Tuesday, 20 September 2022

 

రాజ‌కీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయాలు నా నుంచి దూరం కాలేదు

 


మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా సంచ‌ల‌న‌మే. సినిమాల్లో ఆయ‌న విజ‌య‌వంత‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు. కానీ రాజ‌కీయాల్లో మాత్రం ఫెయిల్యూర్ లీడ‌ర్‌గా ప్ర‌స్థానాన్ని ముగించారు. రాజ‌కీయాలు మానుకుని ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల్లో బిజీ అయ్యారు. రాజ‌కీయాల‌కు, వివాదాల‌కు ఆయ‌న చాలా దూరంగా ఉంటారు.

అలాంటి చిరంజీవి తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌కు దూరం కాలేద‌నేది ఆయ‌న మాట‌ల సారాంశం. చిరంజీవి వాయిస్‌తో ఉన్న ప‌ది సెకెండ్ల ఆడియోలో ఏముందంటే...

"నేను రాజ‌కీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయాలు నా నుంచి దూరం కాలేదు" అని చిరంజీవి కామెంట్స్ చేయ‌డం దుమారం రేపుతోంది. రాజ‌కీయాల‌తో అనుబంధం కొన‌సాగుతోంద‌ని ఆయ‌న చెప్ప‌డం వెనుక ఉద్దేశం ఏమై వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇటీవ‌ల కొంత కాలంగా చిరంజీవిని ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ఆ పార్టీ తీసుకురావాల‌ని అనుకుంటున్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిరంజీవి ఆస‌క్తి చూప‌లేద‌ని చెబుతూ వ‌చ్చారు.

తాజాగా రాజ‌కీయాల‌పై కామెంట్స్ చేయాల్సిన అవ‌స‌రం చిరంజీవికి ఎందుకొచ్చింద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అయితే గాడ్ ఫాద‌ర్ సినిమాలో చిరంజీవి డైలాగ్ అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా జ‌న‌సేన పార్టీ పెట్టుకుని క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అలాంట‌ప్పుడు త‌మ్ముడికి పోటీగా మ‌రో పార్టీలో చిరంజీవి ఎందుకు చేరుతార‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. 

ఇలా ఎవ‌రిష్ట‌మొచ్చిన‌ట్టు వారు చిరు కామెంట్స్‌పై విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తాజా చిరంజీవి ట్వీట్ మాత్రం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

 

Monday, 12 September 2022

  

ఎల‌క్ట్రిక‌ల్ బైక్ షోరూమ్ భారీ అగ్నిప్రమాదం!



ప్ర‌మాదం అనేది ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికి తెలియ‌దు. నిన్న రాత్రి 9.30 గంట‌ల ప్రాంతంలో.. సికింద్రాబాద్ లోని ఒక ఎల‌క్ట్రిక‌ల్ బైక్ షోరూమ్ భారీ ఆగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో ఏడుగురు మ‌ర‌ణించ‌డంతో పాటు ప‌లువురు ప‌రిస్ధితి సీరియస్ గా ఉంది. కింద సెల్లార్ లో బైక్ షోరూమ్ పైన లాడ్జి ఉండ‌టంతో షోరూంలో జ‌రిగిన ఆగ్ని ప్ర‌మాదం వ‌ల‌న‌ చేల‌రేగిన మంట‌లు, పొగ లాడ్జిలోకి వ్యాపించ‌డంతో ఊపిరాడ‌క ప్ర‌మాదం జ‌రిగింది.

అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇ-ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో బ్యాటరీ బ్లాస్ట్‌ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందే తెలిసేలోపే బాంబుల్లా పేలాయి బ్యాటరీలు. దట్టమైన పొగ కమ్మేయడంతో లాడ్జ్‌లో ఉన్న దాదాపు పాతికమంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మ‌ర‌ణించిన వారు దాదాపు ఉత్తరాది రాష్ట్రాల‌కు చెందిన వారుగా గుర్తించారు. బ‌తుకు దేరువు కొసం హైద‌రబాద్ కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

లాడ్జిలో ఉన్న చాలామంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీల నుంచి కిందకు దూకారు. మరి కొంత మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

నాలుగు అంతస్థులో లాడ్జి. టూరిస్టులు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఒక్కటే మార్గం. పక్కనే ఇరుకుగా మెట్లమార్గం ఉన్నా.. లాడ్జికి వచ్చిన టూరిస్టులకు దాని గురించి తెలియదట. అదే పలువురి ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణమైందంటూన్నారు స్ధానికులు.

 

Wednesday, 7 September 2022

 

కింగ్స్‌వే. రాజ్పథ్. కర్తవ్యపథ్



 

రాజ్‌పథ్... స్వతంత్ర భారతదేశంలో అనేక తరాలు ఈ పేరు వింటూ పెరిగాయి. దిల్లీలోని రాజ్‌పథ్ అనగానే భారత గణతంత్రదినోత్సవ సంబరాలు గుర్తుకొస్తాయి.

 

ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతాలైన రాజ్పథ్, సెంట్రల్ విస్టా ప్రాంతాల రహదారికి కర్తవ్యపథ్గా పేరు పెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. బానిసత్వ, బ్రిటీష్ పాలనను గుర్తుకు తెచ్చే ఈ పేర్లను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఈ రోడ్ల పేర్లను మార్చనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ బుధవారం ప్రత్యేక సమావేశంలో తీర్మానించింది. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న రోడ్డును ఇకపై కర్తవ్యపథ్గా మార్చనున్నారు

రాజ్‌పథ్‌లో కూర్చొని రిపబ్లిక్ డే పరేడ్‌ను, సైనిక విన్యాసాలను చూడటం ఒక మరపురాని అనుభూతి. ఇప్పుడు దీని పేరు మార్చాలనే చర్చ నడుస్తోంది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడువున్న రాజ్‌పథ్‌ లుక్‌ను మార్చారు. దీనికి ఇప్పుడు 'కర్తవ్యపథ్' అనే పేరు పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

'న్యూదిల్లీ' నిర్మాణం పూర్తి అయినప్పుడు వైశ్రాయ్ హౌస్(నేటి రాష్ట్రపతి భవన్) నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మార్గానికి 'కింగ్స్‌వే' అని పేరు పెట్టారు. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ప్రొఫెసర్ పెర్సివల్ స్పియర్ ఈ పేరు ఇచ్చారు. 1924-40 వరకు ఆయన ఆ కాలేజీలో చరిత్రను బోధించారు.

న్యూదిల్లీలోని చాలా రోడ్లకు పెర్సివల్ సలహా మేరకే నాటి బ్రిటిష్ ప్రభుత్వం పేర్లు పెట్టింది. అక్బర్ రోడ్, పృథ్వీరాజ్ రోడ్, షాజహాన్ రోడ్ వంటివి అందులో కొన్ని. ఆయన టీచర్ మాత్రమే కాదు పరిశోధకుడు కూడా. భారతదేశ చరిత్ర మీద కూడా ఆయన పుస్తకాలు రాశారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన దగ్గరగా గమనించారు. కానీ ఆ పోరాటాన్ని ఆయన వ్యతిరేకించలేదు. దానికి మద్దతు కూడా తెలుపలేదు. ఒక సాక్షిగా మాత్రమే ఉన్నారు.

సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పెర్సివల్ స్పియర్ చేరారు. భారతదేశం నుంచి వెళ్లిపోయిన తరువాత ఆయన అనేక పుస్తకాలు రాశారు.

ఇండియా, పాకిస్తాన్ అండ్ ది వెస్ట్(1949), ట్విలైట్ ఆఫ్ ది మొఘల్స్(1951), ది హిస్టరీ ఆఫ్ ఇండియా(1966) వంటి పుస్తకాలు అందులో ముఖ్యమైనవి.

స్వాతంత్ర్యం తరువాత 'రాజ్‌పథ్'

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1961లో ఆ పేరును 'రాజ్‌పథ్'గా మార్చారని న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) మాజీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ మదన్ థపలియాల్ తెలిపారు.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?

రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు ఉండే మార్గాన్ని 'రాజ్‌పథ్' అంటారు. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరిగేది ఇక్కడే.

న్యూదిల్లీ నిర్మాణం గురించి మాట్లాడుకునేటప్పుడు సిటీని డిజైన్ చేసిన వారి గురించే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాజ్‌పథ్‌తో పాటు దిల్లీలోని అనేక విశాలమైన రహదారులను నిర్మించిన ఆ వ్యక్తి మాత్రం ఎవరికీ గుర్తు ఉండరు. ఆయనే సర్దార్ నారాయణ్ సింగ్.

న్యూదిల్లీ నగరాన్ని నిర్మించేటప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. విశాలమైన రోడ్లు వేశారు. అందమైన పార్కులు నిర్మించారు. ఈ పనులు చేయడానికి 1920లలో దేశవ్యాప్తంగా ఉన్న పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం పనులు అప్పగించింది. అలా దిల్లీలో రోడ్లు వేసే కాంట్రాక్ట్ సర్దార్ నారాయణ్ సింగ్‌కు వచ్చింది.

న్యూదిల్లీ చీఫ్ డిజైనర్ ఎడ్విన్ ల్యుటెన్సీ, ఆయన పార్టనర్ హెర్బర్ట్ బేకర్‌లు నేడు రాజ్‌పథ్‌గా పిలుస్తున్న మార్గాన్ని నిర్మించే బాధ్యతను కూడా నారాయణ్ సింగ్‌కు అప్పగించారు.

ఆయన న్యూదిల్లీలో అద్భుతమైన రోడ్లు నిర్మించారు. ముందుగా పెద్దపెద్ద రాళ్లను కింద వేసేవారు. వాటి మీద ఇసుక, తారు వేసి రోడ్లు నిర్మించేవారు. సుమారు 20 ఏళ్లపాటు రోడ్లు చెక్కుచెదరకుండా ఉండాలన్నది నారాయణ్ సింగ్ ఆలోచన.

నేడు రాజ్‌పథ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కంకర, తారుతో రోడ్లు సులభంగా వేస్తున్నారు. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నుతాయి.

రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా గుర్రాలు, ఒంటెల నుంచి భారీ యుద్ధట్యాంకుల వరకు రాజ్‌పథ్ మీద కనిపిస్తాయి. రాజ్‌పథ్ మొదలయ్యే దగ్గర ఒకవైపు సౌత్ బ్లాక్ మరొకవైపు నార్త్ బ్లాక్ ఉంటాయి.

జంతర్ మంతర్ అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి తరచూ జరిగే ధర్నాలు. రెండు 1724లో మహారాజ జై సింగ్-2 నిర్మించిన ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ. దీనికి ఎదురుగా ఉండే వీధికి రెండు వైపులా ఉండే విశాలమైన బంగ్లాలను అయిదుగురు భారతీయ కాంట్రాక్టర్లు నిర్మించారు.

వారే ధరమ్ సింగ్ సేథీ, శోభా సింగ్, విశాఖ సింగ్, నారాయణ్ సింగ్. సర్దార్ నారాయణ్ సింగ్ కుటుంబం నేటికీ దిల్లీలోనే నివసిస్తోంది. తన కోసం ధరమ్ సింగ్ కట్టుకున్న ఇల్లు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైంది. ఆ తరువాత 1970లలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అక్బర్ రోడ్‌కు మారింది.

వైశ్రాయ్ హౌస్‌తోపాటు నార్త్, సౌత్ బ్లాకులకు నిరంతరం రాళ్లు తరలించే కాంట్రాక్టును ధరమ్ సింగ్ దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని ధౌల్‌పుర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా నుంచి రాళ్లను తరలించే వారు.

ధరమ్ సింగ్‌తో కలిసి ఒకే ప్లాటులో ఒక బంగ్లా కట్టారు శోభా సింగ్. ఆ తరువాత అక్కడ కేరళ హౌస్ కట్టారు.

ఎన్నో ఏళ్లుగా దిల్లీ వాసులు రాజ్‌పథ్‌కు రెండు వైపులా ఉండే పచ్చని గడ్డి మైదానాల మీద కూర్చొని చలి కాలంలో సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, రైల్ భవన్‌లో పని చేసే వారు పేకాట ఆడుకుంటూనో లేక మధ్యాహ్నం భోజనం చేస్తూనో అక్కడ సేదతీరుతుంటారని చెబుతుంటారు.

కానీ ఇప్పుడు రాజ్‌పథ్‌లోని అనేక చెట్లను నరికివేశారు. వాటి వయసు సుమారు 90 ఏళ్లు. ఇక్కడి నేరుడు చెట్ల కాయలు తింటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాడు రాజ్‌పథ్ నిర్మిస్తున్నప్పుడు చెట్లను కూడా నాటారు. నాడు చెట్లను నాటించిన ఎడ్విన్ ల్యుటెన్సీ ఉద్యాన విభాగం సలహాదారు డబ్ల్యూఆర్ మస్టో, శీతకాలంలో ఆకురాల్చే చెట్లను నాటించలేదు. ఆ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు.

ఇక్కడి పార్కులను రాజస్థాన్ నుంచి వచ్చిన తోటమాలులు అందంగా తీర్చిదిద్దుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజాంఘర్, ఫైజాబాద్ నుంచి కూడా తోటమాలులు దిల్లీకి వస్తున్నారు. వీరంతా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. వీరంతా రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్ లేదా దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరిలో రెండు మూడు తరాలుగా ఈ పని చేస్తున్న వారు కూడా ఉన్నారు.

 

Monday, 5 September 2022

 

తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్‌ను పెంచుతున్న కేసీఆర్!!?



వినటానికి విడ్డురంగా ఉన్న ఇది నిజమే అనిపిస్తుంది, ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాటలు జాగర్తగా గమనించినట్టయితే..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీజేపీ ట్రాప్‌లో ప‌డి ఏదేదో మాట్లాడుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీతో యుద్ధం అంటూ అన‌వ‌స‌ర బాధ్య‌త‌ను త‌న‌కు తానుగా నెత్తికెత్తుకున్నార‌నే భావ‌న చాలా మందిలో వుంది. తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్‌ను కేసీఆరే పెంచుతున్నార‌నే వాద‌న‌లో నిజం ఉంద‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి, అందుకు త‌గ్గ మూల్యాన్ని కేసీఆర్ చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

జాతీయ రాజ‌కీయాలంటూ కేసీఆర్ గ‌త కొన్ని నెల‌లుగా కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. తెలంగాణ‌లో బీజేపీ దూకుడును అడ్డుకోవ‌డ‌మే పెద్ద స‌వాల్‌గా మారిన త‌రుణంలో, జాతీయ‌స్థాయిలో ఆ పార్టీని ఎదుర్కోవ‌డంపై సాధ్యాసాధ్యాల‌ను కేసీఆర్ ఆలోచించ‌క‌పోవ‌డం వ‌డ్డూరంగా ఉంది. నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట‌లు వింటే... ఈయ‌న‌కు ఏమైంది? అనే అనుమానం క‌లుగుతుంది.

ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే రానుంది. కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాంఅని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకే మోదీ ప్రాధాన్యమిస్తున్నారుఅని కేసీఆర్ మండిపడ్డారు. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నే కోరిక‌ను ఎవరూ కాద‌న‌లేరు. అయితే అందుకు త‌గ్గ రాజ‌కీయ ప‌రిస్థితులు త‌న‌కు ఎంత వ‌ర‌కు అనుకూలంగా ఉన్నాయో కేసీఆర్ ఆలోచించారా? తెలుగు రాష్ట్రాల్లోనే కేసీఆర్‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు కేసీఆర్ ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తుంటార‌నే పేరు ఆయ‌న‌కు ఉంది.

బీజేపీ ముక్త్‌ భారత్‌ సాధన సంగ‌తేమో గానీ, టీఆర్ఎస్ ముక్త తెలంగాణ అంటూ వ‌స్తున్న మోదీ, అమిత్‌షాల‌ను ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్ ఆలోచిస్తే మంచిది. మ‌రోసారి తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించేలా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. అంత‌కంటే ముందు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బీజేపీ పెద్ద స‌వాలే విసిరింది. 

ఒక్క మునుగోడులో గెలుపొందేందుకే రెండు ఊళ్ల‌కు క‌లిపి ఒక ఎమ్మెల్యేను నియ‌మించిన ప‌రిస్థితి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇది సాధ్య‌మా? జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తాన‌ని ప‌దేప‌దే కేసీఆర్ చెప్ప‌డం వెనుక వ్యూహం ఏంటో గానీ, అది వ‌ర్కౌట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మా, స్వ‌ర్గానికి ఎగురుతా అన్న‌ట్టుగా కేసీఆర్ రాజ‌కీయ పంథా ఉంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. కేసీఆర్ భ‌విష్య‌త్ ఆయ‌న చేత‌ల్లోనే ఉంది. 

 

 

జనాలు రేషన్ కొన్నట్లే బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు!



జార్ఖండ్‌ అసెంబ్లీలో ఇవాళ అధికార యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్‌ సోరెన్‌ నెగ్గారు. గనుల లీజును తనకు తానే కేటాయించుకుని సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. దీంతో సోరెన్పై ఎమ్మేల్యేగా అనర్హత వేటువేయడంపై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికార యూపీఏ కూటమి విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో 81 మంది ఎమ్మెల్యేలు పాల్గొనగా సోరెన్‌ కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ కావాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విశ్వాసపరీక్షలో హేమంత్‌ సోరెన్‌ కు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. యూపీఏ కూటమికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీజేపీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి ప్రత్యేక విమానంలో ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకున్నారు. అక్కడ వారిని విలాసవంతమైన రిసార్ట్‌లో ఉంచారు. రాష్ట్ర అతిథి గృహంలో ఎమ్మెల్యేలు కలిసి రాత్రి బస చేసి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు.

ఓటింగ్‌ కు ముందు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ... కమలం పార్టీ చేసిన చర్యల కారణంగానే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. అధికార కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి  బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారని.. బెంగాల్‌కు వారు వెళ్లడం వెనుక అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై విచారణకు వెళ్తున్న పోలీసులకు ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదనిహేమంత్ సోరెన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు తలపడే వాతావరణం సృష్టించాలనుకున్నారని,హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రోత్సహించాలని చూశారంటూ విమర్శించారు.

 

Sunday, 28 August 2022

 

బల నిరూపణ ప్రదర్శించుకునేందుకు సిద్ధమవుతున్న ఆప్

 


తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతోంది.

దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమయిందని ప్రజలకు తెలియచెప్పేందుకు సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను పక్కన పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ 40 మంది శాసన సభ్యులను తమ పార్టీ నుంచి తప్పించాలని చూసిందని, అందుకోసం ఒక్కొక్కరికీ రూ. 20 కోట్ల రూపాయిలను లంచంగా ఇవ్వాలని చూసిందని ఆరోపించారు.

గత వారం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో శాసన సభ్యులతో సమావేశమయ్యారు. మొత్తం 62 మంది ఆప్ శాసన సభ్యులకు గాను 53 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కూడా బీజేపీలో చేరితే ఆయన పై పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని చెప్పారని ఆరోపించారు.

దిల్లీలో మద్యం కుంభకోణానికి సంబంధించి మనీష్ సిసోడియా ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మరొక 14 మందితో పాటు సిసోడియా పై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఆయన పై ఈడీ మనీ లాండరింగ్ కేసును కూడా నమోదు చేసింది.

దిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను, 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండగా, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి.

 

Friday, 26 August 2022

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...