Sunday 3 July 2022

 

విప్లవ వీరుడికి  ఘన నివాళి



మన్యం వీరుడు, అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి  వేడుకలు ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వస్తున్నారు.

మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి  Narendra Modi సోమవారం,  భీమవరం వస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో ప్రధాని పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే సభ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. వర్షం కురిసినా సభకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా రెక్సిన్ టెంట్లు వేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షత్రీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం మొత్తం మూడు వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొద్దిమంది ఉంటారు. రెండో వేదికపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలు ఉంటారు. మూడో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రధాని భీమవరం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించారు. దాదాపు 3వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సభా వేదికను ఎస్పీజీ టీమ్ అధీనంలోకి వెళ్లిపోయింది. సభకు ఒక రోజు ముందు నుంచే బయటి వ్యక్తులు వేదిక వద్దకు వెళ్లకుండా నిలిపేశారు. ప్రధాని  సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే నాలుగు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. వాతారవణం అనుకూలిస్తే హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు. లేదంటే హనుమాన్ జంక్షన్, ఏలూరు, నారాయణపురం, గణపవరం మీదుగా రోడ్డు మార్గంలో భీమవరం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 11-15 గంటల నుంచి 12-15 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే అల్లూరి సీతారామరాజు 125వ వర్ధంతి వేడుకల్లో ఆయన వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అల్లూరి సోదరుడు సత్యనారాయణ రాజు కుమారుడు, కుమార్తె, కోడలు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యలను గుర్తించి భీమవరం పిలిపించారు. అలాగే మన్యంలో అల్లూరికి ప్రధాన అనుచరుడిగా ఉన్న గంటదొర వారసులతో పాటు మరికొందరితో  స్వయంగా మాట్లాడనున్నారు.

2 comments:

  1. బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల, మన తెలుగు నేల

    ReplyDelete
  2. బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన మన్యం వీరుడు అల్లూరి

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...