Thursday 23 June 2022

 

నర్సింగ్ స్టూడెంట్ మిస్సింగ్ …. హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

 

 

 

తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్‌ ప్రాంతం చిలుకానగర్‌‌లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు. ఇటు మరో అడ్వొకేట్ దేవేంద్రతో పాటుగా చేగుంటకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోదాలు ముగియగానే అడ్వొకేట్ శిల్పను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. గచ్చిబౌలి కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది.

ఏపీలోని విశాఖపట్నంలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్పతో పాటు దేవేంద్ర, మరో సామాజిక కార్యకర్తపై అభియోగాలున్నాయి. విశాఖపట్నంలో మిస్సింగ్‌ కేసుగా నమోదైన ఈ కేసును తాజాగా ఎన్‌ఐఏకు అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్ప, తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తమ కూతురు రాధను కిడ్నాప్ చేశారని గతంలో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు శిల్ప, దేవేంద్ర తదితరులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో వివరించారు. వైద్యం పేరుతో రాధను దేవేంద్ర తీసుకెళ్లినట్లు.. ఆ తర్వాత తన కూతురు ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...