Monday, 8 August 2022

 

        స్వర్ణం సింధూ!

 


 

కామ‌న్వెల్త్ గేమ్స్- 2022లో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బంగారు ప‌త‌కం సొంతం చేసుకుంది. 

కెన‌డా షట్ల‌ర్ లీపై పీవీ సింధు విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల బ్యాడ్మింట‌న్ సింగిల్స్ ఈవెంట్ లో పీవీ సింధు కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఛాంపియ‌న్ గా నిల‌వ‌డం ఇదే తొలిసారి. కామ‌న్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో భార‌త్ కు ఇదే తొలి బంగారు ప‌త‌కం కావ‌డం విశేషం.

బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ కెన‌డా షట్ల‌ర్ మిచెల్లీ లీని సింధు మ‌ట్టిక‌రిపించింది. మొద‌టి నుండి అధిప‌త్యం క‌న‌బ‌రుత‌స్తూ (21-15, 21-13) ప్ర‌త్య‌ర్థిపై ఘ‌న‌విజ‌యం సాధించి విజేత‌గా నిలిచింది.

2014లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో ర‌జత ప‌త‌కాలు గెలిచిన చివ‌రికి ఈసారి స్వ‌ర్ణం గెలిచి త‌న ఖాతాలో స‌రికోత్త రికార్డ్ నెల‌కొల్పింది

 

 

 

తెలంగాణ‌లో ఓ రేంజ్‌లో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌నుంది.

 



ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ సై అంటోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఉప ఎన్నిక ఫ‌లితం ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా  ఉన్నా అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్రభావం  ప‌డ‌నుంది. ఇదే సంద‌ర్భంలో ఈ ఉప ఎన్నికను రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేలా మ‌లుచుకోవాల‌ని టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా  అడుగులు వేస్తోంది. గ‌తంలో హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలు కావ‌డం టీఆర్ఎస్‌కు గుణ‌పాఠం నేర్పింది.

దీంతో ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి టీఆర్ఎస్ కావాల్సిన‌న్ని పాఠాలు నేర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో మాత్రం ఓట‌మి పున‌రావృతం కాకూడ‌ద‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీని చావు దెబ్బ‌తీసి, రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించ‌డానికి టీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డ‌నుంది.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డ‌మే ఆల‌స్యం, వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఆమోదించారు. ఇంత వేగంగా రాజీనామాను ఆమోదించ‌డం ద్వారా .... ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌నే సంకేతాల్ని టీఆర్ఎస్ పంపింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాపై కాల‌యాప‌న చేసి, అన‌వ‌స‌ర చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌త్య‌ర్థుల‌కు రాజీనామా ఆమోదంతో హెచ్చ‌రిక పంపింది. ఇక ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌నే ఆల‌స్యం. త‌ల‌ప‌డేందుకు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు చివ‌రి ఉప ఎన్నిక కానుండ‌డంతో తెలంగాణ‌లో ఓ రేంజ్‌లో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌నుంది.

 

Wednesday, 27 July 2022

 

 కామన్వెల్త్ మన తెలుగోళ్లులో మెరిసేనా!!  


 

నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటి వరకైతే కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత్ మంచి ప్రదర్శననే కనబర్చింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత్ 26 బంగారు పతకాలతో సహా 66 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3లో నిలవడమే లక్ష్యంగా రెండొందల పైచిలుకు అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది.
ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుమీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పుల్లెల గాయత్రి.. బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీ పడుతున్నారు. టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకుల శ్రీజ, అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యెర్రాజి జ్యోతి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎతిమరపు రజని, క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు తరఫున సబ్బినేని మేఘన బరిలో ఉన్నారు. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్
లో తెలుగు ప్లేయర్లు మూడు గోల్డ్ సహా 8 పతకాలు సాధించారు. మరీ ఈసారి ఆ ప్రదర్శనను కొనసాగిస్తారో.. లేదో చూడాలి. గత ఎడిషన్లో భారత షట్లర్లు రెండు గోల్డ్ సహా ఆరు మెడల్స్తో సత్తా చాటారు. ఈ సారి అదే స్థాయి పెర్ఫామెన్స్ చేస్తారని అంతా ఆశిస్తున్నారు. గోల్డ్కోస్ట్లో విమెన్స్, మెన్స్ సింగిల్స్లో సిల్వర్ మెడల్స్ నెగ్గిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఈసారి గోల్డ్పై గురి పెట్టారు. ఈ మధ్యే స్విస్ ఓపెన్ టోర్నీ నెగ్గిన సింధు ఫామ్లోకి వచ్చింది. థామస్ కప్లో ఇండియాకు తొలి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించిన శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే జోరును బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు.

భారత డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టితో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ సుమీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. అశ్విని పొన్నప్పతో కలిసి ఎలాగైనా పతకం రాబట్టాలని ఆశిస్తున్నాడు. ఈ మధ్య విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూతురు పుల్లెల గాయత్రి తొలిసారి కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచింది. వీళ్లంతా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సత్తా చాటితే భారత్‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలబెట్టుకోవడం ఖాయం

గత రెండేళ్ల నుంచి‌‌ జోరు కనబరుస్తున్న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ బాక్సర్ నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెచ్చుకున్న ఆమె... ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరును ఇక్కడా కొనసాగించి తొలి ప్రయత్నంలోనే కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలిసారి 50 కేజీ కేటగిరీలో పోటీ పడుతున్న నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ గేమ్స్ కోసం పక్కాగా ప్రిపేర్ అయింది. ఇక, మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత ఎడిషన్లో 56 కేజీ కేటగిరీలో బ్రాంజ్ నెగ్గాడు. ఈసారి 57 కేజీ కేటగిరీలో పోటీ పడుతున్న ఈ ఆర్మీ బాక్సర్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన

 కనబర్చాలనుకుంటున్నాడు. ఇక మహిళల హాకీ టీమ్‌లో గోల్ కీపర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన

 ఎతమరపు రజని ఎంపికైంది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు.. అదే జోరును కొనసాగిస్తే పతకం ఖాయం. కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడే జట్టులో సబ్బినేని మేఘన చోటు దక్కించుకుంది. కానీ, తను కరోనా బారిన

 పడటంతో టోర్నీలో పాల్గొంటుందో లేదో చూడాలి. తొలి రెండు మ్యాచ్‌లకు అయితే ఆమె దూరంగా ఉండనుంది.

భారత టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఇప్పుడు సెన్సేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఈ మధ్యే నేషనల్ టీటీలో

 విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఆమె తొలిసారి కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికైంది. ప్రస్తుతం శ్రీజ మంచి

 ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ తను కీలక ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 కానుంది. మరోవైపు అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీకి చెందిన యెర్రాజి జ్యోతి 100 మీ. హర్డిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుస

 రికార్డులతో పేరు తెచ్చుకుంటోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన 22 ఏండ్ల జ్యోతి మేలో మూడు వారాల్లోనే మూడు సార్లు నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.

Tuesday, 26 July 2022

 నాటి సైనికుల పోరాట స్పూర్తి చిరస్మరణీయం

1999లో లడఖ్‌లోని కార్గిల్‌లోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోవాలకున్న పాక్ సైన్యం, ఉగ్రవాదులకు  ఇండియన్ ఆర్మీహడల్ పుట్టించింది. ఆపరేషన్‌ విజయ్‌పేరుతో సైనిక చర్య ప్రారంభించి పాకిస్థాన్ సైనికులు ఆక్రమించుకున్న అన్ని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. మే 8, 1999న ప్రారంభమైన ఈ యుద్ధంలో మన సైన్యం ధైర్యసాహసాలతో పాటు అద్భుతమైన యుద్ధ వ్యూహాలు ప్రదర్శించింది. ఈ సమయంలో 527 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్‌లో దాదాపు మూడు నెలల పాటు యుద్ధం జరిగిన తర్వాత జులై 26, 1999న భారత సైనికులు పాకిస్థాన్ సైన్యంపై తమ విజయాన్ని ప్రకటించారు. శత్రు సైనికులు వాస్తవాధీన రేఖ వెంబడి ఆక్రమించిన పర్వతాలన్నిటినీ మళ్లీ స్వాధీనం చేసుకుని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జులై 26న విజయ్ దివస్ మనమందరం జరుపుకుంటున్నాం.

కాగా ఈ యుద్ధంలో పాక్‌పై విజయం సాధించి నేటికి 23 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా భారతీయులందరూ ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటూ.. యుద్ధంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. భారత సైనికుల పరాక్రమానికి సెల్యూట్ చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ముర్ము, రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. మంగళవారం అంటే ఈ రోజు ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులైన  ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ప్రస్తుతం అప్పటి కార్గిల్ వార్‌కి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. మంగళవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ విజయ్ దివస్ మన సైనిక దళాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక అని, భారతమాతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నానని, దేశప్రజలందరూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి

 భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము

 

Monday, 25 July 2022

 

పాకిస్తాన్‌లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ

 


పాకిస్తాన్‌లో తొలి హిందూ డీఎస్పీగా మనీషా రూపేటా రికార్డులకెక్కారు. అమ్మాయిలు మెడిసిన్ తప్ప మరే ఇతర కోర్సుల్లో కూడా చేరకూడదన్న నిబంధనలున్నా.. ఆమె తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు పేరు మనీషా రూపేటా.  పాకిస్తాన్ లో తొలి హిందూ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్. సింధ్ దగ్గరున్న చిన్న పట్టణం జాకోబా బాద్ తన  ఊరు. స్కూలు చదువు అంతా అక్కడే సాగింది. అక్కడ అమ్మాయిలను చదివించే ట్రెండ్ లేదు. అమ్మాయిలను చదివించడానికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరు.

ఎవరైనా ఉన్నత విద్య అభ్యసించినా కూడా వారికి ఎంబీబీఎస్ తప్ప వేరే కోర్సు చేసే అవకాశం లేదు. చేస్తే ఎంబీబీఎస్ చేయాలి, లేదా ఉద్యోగం మానేయాలి. ఎంబీబీఎస్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయితే వారికి మరొక కోర్సులో చేరే అవకాశమే ఉండేది కాదు. అలాంటి వాళ్లంతా చదువును ఆపేయడం తప్ప మరో మార్గం లేదు.  రూపేటా ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష లో అర్హత సాధించలేదు. దాంతో, ఫిజికల్ థెరపీ కోర్సు ఎంపిక చేసుకున్నారు

మహిళలపై హింస జరిగే సమాజంలో వారికి రక్షణ కల్పించే స్థానాల్లో మహిళలు ఉండాలని తన  అభిప్రాయం. మహిళా రక్షకులు ఉండాల్సిన అవసరముంది. ఈ ఆలోచనే నేను పోలీసు ఉద్యోగం ఎంపిక చేసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని రూపేటా చెప్పారు

నేను ఒక్క మా సమాజానికి మాత్రమే ప్రతినిధిని కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతీ అమ్మాయికి ప్రతీకగా నిలుస్తూ, ప్రాతినిధ్యం వహిస్తాను. చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పెద్ద పెద్ద కలలు ఉంటాయి.

బలవంతంగా మత మార్పిడులు చేయడం, అమ్మాయిలను అపహరించడం లాంటి వ్యవహారాలను మతపరమైన అంశాలుగా చూడటాన్ని నేను అంగీకరించను. ఇదొక సాంఘిక సమస్య. ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి పారిపోతే, ఆ అంశం చుట్టుపక్కల ఉన్నవారందరినీ ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం సమాజంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యను మరింత విస్తృతంగా చూస్తే, ఇది సామాజిక ఆర్ధిక సమస్యగా కనిపిస్తుంది.

ఇలాంటి కారణాల వల్లే, మేధో వలసలు జరుగుతున్నాయి. ఇక్కడున్న భద్రతా కారణాల వల్ల చాలా మంది వలస వెళ్లిపోతున్నారు.

అందరూ కలిసి పని చేయడమే దీనికి పరిష్కారం. నేరం నేరమే. తప్పు తప్పే. బాధితులు ఎవరైనప్పటికీ అది మొత్తం సమాజం పై ప్రభావం చూపిస్తుంది.

నాకు ఎనలేని స్పందన లభించింది. మా చుట్టుపక్కల వారు కూడా అందరూ నన్ను ప్రశంసించారు.

జాతి మొత్తం ప్రశంసించింది. ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ మా బంధువుల్లో కొంత మంది మాత్రం నేనీ ఉద్యోగాన్ని ఎక్కువ కాలం చేయలేనని అంటున్నారు. నేను ఈ రంగంలో కొనసాగలేనని మాట్లాడుతున్నారు.

నా గురించి ప్రత్యేకంగా వారికి ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ, అమ్మాయిలు పోలీసు అధికారులు కాలేరనే సమాజంలో నెలకొన్న సాధారణ అభిప్రాయం వారు అలా మాట్లాడేలా చేస్తోంది. ఆ భయంతోనే వారలా మాట్లాడుతున్నారు.

వారికున్న మూస అభిప్రాయాల వల్లే అమ్మాయి ఈ ఉద్యోగంలో కొనసాగలేదని అభిప్రాయపడుతున్నారు. వారు కూడా వారి పిల్లలను ఈ వృత్తిని ఎంచుకోవడానికి అంగీకరించి ఉండరు.

పితృస్వామ్య సమాజంలో పురుషులు మాత్రమే పోలీసు వృత్తిలో రాణించగలరని అనుకుంటారు. అది వారి అభిప్రాయం.

మరో ఒకటి, రెండేళ్లలో వాళ్ళ మాటలను వెనక్కి తీసుకుంటారని నేననుకుంటున్నాను. అప్పటికి వారింట్లో కూడా ఒక అమ్మాయి పోలీసు వృత్తిని ఎంచుకోవచ్చు.

నేనొక ప్రైవేటు అకాడెమీలో పాఠాలు చెబుతున్నాను. నేను టీచింగ్ మాత్రమే కాకుండా విద్యార్థులకు మార్గదర్శకత్వం కూడా వహిస్తాను. నా మార్గదర్శకత్వంలో చాలా మంది అమ్మాయిలు ముందుకు వెళతారనే ఆలోచన ఈ పని చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉండొచ్చు.

 

 

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు  ప్రమాణస్వీకారం.



భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వేడుకలా జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షిగా దేశ ప్రధమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె తొలి సందేశం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగాన్ని.. మాజీ రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారాలతో మొదలుపెట్టి.. ప్రియమైన దేశవాసులారా..అంటూ కొనసాగించారు. ఇప్పటిదాకా పనిచేసిన రాష్ట్రపతుల్లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన అబ్దుల్ కలాం కొటేషన్ కలలు కనండి..కి కొనసాగింపుగా ఇప్పుడు ద్రౌపది ముర్ము సందేశమిచ్చారు. దేశంలో అట్టడుగు పేదలు సైతం కేవలం కలలు కనడమేకాదు.. వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని తన జీవిత గమనం రుజువు చేస్తుందని ముర్ము వ్యాఖ్యానించారు

‘‘భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిని చేపట్టిన సందర్భంగా దేశంలోని చట్టసభలు అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోట్ల మంది విశ్వాసం, నమ్మకాల ఆధారంగా నడిచే పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు నా నమస్సులు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయత, సహయోగత వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఆజాదీకా అమృత్ మహోత్సవం సమయంలో నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నాం. భారత్ 50వ స్వాతంత్ర్య వేడుకల ఏడాదే నా రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ నాకీ గొప్ప అవకాశం లభించింది.. ఒడిశాలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ దేశ అత్యున్నత పదవి చేపట్టడం గర్వకారణంగా ఉంది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషన్ ఓ రుజువు. ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేయడమే అప్పట్లో నాకు కలగా ఉండేది. అలాంటి స్థాయి నుంచి ఇక్కడికి రాగలిగాను..

75వ స్వాతంత్ర్య దినోత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గౌరవంగా ఉంది. అంతేకాదు, స్వాతంత్ర్య

 భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగానూ నాకు అదృష్టం దక్కింది.

 స్వాతంత్ర్యయోధులు కలలుకన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా మనం పనిచేయాల్సిన

 అవసరం ఉంది. అందరి సహకారంతో ఉజ్వల యాత్రను కొనసాగించాల్సి ఉంది. సబ్ కా సాథ్.. సబ్

 కా కర్తవ్య్..నినాదంతో ముందకు వెళదాం..’’ అని తొలి సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 పిలుపునిచ్చారు.

Sunday, 24 July 2022

 

తెలంగాణలో అధికారం కోసం బిజెపి మాస్టర్ ప్లాన్

టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గ స్థాయిలో ఎండగట్టడానికి ఏది సరైన మార్గం..?

అసెంబ్లీలో తమకు సంపూర్ణ బలం ఉందని భావిస్తున్న కారు గుర్తు పార్టీ నేతలకు చెక్‌ పెట్టడం ఎలా

 ..? తమకున్న బలమైన నాయకత్వాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలపై

 బీజేపీ హైకమాండ్ గ్రౌండ్‌ వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది

అందుకే గతంలో ఎంపీలుగా పోటీ చేసిన సీనియర్‌ నేతలను ..ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపి తమ

 సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ పొలిటికల్ ఈక్వెషన్‌ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా అమలు చేసి టీఆర్ఎస్‌ను గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కమలనాథులు. గ్రేటర్

  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల రిజల్ట్స్

 చూసిన తర్వాత బీజేపీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ

 ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ని గట్టి దెబ్బ కొట్టేందుకు ప్రస్తుతం బీజేపీలో ఎంపీలుగా

 ఉన్నవాళ్లు, ఓడిపోయిన వాళ్లు, సీనియర్‌ నేతలను రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి

 దింపాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. ఇందులో ఎవరూ అతీతులు కాదన్నట్లుగా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ తరపున ఎంపీలుగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి

 కిషన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అంబర్‌పేట నుంచి రంగంలోకి దింపనుంది. అలాగే  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని వేములవాడ అసెంబ్లీ నుంచి,  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆర్మూర్‌ శాసనసభ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నెక్స్ట్ బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని పక్కా ప్రాణాళిక వేస్తోంది బీజేపీ. వీళ్లే కాదు ప్రస్తుతం

 బీజేపీలో ఫైర్ బ్రాండ్స్‌గా పేరు సంపాధించుకున్న విజయశాంతిని మెదక్ అసెంబ్లీ లేదంటే

 గ్రేటర్‌లోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట. బీజేపీ జాతయ

 ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనకు పట్టున్న గద్వాల నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని

 మహబూబ్‌నగర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తాండూరు లేదంటే మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి

 బరిలోకి దింపాలని చూస్తోంది బీజేపీ హైకమాండ్. గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఓడిన వివేక్‌

 సైతం చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఎంపీలు, ఓడిపోయిన ఎంపీలు, సీనియర్ నేతల సంగతి ఇలా ఉంటే ఉపఎన్నికల్లో హుజురాబాద్‌ నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ఇలాఖ నుంచి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈనేపధ్యంల ఆయన్ని గెలిపించిన హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి జమునను నిలబెట్టి డబుల్ విక్టరీ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పబ్లిక్‌ ఫిగర్‌లుగా ఉన్న వాళ్లతో పాటు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు

 గతంలో స్టేషన్‌ ఘనపూర్ నుంచి పోటీ చేసిన విజయరామారావును ఎంపీగా పోటీ చేయించాలనే

 ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ మధ్యకాలంలో

 వినిపిస్తున్న మాట కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బిజెపి లో చేరిక దాదాపు కాయం లాగా ఉంది

 అయన కూడా తన స్వంత ఇలాకా మునుగోడు నుండి పోటీ చేపిస్తారని ఊహ గణాలు

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...