‘సాలు
దొర, సెలవు దొర’...‘సాలు మోదీ, సంపకు మోదీ’...
హైదరాబాద్
అంతా కేసీఆర్, నరేంద్ర
మోదీ ఫ్లెక్సీలతో నిండి పోయింది. జులై 2, 3న హైదరాబాద్లో
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ
వస్తున్నారు. జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్లో
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో
నగరాన్ని నింపేసింది బీజేపీ. మరొకవైపు దీనికి పోటీగా తమ పనితీరుకు సంబంధించిన
హోర్డింగ్లతో మెట్రో పిల్లర్లు, బస్ స్టాప్లను
నింపేసింది తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ జాతీయ కార్యవర్గ
సమావేశం సందర్భంగా మరొకసారి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య
విమర్శలు, ప్రతి విమర్శలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా
బీజేపీతో కేసీఆర్ ఢీ కొడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఫ్లెక్సీలు పెట్టే
అవకాశం తమకు లేకుండా చేయడానికే మెట్రో పిల్లర్లు, బస్
స్టాప్స్ వంటి వాటిని తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలతో నింపేశారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇటీవల ‘సాలు దొర, సెలవు దొర’
అంటూ తెలంగాణ బీజేపీ కార్యాలయంలో డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు.
ఆ బోర్డు తీసి వేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీపై బోర్డులు పెడతామని టీఆర్ఎస్
పార్టీ నేతలు హెచ్చరించారు. ఆ తరువాత హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర
ప్రాంతాల్లో ‘సాలు మోదీ, సంపకు
మోదీ’ అనే ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్
వేదికగా టీఆర్ఎస్, బీజేపీ బలప్రదర్శనకు దిగాయి.
పోటాపోటీగా కేసీఆర్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలు వెలిశాయి
దక్షిణ భారత్లో విస్తారించాలని చూస్తున్న బీజేపీ, తెలంగాణ
మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా కాలం కిందటే కర్నాటకలో అధికారం చేపట్టినా ఇంత
వరకు మరో దక్షిణ భారత రాష్ట్రంలో పాగా వేయలేక పోయింది బీజేపీ. కేసీఆర్
ఫ్లెక్సీలతో నిండిపోయిన హైదరాబాద్ మెట్రో పిల్లర్లు. హైదరాబాద్ మెట్రో
పిల్లర్ల నిండా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు...రాజుల సొమ్ము రాళ్ళ పాలు
ReplyDeleteనేడు....ప్రజల సొమ్ము నీళ్ళ పాలు
ఎం చేస్తాం సార్ ఇలాఉన్నారు మన పాలకులు
ReplyDelete