Friday 1 July 2022

 

జీఎస్టీకి అర్ధ దశాబ్దం 


జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజున 2017లో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జీఎస్టీ అర్ధ దశాబ్ద వేడుకలు జరుపుకుంటోన్న ఈ తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూన్ నెల వసూళ్ల డేటాలో ఖజానాకు భారీగా రెవెన్యూలు వచ్చినట్టు తెలిసింది. జూన్ నెలలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు వెల్లడైంది

GST : దేశంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) అమల్లోకి తెచ్చి నేటికి అర్ధ దశాబ్దం అయిన సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూన్ నెల వసూళ్ల డేటాలో ఖజానా ఘల్‌ఘల్ మంది. జూన్ నెలలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లైనట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ వసూళ్లు 56 శాతం పెరిగాయి. 2021 జూన్ నెలలో జీఎస్టీ పన్ను వసూళ్లు రూ.92,800 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల పైన ఉంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, మెరుగైన పన్ను ఎగవేత చర్యలతో జీఎస్టీ పన్ను వసూళ్లు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు జీఎస్టీ అమల్లోకి వచ్చి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. జూలై 1, 2017న జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ ఇది. పరోక్ష పన్ను విధానంలో జీఎస్టీ గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే ట్యాక్స్ అనే విధానంలో భాగంగా జీఎస్టీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. సేవా పన్ను, వ్యాట్, కొనుగోళ్ల పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, వంటి పలు రకాల పన్నులు రద్దయ్యాయి. వీటిని జీఎస్టీ రీప్లేస్ చేసింది. అయితే పెట్రోలియం, ఆల్కాహాల్, స్టాంప్‌ డ్యూటీలు ఇంకా జీఎస్టీ పరిధిలోకి రాలేదు అయితే జీఎస్టీ విధానం అమల్లోకి తెచ్చే ప్రతిపాదనకు 2000 ఏడాదిలోనే బీజం పడింది. జీఎస్టీ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. 2004లో ఈ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత రెండేళ్లకు అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం దేశంలో 2010 నుంచి జీఎస్టీని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ విధానం 2010లో అమల్లోకి రాలేకపోయింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలతో ఈ విధానం అమలుకు బ్రేక్ పడింది. కొత్త పన్ను విధానం దేశంలో అమల్లోకి రావడానికి 17 ఏళ్లు పట్టింది. 2016లో జీఎస్టీకి లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలపడంతో.... జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. దేశంలో జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమల్లోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిలే జీఎస్టీ రేట్లను నిర్ణయిస్తుంది.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...