Sunday, 3 July 2022

 

మినరల్ వాటర్ ముట్టని గ్రామస్తులు




 ఆ ఊరి జనానికి మినరల్ వాటర్ గురించి తెలియదు. మంజీరా వాటర్‌తో అవసరం లేదు. అలాగని నల్లా నీళ్లు, కుళాయి వాటర్‌ అంతకంటే వాడరు. ఊరంతా తిరిగినా ఒక్క బోరు కూడా కనిపించదు. మరి వాళ్లందరూ ఏం తాగుతున్నారు..మంచినీళ్ల అవసరాల కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

ఏ గ్రామంలోనైనా నీళ్లు కావాలంటే బోర్ వేస్తారు. కాని అక్కడ మాత్రం బోర్ వేస్తే చుక్క నీరు కూడా పడదు. ఏకంగా బావి తొవ్వాల్సిందే. ఊరికి మంచినీటి నల్లాలు, మినరల్ వాటర్‌ తరలించేందుకు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికి గ్రామస్తులు వాటిని ముట్టుకోరు. తెలంగాణలో అన్నీ గ్రామాలు ఒక ఎత్తు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామం ఒక ఎత్తు. ఎందుకంటే ఏ గ్రామంలోనైనా వీధికో మంచినీళ్ల పంపు లేదంటే గల్లీకో నల్లా ఉంటుంది. కాని ఇక్కడ ప్రతి ఇంటి ముందు ఓ బావి కనిపిస్తుంది భూంప‌ల్లి గ్రామంలో సుమారు 565 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులంతా వ్యవసాయంపైన అధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరికి మినరల్ వాటర్ అంటే ఏమిటో ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ప్రభుత్వమే వాళ్లకు మినరల్ వాటర్‌ సప్లై చేసినా తాగమంటున్నారు గ్రామంలోని ప్రతి ఇంటికో బావి ఉంది. పురాతన కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్లంతా బావిలో నీళ్లు తోడుకొని తాగుతూ ఉండేవారు. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న వాళ్లు సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు భూంప‌ల్లి గ్రామంలో నీటి అవసరాలు తీర్చడానికి వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికీ నల్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. కాని గ్రామస్తులు ఏమాత్రం వాడుకోరు. బావిలోంచి వచ్చే నీరునే స్వచ్ఛమైన  నీరుగా భావిస్తున్నారు. అందుకేనేమో ఇక్కడ బోర్ వేస్తే చుక్క నీరు పడదు. అదే బావి తొవ్వితే ..15అడుగుల నుంచి 60అడుగుల వరకు నీరు ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలం మాత్రమే కాదు మండు టెండలు ఉండే వేసవి కాలంలో కూడ గ్రామంలోని బావుల్లో పుష్కలంగా నీరు కనిపిస్తుంది. చేద బావి నీరు స్వచ్ఛమైనదని ఆరోగ్యానికి మంచిదని గ్రామ‌స్తులు న‌మ్ముతున్నారు అందుకే పూర్వికుల నుంచి వస్తున్న ఈ బావినీరు తాగే సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు భూంప‌ల్లి వాసులు. గతంలో ఇళ్లు ఉన్నవారే కాదు... కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు సైతం ముందుగా ఇంటి దగ్గర బావి తొవ్విస్తారు ఇప్పుడే కాదు పూర్వం కూడా గ్రామంలో ప్ర‌తి ఇంటి ముందు చేద బావి ఉండేదని .. ఇంటి ముందు బావి ఉంటే ఇంట్లో లక్ష్మి ఉన్నట్లుగా భావిస్తామని భూంపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఏమైనా సహజసిద్దమమైన భూగర్భజలాన్ని ఎప్పటికప్పుడు తోడుకోని త్రాగడం వల్లే ఇక్కడి గ్రామస్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటున్నారు. వాటర్‌ ఫిల్టర్‌లు, ఫ్రిజ్‌లు వాడాల్సిన అవసరం కూడా తమకు లేదంటున్నారు గ్రామస్తులు ఆధునిక సౌకర్యాలు, వసతుల కోసం జనం వెంపర్లాడుతున్న ప్రస్తుత కాలంలో భూంపల్లి గ్రామస్తులు ఈవిధంగా బావిలోని నీళ్లను తోడుకొని ఇంటి అవసరాలు, తాగునీరు కోసం వాడుకోవడం స్వాగతించదగిన పరిణామంగా చూడాలి బావి నీళ్లలో ఉండే లవణాలు, శుద్ధత ట్యాంకుల ద్వారా సప్లై చేసే వాటిలో ఉండవని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకేనేమో పూర్వం నుంచి వస్తున్న అలవాటునే ఇప్పటికి కొనసాగిస్తున్నారు భూంపల్లి గ్రామస్తులు.

 

డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు.. బిజెపి!!!

 

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయం, వరంగల్ భద్రకాళి, భద్రాచలం రాముడు, పాల్కురికి సోమనాథుడు, కాకతీయ రాజులు, రాణి రుద్రమ అంటూ తెలంగాణ చరిత్ర, సంస్కృతులను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'తెలంగాణ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను' అని మోదీ మొదట్లో తెలుగులో ప్రజలకు అభివాదం చేశారు.

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీజేపీ ప్రముఖ నేతలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశాల అనంతరం ఏర్పాటైన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు.

ఆ తరువాత మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రజాదరణ పెరుగుతూ వస్తోందని అన్నారు.

మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలు:

1. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో దక్కిన ఆదరణ నిరంతరం పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అద్భుత ఫలితాలు లభించాయి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ప్రజలు పట్టాలు వేస్తున్నారు.

2, గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి దాదాపు ఒక లక్ష కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

3. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. 2014లో తెలంగాణలో దాదాపు 2,500 కిలోమీటర్ల హైవే నెట్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది 5,000 కిలోమీటర్ల వరకు పెరిగింది.

4. హైదరాబాద్‌లో 1500 కోట్లు వెచ్చించి నాలుగు, ఆరు లైన్ల ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను కేంద్రం నిర్మిస్తోంది.

5. హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 350 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనుంది.

6. తెలంగాణలో నీటితో ముడిపడిన దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా విలువ చేసే అయిదు పెద్ద ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

7. దేశంలో నిర్మించే 7 టెక్స్‌ టైల్స్ పార్క్‌ల్లో ఒకటి తెలంగాణలో నిర్మిస్తాం.

8. హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటు చేయడానికి భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

9. కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చాం.

10. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ. 31,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఆమోదించాం.

 

 

 

లోయలో పడిన ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి

 


హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

‘‘సైంజ్ వ్యాలీలోని నియోలీ-షంషేర్ రహదారిలో ప్రయాణిస్తోన్న బస్సు జంగ్లా ప్రాంతంలో కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గాయపడిన పడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. బస్సులో పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు భావిస్తున్నాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని అశుతోష్ గార్గ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

అయితే, ఈ ఘటనలో 16 మంది మరణించారని అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.

‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

 

Saturday, 2 July 2022

దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు

 *హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు*


హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్


రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైలు దిగి పరుగులు తీశారు. భువనగిరి-పగిడిపల్లి మధ్య గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో రైలు చివరి బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. 


మంటలు చూసిన ప్రజలు భయంతో రైలు దిగి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అంటుకున్న బోగీ లగేజీ క్యారియర్ అని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరైనా గాయపడిందీ లేనిదీ తెలియరాలేదు.

Friday, 1 July 2022

 

 

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్..

 

మీరు ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. రైల్వే స్టేషన్లలో వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి స్టాల్‌లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండాల్సిందే. లేదంటే మాత్రం రైల్వేస్ వారికి భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దీని వల్ల రైల్వే ప్రయాణికులకు ఊరట కలుగనుంది. వెండర్లు ఎంఆర్‌పీ రేట్లకు మించి వస్తువులను విక్రయించలేరు.

 

యాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఇండియన్ రైల్వేస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. రైల్వే బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో కేటరింగ్ క్యాష్‌లెస్ పేమెంట్లకు ఆమోదం తెలిపింది. అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 2022 ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. అంటే వెండర్లు రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్లను స్వీకరించనున్నారు. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే.. వారికి రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంఆర్‌పీ రేటుకు మించి డబ్బులు తీసుకోకూడదు. ఎంఆర్‌పీ రూ. 15 ఉంటే.. గరిష్టంగా రూ. 15 మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. రైల్వే బోర్డు ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి అన్ని రైల్వే జోన్లకు, ఐఆర్‌సీటీసీ‌కి ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం చూస్తే.. ప్లాట్‌ఫామ్‌పై కేటరింగ్ సహా అన్ని స్టాల్స్‌లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండాలి. అలాగే ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలి. డిజిటల్ పేమెంట్స్‌కు యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్, స్వైప్ మెషీన్స్ వంటివి కలిగి ఉండాలి. రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలోని అన్ని స్టాళ్లలో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందుబాటులో లేకపోతే అప్పుడు రైల్వేస్ వెండర్లకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల వెండర్లు ప్రయాణికులకు నుంచి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం వీలు కాదు.

అంతేకాకుండా ట్రైన్ ప్యాసింజర్లు ఫుడ్ సరిగా లేకపోయినా, ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ ప్యాకెట్స్ పొందినా ఫిర్యాదు చేయొచ్చు. డిజిటల్ పేమెంట్స్, బిల్లులు లేకపోవడం వల్ల ప్యాసింజర్లు ఫిర్యాదు చేయడం కష్టంగా ఉండేది. క్యాష్‌లెస్ పేమెంట్ల ద్వారా ప్రయాణికులు ఫ్రెష్ ఫుడ్‌ను సరైన ధరలో పొందడానికి వీలుంటుంది. అయితే ఈ విధానం ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

 

జీఎస్టీకి అర్ధ దశాబ్దం 


జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజున 2017లో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జీఎస్టీ అర్ధ దశాబ్ద వేడుకలు జరుపుకుంటోన్న ఈ తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూన్ నెల వసూళ్ల డేటాలో ఖజానాకు భారీగా రెవెన్యూలు వచ్చినట్టు తెలిసింది. జూన్ నెలలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు వెల్లడైంది

GST : దేశంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) అమల్లోకి తెచ్చి నేటికి అర్ధ దశాబ్దం అయిన సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూన్ నెల వసూళ్ల డేటాలో ఖజానా ఘల్‌ఘల్ మంది. జూన్ నెలలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లైనట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ వసూళ్లు 56 శాతం పెరిగాయి. 2021 జూన్ నెలలో జీఎస్టీ పన్ను వసూళ్లు రూ.92,800 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల పైన ఉంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, మెరుగైన పన్ను ఎగవేత చర్యలతో జీఎస్టీ పన్ను వసూళ్లు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు జీఎస్టీ అమల్లోకి వచ్చి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. జూలై 1, 2017న జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ ఇది. పరోక్ష పన్ను విధానంలో జీఎస్టీ గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే ట్యాక్స్ అనే విధానంలో భాగంగా జీఎస్టీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. సేవా పన్ను, వ్యాట్, కొనుగోళ్ల పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, వంటి పలు రకాల పన్నులు రద్దయ్యాయి. వీటిని జీఎస్టీ రీప్లేస్ చేసింది. అయితే పెట్రోలియం, ఆల్కాహాల్, స్టాంప్‌ డ్యూటీలు ఇంకా జీఎస్టీ పరిధిలోకి రాలేదు అయితే జీఎస్టీ విధానం అమల్లోకి తెచ్చే ప్రతిపాదనకు 2000 ఏడాదిలోనే బీజం పడింది. జీఎస్టీ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. 2004లో ఈ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత రెండేళ్లకు అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం దేశంలో 2010 నుంచి జీఎస్టీని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ విధానం 2010లో అమల్లోకి రాలేకపోయింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలతో ఈ విధానం అమలుకు బ్రేక్ పడింది. కొత్త పన్ను విధానం దేశంలో అమల్లోకి రావడానికి 17 ఏళ్లు పట్టింది. 2016లో జీఎస్టీకి లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలపడంతో.... జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. దేశంలో జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమల్లోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిలే జీఎస్టీ రేట్లను నిర్ణయిస్తుంది.

 

ఆర్మీ క్యాంపు మీద విరిగిపడిన కొండ చరియలు..

నోనీ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని 107 టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఊహించని ఘటన సంభవించింది.

మణిపూర్‌లో  విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో Army camp) సమీపంలో.. భారీగా కొండ చరియలు (Land slide)  విరిగి పడ్డాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సంభవించింది. కాగా, తూపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ స్థలం సమీపంలోని 107 టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) క్యాంపు వద్ద బుధవారం రాత్రి జరిగిన భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో.. ఇప్పటికే తొమ్మిది మంది టీఏ జవాన్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున జవాన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

నది నుంచి మృతదేహాలను (Dead bodies) బయటకు తీయడానికి ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో.. పలువురు జవాన్లతో (Army jawans) సహా కనీసం 55 మంది ఆచూకి లభించలేదు. ఇజాయ్ నదికి సమీపంలో కొన్ని మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లడానికి అధికారులకు కష్టతరమైంది. దీంతో.. అధికారులు.. మృతదేహాలను బయటకు తీయడానికి నది దిగువన కష్టతరమైన భూభాగంలో ఎక్స్‌కవేటర్‌లను మోహరించారు. ఘటనలో.. కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలతో పాటు ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

జిరిబామ్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వరకు నిర్మించబడుతున్న రైలు మార్గానికి టెరిటోరియల్ ఆర్మీ భద్రతను అందిస్తుంది. శిథిలాల కింద కూరుకుపోయిన.. సిబ్బంది ఉనికిని గుర్తించడానికి గాలి ద్వారా త్రూ వాల్ రాడార్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు, టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బంది, ఐదుగురు పౌరులను రక్షించామని, తప్పిపోయిన సిబ్బంది కోసం రోజంతా అన్వేషణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వం నుంచి... మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹ 5 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...