నర్సింగ్ స్టూడెంట్ మిస్సింగ్ …. హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్ఐఏ
సోదాలు
తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు
సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్లోని ఆమె నివాసంలో
ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు. ఇటు మరో అడ్వొకేట్ దేవేంద్రతో
పాటుగా చేగుంటకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ
క్రమంలోనే సోదాలు ముగియగానే అడ్వొకేట్ శిల్పను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు..
గచ్చిబౌలి కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది.
ఏపీలోని విశాఖపట్నంలో మూడేళ్లుగా
కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్పతో
పాటు దేవేంద్ర, మరో సామాజిక కార్యకర్తపై అభియోగాలున్నాయి. విశాఖపట్నంలో
మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసును తాజాగా ఎన్ఐఏకు అప్పగించారు. విశాఖ పోలీసులు
నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు శిల్ప, తదితరులపై
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
No comments:
Post a Comment