   

మొదటి వితంతు వివాహం  జరిగింది ఎక్కడో కాదు కందుకూరి వీరేశలింగం గారి ఇల్లే!



ప్రస్తుత రోజుల్లో వితంతు వివాహాలు అంటే సర్వసాధనంగా మారిపోవడం జరిగింది.కానీ ఒకప్పటి రోజుల్లో వితంతువు అంటే ఏదో దరిద్రాన్ని చూసినట్లు చూసేవారు

డిసెంబర్ 11. 1881 లో సుప్రసిద్ధ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా వితంతు వివాహం జరిపారు.అయితే దాన్ని జరిపించడం కోసం ఆయన పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు చాలానే ఉన్నాయి.

అయినప్పటికీ వంటి చేత్తో ఆ పెళ్లి జరిపించి మూఢాచారాలను తెలుగు వారిలో దూరం చేయడానికి మొదటి అడుగున వేశారు.బెంగాల్లో వితంతు వివాహం జరిగిన దక్షిణాదిలో మాత్రం చందాసం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆ రోజులలో చిన్న వయసులోనే ముసలి వాళ్లకి భార్యలుగా వెళ్లిన వాళ్లు చనిపోయాక వితంతులుగా ఆడపిల్లలు నరకం చూస్తున్నారు.అప్పుడు ఈ సాంఘిక దురాచారానికి అడ్డుకట్ట వేయాలని కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలోని తన స్వగృహంలో 1881 డిసెంబర్ 11వ తేదీన బాల వితంతువు గౌరమ్మ, గూగులమూడి శ్రీరాములు అనే వ్యక్తికి పెళ్లి జరిపించారు.

ఈ వివాహం గురించి విని వారిపై ఎక్కడ దాడి చేస్తారో అని మండపానికి పెళ్లికూతురుని, పెళ్లి కొడుకుని రహస్యంగా తీసుకొచ్చారని కందుకూరి వీరేశలింగం గారు రచనలలో పేర్కొన్నారు.

అంతే కాకుండా ఆ వివాహానికి ఎవరూ వెళ్ళరాదని వెళితే వారిని ఊరి నుంచి వెలివెస్తమని చెందాసులు పిలుపు ఇవ్వడంతో వీరేశలింగం దంపతులే గోదావరి నుండి నీటిని మోసారు.వంట కూడా ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చేయగా కందుకూరి వీరేశలింగం శిష్యులు, విద్యార్థుల్లో కొంతమంది వారికి అండగా నిలిచారు.ఈ చరిత్రత్మక ఘటన జరిగిన కందుకూరి ఇల్లు ఈ రోజు రాజమండ్రిలో ఒక సందర్శన స్థలంగా మారిపోయి ఉంది.

అక్కడికి సందర్శకులు వచ్చి మొదటి వితంతు వివాహం జరిగిన ప్రదేశాన్ని చూసి వెళుతుంటారు.తన జీవితకాలంలో దాదాపు 40 వితంతు వివాహాలు జరిపించారు మన కందుకూరి వీరేశలింగం గారు.

 

Monday, 26 December 2022

 

 

సుశాంత్ సింగ్ అతడి బాడీపై ఉన్నాయి. మెడపై కూడా చాలా గాయాలు ఉన్నాయి.డెడ్ బాడీని చూస్తే ఈజీగా చెప్పొచ్చు. ఆత్మహత్య కాదు హత్య!!  పోస్టుమార్టం సిబ్బంది సంచలన కామెంట్స్ !!

 

2020లో సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 14 జూన్ హీరో సుశాంత్ సింగ్ మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది.సుశాంత్ సూసైడ్ చేసుకోవటం దేశవ్యాప్తంగా అందరూ షాక్ కి గురయ్యారు.

దేశ ప్రధాని మోడీ.సుశాంత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవటం ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది.అయితే ఈ సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం తెలిసిందే

ఇదిలా ఉంటే ఇప్పుడు సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు హత్యా అని.పోస్టుమార్టం సిబ్బంది ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే హీరో సుశాంత్ సింగ్ డెడ్ బాడీకి కూపర్ హాస్పిటల్ లో పోస్టుమార్టం జరిగింది.అయితే ఈ హాస్పిటల్ లో పోస్టుమార్టం సిబ్బందిలో ఒకరు రూప కుమార్ సుశాంత్ బాడీకి పోస్టుమార్టం చేయడం జరిగింది.అయితే రూప కుమార్ సుశాంత్ ది.ఆత్మహత్య కాదు.హత్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అతని డెడ్ బాడీ చూసినప్పుడు ఒంటిపై ఇంకా మెడ పైన గాయాలు ఉన్నాయి.ఇదే విషయాన్ని పై అధికారులకు తెలియజేయడం జరిగింది.అయితే మా పై అధికారులు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియోలు వద్దు.

ఫోటోలు తీస్తే సరిపోతుంది.ఉదయం కల్లా పోస్టుమార్టం పూర్తి కావాలి.

పోలీసులకి డెడ్ బాడీ అప్పగించాలి.అని ఒత్తిడి తేవడం జరిగింది

ఆ రకంగానే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.కచ్చితంగా సుశాంత్ మరణం.

హత్య అని రూప కుమార్ స్పష్టం చేశారు.అతడి బాడీపై చాలా గాయాలు ఉన్నాయి.

మెడ మీద కూడా ఉన్నాయి.డెడ్ బాడీని చూస్తే ఈజీగా చెప్పొచ్చు.

ఇది దాడి వలన జరిగిందని.అని రూప కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 

Thursday, 22 December 2022

 

పెళ్లి చేసుకుందామంటే మాకు పిల్ల దొరకడం లేదు మహారాష్ట్రలో వినూత్న నిరసన.

 



వాళ్లందరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతో ఇంతో కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకోవాడానికి పిల్ల దొరక్కపోవడంతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు. పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, వధువుల కోసం వెతికి వెతికి విసిగిపోయారు. ఒక పక్క వయుస్సు అయిపోతున్నా..వివాహం కాకపోవడంతో మానక్షిక క్షోభకు గురవుతున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదేంటి అని బాధపడే అబ్బాయిల సంఖ్య రోజురోజుకి ఎక్కవయిపోయింది. దీంతో తమకు పెళ్లి కావడం లేదని యువకులందరూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 గుర్రాలపై వచ్చి నిరసన

తమకు పెళ్ళీడు వచ్చినా.. పెళ్లికావడం లేదంటూ చాలామంది యువకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు పెళ్లికాకపోవడాన్ని ప్రభుత్వానిదే తప్పు అని ఎత్తి చూపుతూ గుర్రాలపై కలెక్టరేట్ కార్యాలయంకు ఊరేగింపుగా వచ్చి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో పెళ్లికొడుకు వేషాధారణలో గుర్రాలపై వచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయించారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడంతో లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోందని ఆరోపించారు. ఈ కారణంతోనే తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని విమర్శించారు. ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది


 ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు 

న్యూ మిలీనియం హైస్కూల్, జమ్మికుంట 







భారతదేశం గర్వించే దగ్గ శాస్త్రవేత్త గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ అని న్యూ మిలీనియం స్కూల్స్ చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని న్యూ మిలీనియం హైస్కూల్లో గణిత దినోత్సవ వేడుకలను పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి ప్రారంభించారు, అనంతరం విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు పజిల్స్ ప్రముఖ శాస్త్రవేత్తలు సాధించిన విషయాలను చార్టుల ద్వారా ఉపాధ్యాయులకు సాటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్  తో అతిపెద్ద గుణకారం,కూడికలు, తీసివేతలు, రూట్స్, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అతి తక్కువ సమయంలో సులువుగా విద్యార్థులు చెప్పడం జరిగిందని వారు అన్నారు, అనంతరం పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం న్యూ మిలీనియం స్కూల్స్లో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని విద్యార్థులకు గణిత సబ్జెక్టు పై అవగాహన కల్పిస్తూ ఆ సబ్జెక్టు పై భయం అనేది లేకుండా లెక్కలను సులువైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే దానిపై వారికి చక్కటి అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన నివాళులర్పించామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ విశ్వనాథరెడ్డి వరుణ్ రెడ్డి ఇన్చార్జి తిరుపతిరెడ్డి గణిత అధ్యాపకులు శంకర్ కిరణ్ రమేష్ నవీన్ సారయ్య రాజు రాధిక పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Wednesday, 21 December 2022

తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్స్..





తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వ డాక్టర్లుగా నియమితులై వైద్యం చేస్తున్నారు.

డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రూథ్‌ జాన్‌లు ఉస్మానియా ఆసుపత్రిలోని ఏఆర్టీ క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రాచీ, ఖమ్మం జిల్లాకు చెందిన రూథ్‌లు 29, 28 ఏళ్ల వయసున్న యువ డాక్టర్లు.

కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేశారు కానీ, వారు స్థిరంగా ఒక చోట ఉండి వైద్యం చేయడానికి, ఎండీ, ఎంఎస్ చదవడానికి వారి జెండర్ పెద్ద అడ్డంకి అయింది.

ఆ సందర్భంలో ఉస్మానియాలో మెడికల్ ఆఫీసర్లుగా చేరి, ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించారు ఈ యువ ట్రాన్స్‌జెండర్లు

‘‘నాకు ఐదేళ్ల వయసునప్పటి నుంచే నా శరీరం భిన్నంగా ఉందన్న అవగాహన నాకు కలిగింది. కానీ స్కూలు వయసులో నాకు అంత అవగాహన లేదు. వయసు పెరిగే కొద్దీ అవగాహన పెంచుకుంటూ వచ్చాను. తరువాత ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రపంచానికి చెప్పేశాను. నేను ఒక ట్రాన్స్ మహిళను అని’’ అన్నారు ప్రాచీ.

‘‘ఎంబీబీఎస్ మొదట్లోనే ఫ్రెషర్స్ పార్టీకే నేను చీర కట్టుకుని వెళ్లాను. అక్కడే ప్రకటించాను. ఎవరు నాతో మాట్లాడనీ, మాట్లాడకపోనీ, నేను నా ఐడెంటిటీని అక్కడ ప్రకటించాను’’అని ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివిన ప్రాచీ, తాను మొదటిసారి ట్రాన్స్ జెండర్ అని ప్రకటించుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘నాకు ఏడేళ్ల అప్పటి నుంచే నేను భిన్నంగా ఉన్నానని గుర్తించాను. అబ్బాయిలతో కలవలేక పోయేదాన్ని. అమ్మాయిలతో కలిసేదాన్ని. అమ్మాయిలతో ఉండటానికి ఇష్టపడేదాన్ని. ఆడపిల్లల బట్టలు వేసుకోవడం లాంటివి ఇష్టం ఉండేది. కానీ ట్రాన్స్‌జెండర్లపై సమాజంలో ఉన్న వివక్షను చూశాక, ముందుగా నా చదువులపై శ్రద్ధ పెట్టాలి అని నిర్ణయించుకున్నాను. బాగా చదవాలని నిర్ణయించుకున్నాను. ఇక 2017 ఎంబీబీఎస్ తరువాత నేను ట్రాన్స్ వ్యక్తిని అని కుటుంబ సభ్యులతో చెప్పాను. అప్పటి నుంచే అందరికీ చెబుతూ వస్తున్నాను’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నారు రూథ్.

అన్నీ తెలిసిన డాక్టర్ల నుంచే వివక్ష

సాధరణంగా మనిషి శారీరక, మానసిక భిన్నత్వంపై డాక్టర్లకు ఎక్కవ అవగాహన ఉంటుందనేది సగటు భావన. కానీ తమకు మెడికల్ కమ్యూనిటీ నుంచి తీవ్రమైన వివక్ష ఎదురైందంటారు ఈ ట్రాన్స్ జెండర్ డాక్టర్లు.

‘‘అసలు ప్రైవేటు వైద్యుల్లో జెండర్ సెన్సిటివిటీ చాలా తక్కువ. లేదని కూడా చెప్పొచ్చు. వారికి ఎల్జీబీటీక్యూ ప్లస్ అంటే తెలియదు. నేను వైద్యుల నుంచి కూడా చాలా వివక్ష ఎదుర్కొన్నాను. ట్రాన్స్‌జెండర్ అవడం వల్లే ఉద్యోగం కోల్పోయాను’’ అన్నారు ప్రాచీ.

‘‘డాక్టర్లలో కూడా వివక్ష ఉంటుంది. నా సర్టిఫికేట్లు పట్టుకుని ఎన్నో ఆసుపత్రులకు ఉద్యోగం కోసం వెళ్లాను. వాళ్లెవరూ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఫోన్ చేస్తామంటారు. ఫోన్ రాదు. దీంతో ఇక బతకడం ఎలా అని భయపడ్డాను. ఎన్నోసార్లు ఏడ్చాను. ఒక దశలో ఆత్మహత్య చేసుకుదాం అని కూడా అనుకున్నాను. ఒకే ఆసుపత్రికి ఉద్యోగం కోసం మూడుసార్లు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అంటూ గుర్తు చేసుకున్నారు రూథ్.

వీరిద్దరూ గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్ వ్యక్తుల కోసం నడిపే క్లినిక్‌లో సేవలు అందించారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో, ఉస్మానియా ఆసుపత్రి క్యాంపస్‌లో వైరల్ వ్యాధుల క్లినిక్ ఉంది. అందులో మెడికల్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేశారు. వారిని ఇంటర్వ్యూ చేసి మెడికల్ ఆఫీసర్లుగా నియమించారు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్. దీంతో నవంబర్ 24 నుంచి వారు ఇక్కడ వైద్యం చేస్తున్నారు.

పేషెంట్లు ఎలా స్పందిస్తారు?

డాక్టర్లుగా రోగులను చూసేప్పుడు భిన్నమైన అనుభవాలు ఎదుర్కొన్నారు ఈ వైద్యులు. అయితే తమ చికిత్స చూసిన తరువాత రోగుల అభిప్రాయమే మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు.

‘‘నేను కొంత కాలం సొంతంగా క్లినిక్ నడిపాను. అక్కడ మొదట్లో రావడానికి సంకోచించేవారు. తరువాత నా వైద్యం చూశాక రావడం మొదలైంది’’అని రూథ్ చెప్పారు.

‘‘ఇక్కడ పేషెంట్ల నుంచి ఆశ్చర్యకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. చికిత్స అంతా పూర్తయిన తరువాత, చాలా బావుంది. మీరు మాకు చాలా మంచి వైద్యం చేశారు. మీ నుంచి చికిత్స తీసుకోవడం సంతోషం అంటారు పేషెంట్లు’’అని ఆమె వివరించారు.

‘‘కొందరైతే మిమ్మల్ని దేవుళ్లలా చూస్తాం. అలాంటిది మీ చేతి వైద్యం చేయడం ఇంకా మంచిది.’’ అంటూ చెబుతుంటారు అన్నారు రూథ్.

మొదట్లో సందేహంగా వచ్చే పేషెంట్లు, తరువాత తమతో మాట్లాడి, తాము వైద్యం చేసే విధానం చూసి అభినందిస్తారని చెప్పుకొచ్చారు వీరు.

‘‘నేను చాలా కాలం ప్రైవేటు ఆసుపత్రిలోని ఎమెర్జెన్సీ వార్డులో డ్యూటీ చేశాను. మొదట్లో నన్ను చూసి నా దగ్గరకు రావడానికి సంకోచించిన పేషెంట్లు, నేను చేసిన వైద్యం చూసి ఎంతో సంతోషించేవారు. నేను చేసే చికిత్సతో వారు సంతృప్తి చెందేవారు. కొందరు మొదట్లో ఇబ్బంది పడినా, ఎమెర్జెన్సీ కాబట్టి తప్పక నా దగ్గరకు వచ్చి తరువాత వారి ఆలోచన మార్చుకున్నారు’’ అంటూ చెప్పారు ప్రాచీ.

‘‘ఇప్పటికీ చాలా మంది మమ్మల్ని అభినందిస్తుంటారు. మీరు మాకు స్ఫూర్తి అని చెబుతుంటారు’’అని అన్నారు ప్రాచీ.

గతంలో వైద్యులు, నర్సుల నుంచి కూడా వివక్ష, ఎగతాళి భరించిన వీరు ఉస్మానియాలో మాత్రాం పరిస్థితి భిన్నంగా ఉందనే చెబుతున్నారు. తమకు ఇక్కడ గౌరవం దక్కుతోందన్నారు.

ఇల్లు.. కాలేజీ.. ఆసుపత్రి.. అన్ని చోట్లా అదే అనుభవం..

రూథ్, ప్రాచీలు ముందు నుంచీ చదువుపై శ్రద్ధ పెట్టారు. అయినప్పటికీ వారి నైపుణ్యం, తెలివితేటల కంటే వారి శరీరమే ఎక్కువ డిస్కషన్ సబ్జెక్ట్ అయ్యేది. మూడు పదులు దాటక ముందే వారు జీవితంలో ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.

వివక్ష చూసి ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా అని అడిగితే, ‘‘బోలెడన్ని సార్లు..’’ ‘‘అసలు ట్రాన్స్‌జెండర్ జీవితమంటేనే కన్నీళ్లమయం అండీ..’’ అంటూ సమాధానం ఇచ్చారు ప్రాచీ.

‘‘నేను చదువుకునే సమయచంలో అసలు థర్డ్ జెండర్ కాలమే లేదు. వివక్ష ఎక్కువ ఉండేది. స్కూల్లో, కాలేజీలో బాగా ఆటపట్టించేవారు. అందుకే ఇక ఎంబీబీఎస్‌లో చేరాక చాలా ఒంటరిగా (ఐసోలేటెడ్)గా ఉండేదాన్ని. ఎవరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. ఎంబీబీఎస్ మొత్తం అలానేసాగింది’’ అంటూ చెప్పారు రూథ్.

’’2017లో నేను నా ఐడెంటిటీ చెప్పిన తరువాత చాలా మంది అంగీకరించారు.. నాతో బావున్నారు. కొందరు అంగీకరించలేదు. నాతో మాట్లడడం మానేశారు’’ అన్నారు రూథ్.

‘‘స్కూల్, కాలేజీల్లో తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నాను. నా వెనుక నవ్వేవారు. చాలా కష్టంగా ఉండేది’’అని అన్నారు ప్రాచీ.

ఇప్పటికీ ఆమె కుటుంబం ప్రాచీతో మాట్లాడడం లేదు. ‘‘నాకు వారిపై కోపం లేదు. వారి పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా!’’అని అన్నారామె.

‘‘ట్రాన్స్‌జెండర్లు ఐడెంటిటీ రివీల్ చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఒక సమస్య. ఎవరికీ చెప్పకపోతే నీ వెనుక నవ్వుతారు. వెకిలి చేస్తారు. రకరకాలుగా మాట్లాడతారు. నేను ట్రాన్స్‌జెండర్ అని చెప్పాక, ఏకంగా ఉద్యోగం కోల్పోయాను. ప్రైవేటు ఆసుపత్రి వారు నన్ను ఉద్యోగం లో నుంచి తీసేశారు’’అని అన్నారు ప్రాచీ.

‘‘చాలా మంది ట్రాన్స్ వ్యక్తులు భిక్షాటన చేస్తూ, డాన్సులు చేస్తూ, బతుకుతున్నారు. వారిని తప్పు పట్టను. సమాజం అలా ఉంది ఇప్పుడు. ఒకవేళ చదువుకోకపోయుంటే నేనూ అలానే చేసేదాన్నేమో.. ట్రాన్స్ వ్యక్తులంటే ఉన్న ఆ అభిప్రాయం తొలగించాలి. నేను డాక్టర్‌ని అని చెప్పినా నాకు ఇల్లు దొరకడం కష్టం అయింది. సరైన ఇల్లు దొరకడానికి ఏడాది పట్టింది. కానీ ఒకసారి ఇంట్లో చేరాక, అక్కడ సొసైటీ వారు నా ప్రవర్తన చూసి నన్నెంతో గౌరవిస్తారు. ఎంతో ఆదరంగా చూస్తారు’’అని అన్నారు ప్రాచీ.

పీజీ కష్టాలు..  

ఇప్పుడు డాక్టర్లు చాలా మంది ఎంబీబీఎస్‌తో సరిపెట్టకుండా పీజీ చేయాలనుకుంటున్నారు.

కానీ పీజీ విషయంలో కూడా వీరికి సమస్య ఎదురైంది.

నీట్ పరీక్షలో థర్డ్ జెండర్ కాలమ్ ఉన్నప్పటికీ, తెలంగాణ కౌన్సెలింగ్‌లో ఆ కాలమ్ లేదు.

‘‘పీజీలో గైనిక్ చదవాలనుకున్నాను. నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ థర్డ్ జెండర్ కింద కౌన్సెలింగ్ చేయబోమన్నారు. నా ఐడెంటిటనీ దాచుకుని నేను అడ్మిషన్ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే దానిపై పోరాడుతున్నాం’’అని చెప్పారు రూథ్.

ఫ్రెషర్స్ పార్టీకే నేను చీర కట్టుకుని వెళ్లాను. అక్కడే ప్రకటించాను. ఎవరు నాతో మాట్లాడనీ, మాట్లాడకపోనీ, నేను నా ఐడెంటిటీని బయటకు చెప్పాలని అనుకున్నాను’’అని తాను మొదటిసారి ట్రాన్స్‌జెండర్ అని ప్రకటించుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ప్రాచీ.

.

  

Monday, 19 December 2022

 బీఆర్ఎస్ నుంచి వ‌ల‌స‌లు !?

 

తెలంగాణలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అస‌మ్మ‌తి గ‌ళాలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ కావ‌డం, మంత్రి మ‌ల్లారెడ్డిపై అసంతృప్తి వ్య‌ క్తం చేయ‌డం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ ల‌కు దారి తీస్తున్నాయి. ప‌రోక్షంగా బీజేపీకి సంకేతాలు ఇస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ స్తుతం తెలంగాణ‌లో బీఆర్ఎస్ వ‌ర్రెస్ బీజేపీగా రాజ‌కీయం సాగుతోంది. కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌ త కుమ్ములాట‌లు ఆ పార్టీని రోజురోజుకూ మ‌రింత దిగ‌జారుస్తున్నాయి.

దీంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లో అస‌మ్మతి, అసంతృప్తి నేత‌ల‌పై బీజేపీ డేగ క‌న్ను వేసింది. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా... వారిని త‌న్నుకుపోవ‌డానికి బీజేపీ కాచుకుని వుంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే మైనంప‌ల్లి నివాసంలో కుత్బూల్లాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, ఉప్ప‌ల్ ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్‌, మాధ‌వ‌రం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్‌రెడ్డి భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌ డిన వారే కావ‌డంతో, బీఆర్ఎస్‌లో నిబ‌ద్ధ‌ త‌తో వుంటార‌నుకోవ‌డం భ్ర‌మే. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం లేక‌పోతే... బీఆర్ఎస్‌లో ఒక్క నిమిషం కూడా ఉండ‌ర‌నే ప్ర‌ చారం జ‌రుగుతోంది. ఇవాళ్టి స‌మావేశంలో మంత్రి మ‌ల్లారెడ్డి వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌ చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా ప‌ద‌వులు, అభివృద్ధి విష‌యాల్లో మంత్రి మ‌ల్లారెడ్డి ఒంటెత్తు పోక‌డ‌తో వ్య‌ వ‌హ‌రిస్తున్నార‌నేది ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌.

స్థానికంగా త‌మ వాళ్లు ప‌ద‌వులు ఆశిస్తున్నార‌ని, కానీ మ‌ల్లారెడ్డి అన్నీ త‌న నియోజ‌క‌వ‌ర్గానికే తీసుకెళుతున్నార‌నే ఆరోప‌ణ ఆ ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి విన‌వ‌స్తోంది. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి త‌న మ‌నిషికి కావాల‌ని చెప్పినా, మ‌రొక‌రికి ఇచ్చార‌ని ఎమ్మెల్యే వివేక్ ఆగ్రహంగా ఉన్నార‌ని స‌మాచారం. అలాగే త‌న‌కు తెలియ‌కుండా మిగిలిన ఎమ్మెల్యేలకు ప‌నులు చేయ‌వ‌ద్ద‌ ని క‌లెక్ట‌ ర్‌కు మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పిన‌ట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

త‌మ గోడును త్వ‌ ర‌లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌ యించుకున్న‌ ట్టు వారు చెప్పారు. ఇది ర‌హ‌స్య భేటీ కాద‌ని, దీనికి ప్రాధాన్యం లేద‌ని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో తాము అసంతృప్తిగా ఉన్నామ‌నే సందేశాన్ని, సంకేతాల్ని బీజేపీకి పంపిన‌ట్టు  ప్ర‌ చారం జ‌రుగుతోంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వ‌ల‌స‌లు త‌ప్ప‌ వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

 

Friday, 16 December 2022

 కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు

 



కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్యను.. జగిత్యాలకు చెందిన అర్షద్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోయినా తాము ఒకరికొకరం తోడుగా కలిసి జీవించాలని నిర్ణయించుకుని సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. 

జగిత్యాలకు చెందిన అర్షద్..వీణవంకకు చెందిన ట్రాన్స్ జెండర్ దివ్య ప్రేమలో పడ్డాడు. అర్షద్ కోసం దివ్య సర్జరీ చేయించుకున్నారు. తమ పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు సపోర్ట్ చేయకపోయినా.. అర్షద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనతో జీవితాంతం తోడుగా ఉంటానని అర్హద్ చెప్పడంతో తన ప్రేమను కాదనలేకపోయానని దివ్య చెప్పారు. ఇంట్లో సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత దైవ దర్శనం కోసం ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనానికి జంటగా వచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజలు చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...