Sunday 3 July 2022

 

మినరల్ వాటర్ ముట్టని గ్రామస్తులు




 ఆ ఊరి జనానికి మినరల్ వాటర్ గురించి తెలియదు. మంజీరా వాటర్‌తో అవసరం లేదు. అలాగని నల్లా నీళ్లు, కుళాయి వాటర్‌ అంతకంటే వాడరు. ఊరంతా తిరిగినా ఒక్క బోరు కూడా కనిపించదు. మరి వాళ్లందరూ ఏం తాగుతున్నారు..మంచినీళ్ల అవసరాల కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

ఏ గ్రామంలోనైనా నీళ్లు కావాలంటే బోర్ వేస్తారు. కాని అక్కడ మాత్రం బోర్ వేస్తే చుక్క నీరు కూడా పడదు. ఏకంగా బావి తొవ్వాల్సిందే. ఊరికి మంచినీటి నల్లాలు, మినరల్ వాటర్‌ తరలించేందుకు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికి గ్రామస్తులు వాటిని ముట్టుకోరు. తెలంగాణలో అన్నీ గ్రామాలు ఒక ఎత్తు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామం ఒక ఎత్తు. ఎందుకంటే ఏ గ్రామంలోనైనా వీధికో మంచినీళ్ల పంపు లేదంటే గల్లీకో నల్లా ఉంటుంది. కాని ఇక్కడ ప్రతి ఇంటి ముందు ఓ బావి కనిపిస్తుంది భూంప‌ల్లి గ్రామంలో సుమారు 565 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులంతా వ్యవసాయంపైన అధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరికి మినరల్ వాటర్ అంటే ఏమిటో ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ప్రభుత్వమే వాళ్లకు మినరల్ వాటర్‌ సప్లై చేసినా తాగమంటున్నారు గ్రామంలోని ప్రతి ఇంటికో బావి ఉంది. పురాతన కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్లంతా బావిలో నీళ్లు తోడుకొని తాగుతూ ఉండేవారు. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న వాళ్లు సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు భూంప‌ల్లి గ్రామంలో నీటి అవసరాలు తీర్చడానికి వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికీ నల్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. కాని గ్రామస్తులు ఏమాత్రం వాడుకోరు. బావిలోంచి వచ్చే నీరునే స్వచ్ఛమైన  నీరుగా భావిస్తున్నారు. అందుకేనేమో ఇక్కడ బోర్ వేస్తే చుక్క నీరు పడదు. అదే బావి తొవ్వితే ..15అడుగుల నుంచి 60అడుగుల వరకు నీరు ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలం మాత్రమే కాదు మండు టెండలు ఉండే వేసవి కాలంలో కూడ గ్రామంలోని బావుల్లో పుష్కలంగా నీరు కనిపిస్తుంది. చేద బావి నీరు స్వచ్ఛమైనదని ఆరోగ్యానికి మంచిదని గ్రామ‌స్తులు న‌మ్ముతున్నారు అందుకే పూర్వికుల నుంచి వస్తున్న ఈ బావినీరు తాగే సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు భూంప‌ల్లి వాసులు. గతంలో ఇళ్లు ఉన్నవారే కాదు... కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు సైతం ముందుగా ఇంటి దగ్గర బావి తొవ్విస్తారు ఇప్పుడే కాదు పూర్వం కూడా గ్రామంలో ప్ర‌తి ఇంటి ముందు చేద బావి ఉండేదని .. ఇంటి ముందు బావి ఉంటే ఇంట్లో లక్ష్మి ఉన్నట్లుగా భావిస్తామని భూంపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఏమైనా సహజసిద్దమమైన భూగర్భజలాన్ని ఎప్పటికప్పుడు తోడుకోని త్రాగడం వల్లే ఇక్కడి గ్రామస్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటున్నారు. వాటర్‌ ఫిల్టర్‌లు, ఫ్రిజ్‌లు వాడాల్సిన అవసరం కూడా తమకు లేదంటున్నారు గ్రామస్తులు ఆధునిక సౌకర్యాలు, వసతుల కోసం జనం వెంపర్లాడుతున్న ప్రస్తుత కాలంలో భూంపల్లి గ్రామస్తులు ఈవిధంగా బావిలోని నీళ్లను తోడుకొని ఇంటి అవసరాలు, తాగునీరు కోసం వాడుకోవడం స్వాగతించదగిన పరిణామంగా చూడాలి బావి నీళ్లలో ఉండే లవణాలు, శుద్ధత ట్యాంకుల ద్వారా సప్లై చేసే వాటిలో ఉండవని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకేనేమో పూర్వం నుంచి వస్తున్న అలవాటునే ఇప్పటికి కొనసాగిస్తున్నారు భూంపల్లి గ్రామస్తులు.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...